Cat : ఐదు రోజులుగా తిండి లేక.. పిల్లిని పీక్కుతిన్న యువకుడు

కేరళలో వింత ఘటన వెలుగుచూసింది. ఐదు రోజులుగా తిండి లేక ఆకలితో అలమటిస్తున్న ఓ యువకుడు.. చనిపోయిన పిల్లిని పిక్కుతింటూ కనిపించాడు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడికి ఆహారం అందించి.. అతడి గురించి వివరాలు ఆరా తీశారు.

New Update
International : జపాన్‌లో ఒక సిటీనీ వణికిస్తున్న పిల్లి.. హై అలర్ట్

No Food : కేరళ(Kerala) లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. కొన్నిరోజుల నుంచి తిండి లేక(No Food) ఆకలి(Hungry) తో అలమటిస్తున్న ఓ యువకుడు.. ఏకంగా ఓ చనిపోయిన పిల్లిని పీక్కుతింటూ(Eating Raw Flesh Of Cat) కనిపించాడు. అతడ్ని చూసి అక్కడి స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయారు. మలప్పురం జిల్లా(Malappuram District) కుట్టిపురం బస్టాండ్‌లో ఈ దిగ్ర్భాంతికర ఘటన వెలుగుచూసింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు హుటాహుటీనా అక్కడికి చేరుకున్నారు. అతనికి ఆహారం అందించి.. ఆ తర్వాత వివరాలు సేకరించారు.

Also Read : సొంత ఇంటికే కన్నం వేసిన యువతి.. నగలు, నగదు చోరీ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 'అస్సాం(Assam) లోని ధుబరీ జిల్లాకు చెందిన ఆ యువకుడు (27) అక్కడే ఓ కాలేజీలో చదువుతుండేవాడు. అయితే గత ఏడాది డిసెంబర్‌లో ఇంట్లో వాళ్లకి చెప్పకుండా రైలు ఎక్కి కేరళకు వచ్చేశాడు. డబ్బులు లేకపోవడంతో అయిదు రోజుల నుంచి అతడికి తిండి లేదు. ఆకలి బాధను తట్టుకోలేకపోయాడు. అతడికి ఓ చనిపోయిన పిల్లి కనిపించింది.

దీంతో దాని మాంసాన్నే పచ్చిగా తింటూ మనుషులకు కనిపించాడని' పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతడి కుటుంబ సభ్యులను ఫోన్‌లో సంప్రదించి సమాచారం అందిచినట్లు తెలిపారు. అలాగే యువకుడ్ని కూడా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.

Also Read: సోమవారం ఝార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష..

Advertisment
Advertisment
తాజా కథనాలు