Andhra Pradesh: రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవు.. మాజీ సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు

కేంద్రం ఇచ్చే రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవని మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఏపీకి రూ.లక్షా యాభై వేల కోట్లు కావాలని.. టీడీపీ ఇచ్చిన హామీల్లో ఏవీ అమలు చేయలేరని పేర్కొన్నారు. ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత ఆయన మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు.

New Update
Andhra Pradesh: రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవు.. మాజీ సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మాజీ సీఎం, వైసీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్‌ రెడ్డి స్పందించారు. కేంద్రం ఇచ్చిన రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవని అన్నారు. ఏఏపీలో ప్రభుత్వ పాలను వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలో వైఎస్‌ జగన్‌.. తన పార్టీ నేతలతో కలిసి ధర్నా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ' కేంద్రం ఇచ్చే రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవు. ఏపీకి రూ.లక్షా యాభై వేల కోట్లు కావాలి. టీడీపీ ఇచ్చిన హామీల్లో ఏవీ అమలు చేయలేరు. లోకేష్‌ రెడ్‌బుక్‌ పోస్టర్లతోనే వాళ్ల ఉద్దేశం స్పష్టంగా తెలిసింది.

Also read: పట్టాలెక్కిన రాజధాని నిర్మాణం.. అమరావతి వెనుక ఎన్నో వివాదాలు, పోరాటాలు

రోడ్లమీదే దారుణ హత్యలకు పాల్పడుతున్నారు. 560 ప్రైవేట్ ఆస్తులు, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. మా పార్టీ నేతలు సొంత నియోజకవర్గాల్లోనే నలగలేకపోతున్నారు. మేము ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి పథకాన్ని డోర్‌ డెలివరీ చేశాం. చంద్రబాబు దొంగ హామీల వల్లే ఓడిపోయామని' అన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

Also read: ఈ సారి గోల్డ్ కొడతారా.. టీమిండియా హాకీ జట్టుపై కోటి ఆశలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment