Heavy rains: భారీ వర్షాలు.. భవనం కూలి మహిళ మృతి

గత కొద్ది రోజులుగా ముంబయిలో భారీ వర్షాల కారణంగా శనివారం ఓ భవనంలోని ఒక భాగం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 13 మందిని రక్షించారు.

New Update
Heavy rains: భారీ వర్షాలు.. భవనం కూలి మహిళ మృతి

గత కొద్ది రోజులుగా ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో శనివారం ఓ భవనం కలిపోయింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఇక వివారాల్లోకి వెళ్తే.. గ్రాంట్‌ రోడ్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉదయం 10.30 గంటలకు భారీ వర్షాలు కురిశాయి. దీంతో శనివారం ఓ భవనంలో ఒక భాగం కూలిపోయిది. దీంతో ఓ మహిళ మృతి చెందగా మరో ముగ్గురు గాయాలపాలయ్యారు.

Also Read: గుడిసెను ఢీకొట్టిన ట్రక్కు..నిండు గర్భిణీతో పాటు కుటుంబం మొత్తం..!

భవనంలో ఒక భాగం పూర్తిగా కూలిపోయింది. మరికొంత భాగం ప్రమాదకరంగా వేలాడుతూ కనిపిస్తోంది. సమాచారం ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 13 మందిని రక్షించారు. భవనంలోని నివాసితులు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని.. వాళ్లని బయటకు తెచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

Also Read: భారీ వరదలు.. వంతెన కూలి 11 మంది మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు