Crime News : బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి..

కర్ణాటకలోని ఓ బాణాసంచా తయారీ కార్మాగారంలో ఆదివారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయాలపాలయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Crime News : బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి..

Karnataka : కర్ణాటక(Karnataka) లోని ఓ బాణసంచా(Fire Cracker) తయారీ ఫ్యాక్టరీలో విషాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పేలుడు(Explosion) సంభవించడంతో.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు. దక్షిణ కర్ణాటకలో బెల్తంగడిలోని కుక్కడి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ దర్ఘటన చేటుచేసుకుంది. ఈ పేలుడు శబ్ధం చాలా మైళ్ల దూరం వరకు వినిపించినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు.

Also Read: డిగ్రీ అర్హతతో ‘ఎన్‌ఆర్‌ఎస్‌సీ’లో ఉద్యోగాలు.. అప్లికేషన్ వివరాలివే

ప్రస్తుతం ఈ ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులు(Injuries) ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం పేలుడు సంభవించడంతో సమీపంలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పేశాయి. కానీ అప్పటిక అందులో చిక్కుకున్న ముగ్గురు కార్మికులు చనిపోయారు. మృతులను వర్గీస్ (62), స్వామి (60), చేతన్ (24)లుగా గుర్తించారు. అయితే ఆ ఫ్యాక్టరీలో పేలుడు ఎలా సంభవించింది అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తు్న్నారు.

Also read: ఇండియా కూటమి కథ ముగిసింది.. జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment