YouTube : నెమలి కూర వండి వీడియో అప్‌లోడ్ చేశాడు.. చివరికి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్‌ కుమార్‌ అనే వ్యక్తి యూట్యూబ్‌లో నెమలి కూర వండిన వీడియో అప్‌లోడ్ చేశాడు. నెమలి జాతీయ పక్షి కావడంతో అటవీశాఖ అధికారులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

New Update
YouTube : నెమలి కూర వండి వీడియో అప్‌లోడ్ చేశాడు.. చివరికి

Peacock Curry : యూట్యూబ్‌ (YouTube) లో నిత్యం లక్షలాది వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. ప్రస్తుతం నెటీజన్లు రోజులో కొన్ని గంటల పాటు యూట్యూబ్‌లోనే గడుపుతున్నారు. కొందరు యూట్యూబ్ క్రియేటర్లు (YouTube Creators) సైతం దీనినే ఉపాధిగా ఎంచుకుంటున్నారు. అయితే కొంతమంది క్రియేటర్లు చట్టాన్ని ఉల్లంఘించేలా, ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా పలు వీడియోలు అప్‌లోడ్ చేస్తూ.. అనేక వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా నెమలి కూర ఎలా వండాలో వీడియో చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. నెమలి జాతీయ పక్షి కావడం వల్ల దాన్ని వేటాడి చంపడం, వండటం చట్టారీత్యా నేరం. దీంతో జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: నిర్మాణంలో కైగా పవర్‌ ప్లాంట్.. మేఘా కంపెనీ మరో విపత్తుకు దారి తీస్తుందా ?

ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్‌ కుమార్‌ అనే వ్యక్తి గత కొంతకాలంగా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి అనే వీడియో అప్‌లోడ్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరలయ్యింది. దీనిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ టీవీ యూట్యూబ్‌ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలాఉండగా.. 1963లో జనవరి 26న భారత ప్రభుత్వం నెమలిని జాతీయ పక్షిగా ప్రకటించింది. చట్టం ప్రకారం నెమలిని వేటాడటం, చంపడం నేరం. దీంతో ఏకంగా నెమలి కూర వండి వీడియో అప్‌లోడ్ చేయడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack : ఇంటి దొంగలే దేశ ద్రోహులు.. ఉగ్రవాదులకు 15 మంది కశ్మీరీలు సహాయం!

పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు కశ్మీర్‌లోనే ఉన్న 15 మంది కశ్మీరీలే సహాయం చేశారని NIA దర్యాప్తులో వెల్లడైంది. ఎలక్ట్రానిక్ నిఘా ఆధారంగా ఈ సహాయకులను గుర్తించారు. ఈ వ్యక్తులు ఉగ్రవాదులకు లాజిస్టిక్స్ అందించారని సమాచారం.  

New Update
15 local cadres helped

15 local cadres helped

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో హిందువుల ఊచకోత తర్వాత భద్రతా దళాలు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాయి. ఉగ్రవాద దాడి తర్వాత, భద్రతా దళాలు ఉగ్రవాదులపై ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. ఇప్పటివరకు అక్కడ 9 మంది ఉగ్రవాదుల ఇళ్ళను పేల్చేశాయి.  పుల్వామాలోని త్రాల్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాది అమీర్ నజీర్ ఇంటిని కూల్చివేశారు. అదే సమయంలో, పుల్వామాలోని ఖాసిపోరాలో జైషే ఉగ్రవాది అమీర్ నజీర్ వాని ఇంటిని పేల్చివేశారు. అంతకుముందు, షోపియన్ జిల్లాలోని వందినా ప్రాంతంలో ఉగ్రవాది అద్నాన్ షఫీ ఇంటిని కూల్చివేశారు. అద్నాన్ షఫీ దాదాపు ఏడాది క్రితం లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో చేరాడు. ఇక కుప్వారాలో ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ ఇంటిని పేల్చివేశారు. వీటన్నింటినీ కలుపుకుని, ఇప్పటివరకు కశ్మీర్ లో మొత్తం 9 మంది ఉగ్రవాదుల ఇళ్ళు నేలమట్టమయ్యాయి.

Also Read :   Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

15 మంది కశ్మీరీలే సహాయం

మరోవైపు, పహల్గామ్ ఉగ్రవాద దాడి దర్యాప్తును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ NIAకి అప్పగించింది. ఇప్పుడు NIA జమ్మూ కశ్మీర్ పోలీసుల నుండి పహల్గామ్ కేసును టెకాఫ్ చేసింది. శ్రీనగర్‌లో, ఉగ్రవాద సహాయకులకు సంబంధించిన 64 ప్రదేశాలపై UAPA కింద చర్యలు తీసుకోబడ్డాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు కశ్మీర్‌లోనే ఉన్న 15 మంది కశ్మీరీలే సహాయం చేశారని దర్యాప్తులో వెల్లడైంది.  ఎలక్ట్రానిక్ నిఘా ఆధారంగా ఈ సహాయకులను గుర్తించారు. ఈ వ్యక్తులు ఉగ్రవాదులకు లాజిస్టిక్స్ అందించారని సమాచారం.  ఉగ్రవాదులు ఎంటర్ కావడానికి మార్గనిర్దేశం చేశారని, దాడులలో ఉపయోగించడానికి పాకిస్తాన్ నుండి ఆయుధాలను కూడా సమకూర్చారని తెలుస్తోంది.  వారి అరెస్టుపై నిర్ణయం తీసుకునే ముందు కుట్రను ఛేదించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.  

Also read :  India-Pakistan: మేం ఆయుధాలు లేని సైనికులం..పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధమే!

Also read : Bike Accident : తండ్రికి బైక్‌ను గిప్ట్గా ఇచ్చేందుకు వెళ్తూ అనంతలోకాలకు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు