Hyderabad Metro: హైదరాబాద్‌లో రానున్న మరో 13 మెట్రో స్టేషన్లు..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో మరో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన అధికారులతో కలిసి స్టేషన్ల స్థానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

New Update
Hyderabad Metro: మెట్రోలో ప్రయాణించేవారికి అలర్ట్.. సమయంలో మార్పులు

Hyderabad Metro Second Phase - 13 New Stations: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో మరో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న నాగోల్ స్టేషన్‌ సమీపంలో మొదటి స్టేషన్‌తో ప్రారంభమై.. ఆ తర్వాత నాగోల్‌ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆసుపత్రి, ఎల్బీనగర్‌ కూడలి, సాగర్‌ రింగ్‌రోడ్డు, మైత్రీనగర్‌, కర్మన్‌ఘాట్‌, చంపాపేట రోడ్‌ కూడలి, ఒవైసీ ఆసుపత్రి, డీఆర్‌డీవో, హఫీజ్‌ బాబానగర్‌, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో కొత్త మెట్రో స్టేషన్లు రాబోతున్నాయని పేర్కొన్నారు.

Also read: కేసీఆర్‌కు గౌరవం తగ్గిపోదు..

ఈ రూట్‌లో మెట్రోరైలు ఎలైన్‌మెంట్, స్టేషన్ల స్థానాలను ఖరారు చేసేందుకు శనివారం ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాగోల్ నుంచి చంద్రాయణగుట్ట (Nagole To Chandrayangutta) వరకు కొన్ని ఫ్లైఓవర్ల వల్ల స్టేషన్ల కోసం భూసేకరణ అనివార్యంగా మారిందని.. ప్రైవేటు ఆస్తులు కనిష్ఠంగా సేకరించేందుకు ప్రణాళికలు చేపట్టలాని అధికారులకు ఆదేశించారు. అలాగే మెట్రో రైలు స్టేషన్లకు సంబంధించి వాటి పేర్ల ఖరారుకు ట్రాఫిక్ పోలీసులు, సాధారణ ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలని సూచనలు చేశారు.

Also read: రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

బ్రిటిష్ వాళ్లను దేశం నుంచి తరిమినట్లే బీజేపీ పార్టీని కూడా ఓడించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చాడు. అహ్మదాబాద్‌లో నిర్వహించిన AICC మీటింగ్‌లో CM రేవంత్ రెడ్డి మాట్లాడారు. మోదీ మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని చీల్చాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు.

New Update
revanth reddy AICC meeting

స్వతంత్య్ర పోరాటంలో ఇండియా నుంచి బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టినట్లే బీజేపీని ఓడించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుజరాత్ సబర్మతి ఆశ్రమంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌కు ఆయన హాజరైయ్యారు. మోదీ మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని చీల్చాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ, బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా.. గాడ్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తూ బీజేపీ పని చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు.

Also read: Viral video: రన్నింగ్ ట్రైన్‌ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్

తెలంగాణలో కులగణన చేసినట్లే దేశావ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వమని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీని ఓడించడానికి దేశంలో ఉన్న గాంధేయవాదులంతా ఏకంకావాలని ఆయన సూచించారు. ఆయనతోపాటు రాష్ట్ర ముఖ్య నాయకులు కూడా ఏఐసీసీ సమావేశంలో పాల్గొన్నారు.

Also read: Assembly: అసెంబ్లీ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న MLAలు (VIDEO)

Advertisment
Advertisment
Advertisment