TSRTC: హే రేవంత్.. యే క్యా హువా! బస్సుల్లో మహిళలు ఈ పనులు కూడా చేస్తున్నారే!

టీఎస్ఆర్టీసీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంట్లో బోర్ కొడుతుందని ఇద్దరు మహిళలు బస్సులో ప్రయాణిస్తూ బీడీలు చుడుతున్న వీడియో వైరల్ అవుతోంది. 'హే రేవంత్ రెడ్డి, హే ఉత్తమ్ కుమార్ రెడ్డి, యే క్యా హువా! బస్సుల్లో ఇలా కూడా చేస్తారా' అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

New Update
TSRTC: హే రేవంత్.. యే క్యా హువా! బస్సుల్లో మహిళలు ఈ పనులు కూడా చేస్తున్నారే!

Telangana: తెలంగాణ ఆర్టీసీ (Rtc) మరోసారి వార్తల్లో నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మహాలక్ష్మీ పథకం'లో భాగంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం మొదలైనప్పటినుంచి ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇటీవలే సీటు విషయంలో పలువురు స్త్రీలు విచక్షణ రహితంగా దాడులు చేసుకున్న వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా తాజాగా మరో ఫన్నీ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తుంది.

బోర్ కొడుతుందని బస్సుల్లో..
ఈ మేరకు ఇద్దరు మహిళలు బస్సులో ప్రయాణిస్తూ బీడీలు చుడుతున్న వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సన్నివేశం ఏ డిపోకు సంబంధించినదో తెలియదు. కానీ ఇదే బస్సులో ప్రయాణిస్తున్న ఒక యువకుడు దీనిని రహస్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు 'హే రేవంత్ రెడ్డి, హే ఉత్తమ్ కుమార్ రెడ్డి, యే క్యా హువా! ఇంట్లో కూర్చొని ఒక్కరే బీడీలు చేస్తే బోర్ కొడుతుందని ఇలా బస్సుల్లో కూడా మొదలుపెట్టారు!!' అంటూ ఫన్నీగా రాసుకొచ్చాడు.

ఇది కూడా చదవండి : Virat : టీమిండియాకు బిగ్ షాక్.. విరాట్ కోహ్లీ అవుట్

ఫన్నీ కామెంట్స్..
ఇక వైరల్ అవుతున్న వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. 'ఆడుతూపడుతూ పనిచేస్తుంటే అలుపు సోలుపేముంది.. ఉచిత బస్సులో బీడీలు చూడుతే మస్తు గమ్మత్తుగా ఉంది' అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు '3 రంగులు జెండా యెట్టి 3 కట్టల బీడీలు సుట్టలే.. ఉచిత బస్ లో' అంటూ పాటలు కూడా పాడుతున్నారు. ఇక ఈ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిపై కొంతమంది మండిపడుతున్నారు. 'హేయ్ బిచ్చగాడ. వాళ్లకి సీట్లు దొరికినై అంటే ఫ్రీ బస్ స్కీమ్ సక్సెస్ అయినట్టే కదా. వాళ్లు ఏమైనా చేస్కోని. అయినా ఎవర్రా చిల్లర ఫెలో పర్మిషన్ లేకుండా లేడీస్ వీడియోలు తీసి నీకు పంపిస్తుంది' అంటూ తిట్టిపోస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025 నేటి (ఏప్రిల్ 8) నుంచి అమలులోకి వస్తోందని కేంద్రం ఓ నోటిఫికేషన్ రిలీస్ చేసింది. గతవారం పార్లమెంట్‌ ఉభయసభలు సవరణ చట్టాన్ని ఆమోదించాయి. ఆ బిల్లు నేడు రాష్ట్రపతి అమోదం పొందింది. దీంతో వక్ఫ్ భూముల నిర్వాహణలో చాలా మార్పులు వచ్చాయి.

New Update
Waqf Bill

Waqf Bill

Waqf Amendment Act: పార్లమెంట్‌లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం ఆమోదించగా.. ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందన్న విషయం ప్రకటించలేదు. దీంతో కేంద్రం ఈ అంశంపై క్లారిటీ ఇస్తూ ఈరోజు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈమేరకు నేటినుంచి (ఏప్రిల్ 8) నుంచి దేశంలో వక్ఫ్‌ సవరణ చట్టం అమలులోకి వచ్చింది. గతవారం పార్లమెంట్‌ ఉభయసభలు సవరణ చట్టాన్ని ఆమోదించి.. రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. కేంద్రం పంపిన వక్ఫ్‌ చట్టం సవరణ బిల్లును ఏప్రిల్‌ 8న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిల్లును ఆమోదించారు. 

Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

Also read: Pavan kalyan son : అప్పుడు తెలియలేదు.. విషయం ఇంత సీరియస్ అని : పవన్ కళ్యాణ్

రెండు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఏప్రిల్ 4న రాజ్యసభ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు రాగా, లోక్‌సభ సుదీర్ఘ చర్చ తర్వాత ఏప్రిల్ 3న బిల్లుకు ఆమోదం తెలిపింది. లోక్‌సబలో 288 మంది ఎంపీలు అనుకూలంగా, 232 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. గతంలో ఉన్న చట్టం1995లో సవరించినది. కొత్తగా తీసుకువచ్చిన చట్టం ప్రకారం.. ఎవరైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలంటే ఆ వ్యక్తి కనీసం ఐదేళ్లు ఇస్లాం ఆచరించి ఉండాలి. ఆస్తి అతనికి మాత్రమే సొంతమై ఉండాలి. సవరణ చట్టంలో ‘వక్ఫ్ బై యూజర్’ నిబంధన తొలగించారు. 

Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

వక్ఫ్ భూముల సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుంచి కలెక్టర్‌కు బదిలీ చేశారు. వక్ఫ్ ఆస్తుల వివరాలు ఆరు నెలల్లో కేంద్రీయ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు స్త్రీలతో పాటు ఇద్దరు ముస్లిమేతర సభ్యులను సైతం చేర్చాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్ నిర్ణయా మాత్రమే అంతిమం కాదు. 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇకపై వక్ఫ్ బోర్డులకు ఏకపక్షంగా ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించే అధికారం ఉండబోదు.

Also read: BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’

Advertisment
Advertisment
Advertisment