No Petrol :పెట్రోల్ అయిపోయింది... గుర్రం మీద డెలివరీ

దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు రెండురోజుల పాటూ సమ్మె చేయడంతో పెట్రోల్‌కు విపరీతమైన కొరత ఏర్పడింది. దీంతో చాలామంది వాహనదారులు పెట్రోల్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఇదే ప్రాబ్లెమ్ ఫేస్ చేసిన ఒక డెలివరీ బాయ్ ఆప్షన్ లేక గుర్రం మీద వెళ్ళి మరీ డెలివరీ చేశాడు.

New Update
No Petrol :పెట్రోల్ అయిపోయింది... గుర్రం మీద డెలివరీ

Delivery on Horse : హిట్ అండ్ రన్(Hit and Run) కొత్త యాక్ట్ ప్రజల తల ప్రాణం తోకకు తెస్తోంది. దీనికి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు(Truck Drivers) సమ్మె చేయడం ఏమో కానీ నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ దొరక్క జనాలు మాత్రం తెగ ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి నుంచి పెట్రోల్ బంకులు ముందు పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ కూడా పాపం ఇలాగే నానాపాట్లు పడ్డాడు. పెట్రోల్ కోసం నాలుగు గంటలు క్యూ లైన్‌లో నిల్చున్నాడు. అయినా పెట్రోల్ దొరకలేదు. దీంతో విసుగుచెంది ఏకంగా గుర్రం మీద ఫుడ్ డెలివరీ(Delivery on Horse) చేయడానికి వెళ్ళాడు.

Also Read:జపాన్‌లో 62కు చేరుకున్న మృతుల సంఖ్య

చంచల్ గూడలో గుర్రం మీద ఫుడ్ డెలివరీ చేయడానికి వెళతున్న వ్యక్తి అక్కడ అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు కాస్తా వైరల్ గా మారింది. సూపర్ ఐడియా అని కొందరు మెచ్చకుంటున్నారు. మరికొందరు డెలివరీ బాయ్ డెడికేషన్‌కు ముచ్చటపడుతున్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్న డెలివరీ బాయ్స్ మాత్రం ఎంచక్కా ఏ ఇబ్బందులూ పడకుండా తమపని తాము చేసుకుని వెళ్ళిపోయారు.

నిన్న కేంద్ర ప్రభుత్వం డ్రైవర్ల అసోసియేషన్‌తో జరిపిన చర్చలు సక్సెస్ అవడంతో వారు సమ్మెను విరమించారు. దీంతో నిన్న సాయంత్రమే ట్రక్కులు అన్నీ బయలుదేరాయి. ఈరోజు ఉదయం ఎలా అయినా అవి గమ్యస్థానాలకు చేరతాయి. దీంతో రాత్రితో పోల్చుకుంటే.. పెట్రోల్ బంకుల దగ్గర ప్రస్తుత పరిస్థితులు నిలకడగా ఉన్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment