AP Politics: బొత్సకు కేబినెట్ ర్యాంక్ పదవి.. జగన్ సంచలన నిర్ణయం!

ఇటీవల విశాఖ స్థానిక సంస్థల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణకు మరో కీలక పదవి దక్కనుంది. ఆయనను శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా నియమించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు కేబినెట్ హోదా లభించనుంది.

New Update
Minister Botsa: బొత్సకు వైసీపీ ఫ్యామిలీ ప్యాకేజీ.. మూడు ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ స్థానాల్లో మంత్రి బలగం!

YS Jagan Takes Sensational Decision To Botsa Satyanarayana : ఎమ్మెల్సీగా ఈ రోజు ప్రమాణ స్వీకారం (Oath Ceremony) చేసిన బొత్స సత్యనారాయణకు వైసీపీ (YCP) అధినేత జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. శాసనమండలి పక్ష నేతగా బొత్సను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రంలోగా ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటివరకు ఆ పార్టీ శాసనమండలి పక్ష నేతగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి.. ఫ్లోర్ లీడర్ పదవికి రాజీనామా చేశారు. జగన్ ఆదేశాలతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. శాసనమండలిలో ఇప్పటికీ వైసీపీకే ఆధిక్యం ఉంది. ఈ నేపథ్యంలో బొత్స వైసీపీ పక్ష నేతగా ఎన్నికైతే ఆయనకు కేబినెట్ హొదా దక్కనుంది. అసెంబ్లీలో పదో వంతు ఎమ్మెల్యే సీట్లు దక్కకపోవడంతో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: Supreme Court : ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కు భారీ ఊరట

బొత్సకు కలిసొచ్చిన అంశం ఇదే..
ఉత్తరాంధ్రలో బొత్స బలమైన నేతగా ఉన్నారు. ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. గత ఎన్నికల్లో బొత్స చీపురుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి.. ఆయన సతీమణి ఝాన్సీ విశాఖ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగారు. అయితే.. ఆ ఎన్నికల్లో వీరిద్దరూ ఓటమి పాలయ్యారు. అయితే.. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న వంశీ కృష్ణ అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీని వీడి జనసేనలో చేరారు. దీంతో ఆ సమయంలో మండలి చైర్మన్ ఆయనపై అనర్హత వేటు వేశారు.

దీంతో ఖాళీ అయిన ఆ స్థానానికి ఇటీవల ఎన్నికల కమిషన్ (Election Commission) నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. ఇక్కడ దాదాపు 800 ఓట్లు ఉండగా.. టీడీపీ (TDP) కి కేవలం 200 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. ఈ నేపథ్యలో ఎన్నికల బరి నుంచి ఆ పార్టీ ఆఖరి నిమిషంలో తప్పుకుంది. దీంతో వైసీపీ నుంచి పోటీకి దిగిన బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో బలమైన బీసీ నేత అయిన బొత్సను శాసనమండలి పక్ష నేతగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

South Central Railway: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్‌.. 42 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ !

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం నుండి బెంగళూరు, తిరుపతి, కర్నూలు సిటీకి మొత్తం 42 ప్రత్యేక వారపు రైళ్లను ఏప్రిల్ 13 నుండి మే చివరి వరకు నడపనుంది.

New Update
Special Trains

Special Trains

వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. విశాఖపట్నం నుండి బెంగళూరు, తిరుపతి , కర్నూలు నగరాలకు ఏకంగా 42 ప్రత్యేక వారపు రైళ్లను నడపడానికి సిద్ధమైంది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 13 నుంచి మే నెల చివరి వరకు అందుబాటులో ఉండనున్నాయి. పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కావడంతో.. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతున్నాయి.

Also Read: Bharat: దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

విశాఖపట్నం-బెంగళూరు మధ్య నడిచే ప్రత్యేక రైలు  ప్రతి ఆదివారం విశాఖ నుండి బయలుదేరనున్నట్లు అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణంలో సోమవారం బెంగళూరు నుండి విశాఖకు చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, జోలార్‌పేట్‌, కుప్పం, బంగారుపేట,  కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగనుంది. ఈ రైలులో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్,  జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

Also Read: China: ఇసుక తుఫాను బీభత్సం.. 693 విమాన సర్వీసులు రద్దు!

విశాఖపట్నం-తిరుపతి మధ్య నడిచే ప్రత్యేక రైలు ప్రతి బుధవారం విశాఖ నుండి బయలుదేరుతుంది.. తిరుగు ప్రయాణంలో గురువారం తిరుపతి నుండి విశాఖకు చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్‌, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి,  రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలులో 2ఏసీ, 3ఏసీ,  జనరల్ కోచ్‌లు ఉంటాయని అధికారులు వివరించారు.


విశాఖపట్నం-కర్నూలు సిటీ మధ్య నడిచే ప్రత్యేక రైలు  ప్రతి మంగళవారం విశాఖ నుండి మొదలవుతుంది. తిరుగు ప్రయాణంలో బుధవారం కర్నూలు సిటీ నుండి విశాఖ చేరుతుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, డోన్ స్టేషన్లలో స్టాప్‌ ఉంది. ఈ రైలులో 2ఏసీ, 3ఏసీ,  జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. అయితే, ఈ రైళ్ల బయలుదేరే సమయాల గురించిన వివరాలు ఇంకా అధికారులు వెల్లడించలేదు.

దీంతో పాటు.. హైదరాబాద్ నగరం నుండి కూడా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లను నడపడం జరుగుతోందని అధికారులు తెలిపారు.

Also Read:Whatsapp: వాట్సాప్‌ సేవల్లో అంతరాయం..!

Also Read:AP: చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..

vizag | tirupati | kurnool | special-trains | summer | summer-special-trains | summer-special | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment