Hyderabad: రీల్స్‌ కోసం బైక్‌పై స్టంట్స్‌.. స్పాట్‌లోనే యువకుడు మృతి

హైదరాబాద్‌లోని హయాత్‌నగర్‌లో ఇద్దరు యువకులు రీల్స్‌ చేసేందుకు KTM బైక్‌పై స్టంట్లు చేశారు. బైక్ అదుపుతప్పడంతో వెనకాల కూర్చున్న శివ అనే యువకుడు మృతి చెందాడు. బైక్ నడిపిన మరో యువకుడికి తీవ్రంగా గాయాలయ్యయి.

New Update
Hyderabad: రీల్స్‌ కోసం బైక్‌పై స్టంట్స్‌.. స్పాట్‌లోనే యువకుడు మృతి

సోషల్ మీడియాలో రీల్స్ చేసి గుర్తింపు తెచ్చుకునేందుకు కొందరు ప్రమాదకరంగా స్టంట్లు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లోని హయాత్‌నగర్‌లో చోటుచేసుకుంది. రీల్స్‌ కోసం బైక్‌పై స్టంట్స్‌ చేసిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పెద్ద అంబర్‌పేట్‌ నేషనల్‌ హైవే మీద ఈ ఘటన చోటుచేసుకుంది. వర్షం కురుస్తున్న సమయంలో KTM బైక్‌పై రీల్స్‌ చేసేందుకు ఇద్దరు యువకులు బైక్‌పై స్టంట్లు చేశారు. బైక్ అదుపుతప్పడంతో వెనకాల కూర్చున్న శివ అనే యువకుడు మృతి చెందాడు. బైక్ నడిపిన మరో యువకుడికి తీవ్రంగా గాయాలయ్యయి. ప్రస్తుతం ఇతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కొడుకు మృతితో అతడి తల్లి రోదనలు మిన్నంటాయి.

Also read: ఐటీ ఉద్యోగులకు షాక్.. రోజుకు 14 గంటలు పని !

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

ప్రపంచానికి మరో మహమ్మారి తప్పదని అంటున్నారు డబ్లూహెచ్ వో చీఫ్ టెడ్రోస్. ఇది సైంటిఫిక్ ముప్పు కాదని..అంటువ్యాధులు మళ్ళీ ప్రబలే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. 

New Update
who

WHO Chief Tedros

ప్రపంచాన్ని మరో మహమ్మారి కబళించే అవకాశం ఉందని...అందరూ దానికి సంసిద్ధంగా ఉండాలని అంటున్నారు డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెయేసస్‌. అయితే ఈసారి సైన్స్ ప్రయోగాల వల్లనో ఇంక దేని వల్లనే ఈ ముప్పు రాదని..అంటు వ్యాధులే విజృంభిస్తాయని ఆయన చెబుతున్నారు. ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేనప్పటికీ దానికి రెడీగా ఉండాలని ప్రపంచానికి టెడ్రోస్ పిలుపునిచ్చారు. డబ్ల్యూహెచ్‌వో పాండమిక్‌ అగ్రిమెంట్‌పై జెనీవాలో నిర్వహించిన 13వ పునఃప్రారంభ సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేసిన టెడ్రోస్ కోవిడ్ మహమ్మారిని గుర్తు చేశారు. అప్పుడే పై వ్యాఖ్యలను కూడా చేశారు. ఇప్పుడు మరో మహమ్మారి 20 ేళ్ళ లోపు లేదా అంత కంటే ముందే...ఇంకా చెప్పాలంటే రేపు కూడా మొదలవ్వొచ్చని అన్నారు. ఏది ఏమైనా కచ్చితంగా వచ్చే తీరుతుందని బల్లగుద్ది మరీ చెప్పారు టెడ్రోస్. 

నిజానికి 2 కోట్ల మంది..

డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ టెడ్రోస్ కోవిడ్ మహమ్మారి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. అధికారికంగా 70 లక్షల మంది చనిపోయారని ఉంది..కానీ నిజానికి ఆ సంఖ్య 2 కోట్ల వరకూ ఉంటుందని డబ్ల్యూహెచ్ వో అంచనా అని ఆయన చెప్పారు.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి 10 ట్రిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగించిందని టెడ్రోస్ తెలిపారు. ఇప్పటివరకు జరిగిన విధ్వంసం మీదనా, రాబోయే మహమ్మారి మీదన కూడా  ఒప్పందంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

 today-latest-news-in-telugu | who | covid

Also read: Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

Advertisment
Advertisment
Advertisment