YS Sharmila : ఏపీలో కాంగ్రెస్ పోటీపై.. వైఎస్ షర్మిల కీలక ప్రకటన..!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ షర్మిల స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందనడానికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వచ్చిన 1,500 అప్లికేషన్లే సాక్ష్యమన్నారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయన్నారు.

New Update
YS Sharmila : ఏపీలో కాంగ్రెస్ పోటీపై.. వైఎస్ షర్మిల కీలక ప్రకటన..!

YS Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ఏపీ ఎన్నికల(AP Elections) పై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ(Andhra Pradesh) లో మొత్తం 175స్ధానాల్లో కాంగ్రెస్(Congress) పటీ చేసే దిశగా కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వామపక్షాలతో కలిసి నడిచే దిశగా చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపారు.

నిజానికి లెఫ్ట్‌ పార్టీలతోనే పొత్తు ఉంటుందని షర్మిల ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే చెప్పారు. ఆ దిశగా అడుగులు వేశారు. చివరకు అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీతో టచ్‌లో ఉన్న కమ్యూనిస్టు పార్టీ నేతలు ఇక ఏపీలో కాంగ్రెస్‌ వైపే ఉంటారని అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీతో టీడీపీ జత కట్టింది. లెఫ్ట్‌ పార్టీలు బీజేపీకి వ్యతిరేకం. అందుకే షర్మిలతోనే ఏపీలో లెఫ్ట్‌ పార్టీలు కలిసి వస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.

షర్మిల ఎంట్రీ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తన కార్యకలాపాల్లో జోరు ప్రదర్శిస్తోంది. గత ఎన్నికల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కోల్పోయింది. షర్మిల రాక తర్వాత ఈసారి పరిస్థితి కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించిన షర్మిల.. అటు లెఫ్ట్‌ పార్టీలతో పొత్తు, సీట్ల పంపకాలపై చర్చిస్తున్నారు. ఇక జగన్‌ టార్గెట్‌గా ఎప్పటికప్పుడు షర్మిల ఫైర్ అవుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మూగ ప్రేక్షకుడిగా మిగిలిపోయారని విమర్శిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో తీవ్ర జాప్యం కారణంగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని షర్మిల ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేదని చెబుతున్నారు.

ఇది కూడా  చదవండి : తెలంగాణలో భారీగా ఆర్డీవోల బదిలీ.!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: కియా ప్లాంట్ నుంచి 900 ఇంజిన్లు దొంగతనం

ఆంధ్రప్రదేశ్ లో శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలోని ఉన్న కియా పరిశ్రమ నుంచి కార్ల ఇంజిన్లు మాయం అయ్యాయి. అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా 900 కనిపించకుండా పోయాయి. దీనికి సంబంధించి కియా యాజమాన్యం కిందటి నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

New Update
ap

KIA Industry

కియా ప్లాంట్ లో ఇంజిన్లు పోయాయి. నమ్మశక్యంగా లేకపోయినా..ఇది నిజంగా జరిగింది. అది కూడా ఆంధ్రాలో ఉన్న కియా పరిశ్రమలో. అది కూడా ఏదో ఒకటి , రెండో పోతే పర్వాలేదులే అనుకోవచ్చును. కానీ ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం అయ్యాయి. దీనికి సంబంధించి కియా ప్లాట్ ఓనర్లు మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దొంగతనం విషయంలో కియా యాజమాన్యం ఫిర్యాదు లేకుండా దర్యాప్తు చేపట్టాలని పోలీసులను కోరారు. కానీ దీనికి పోలీసులు నిరాకరించడంతో కంప్లైంట్ ఫైల్ చేశారు.  విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు నియమించారు.

ఎక్కడ మాయం అయ్యాయో..

అయితే ఈ కార్ల ఇంజిన్లు ఎక్కడ పోయాయి అన్నది మాత్రం తెలియడం లేదు. ఆంధ్రాలో ఉన్న ప్లాంట్లో కార్లు తయారవుతాయి కానీ విడి భాగాలు అన్నీ ఒక్కో చోట నుంచీ వస్తాయి. కార్ల ఇంజిన్లు తమిళనాడు నుంచి వస్తాయి. ఇప్పుడు మాయం అయిన ఇంజిన్లు తమిళనాడు నుంచి రవాణా అవుతున్నప్పుడు పోయాయా లేక పరిశ్రమలోనే చోరీ అయ్యాయా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి విచారణ పూర్తి చేశారని...త్వరలోనే మీడియా సమావేశం పెట్టి వివరాలు తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. 

 

 today-latest-news-in-telugu | kia | cars | andhra-pradesh 

 

Also Read: Stock Market: నిన్న అధ:పాతాళానికి..ఈరోజు లాభాల్లో..

 

Advertisment
Advertisment
Advertisment