Maha Shivaratri : శివుడు మెడలో పామునే ఎందుకు ధరిస్తాడు?.. ఆ పాము పేరేంటో తెలుసా?

శివుడు మెడలో ధరించిన పాము పేరు వాసుకి నాగ్. నాగరాజు వాసుకి శివభక్తుడు. సముద్ర మథనం సమయంలో వాసుకి రాజు సముద్రాన్ని మథనం చేయడానికి తాడును ఉపయోగించాడు. ఆ ఘర్షణలో వాసుకి చనిపోయింది. ఈ విధంగా వాసుకి భక్తికి మెచ్చిన శివుడు వాసుకిని మెడకు ఆభరణంగా చుట్టుకునే వరం ఇచ్చాడు.

New Update
Maha Shivaratri : శివుడు మెడలో పామునే ఎందుకు ధరిస్తాడు?.. ఆ పాము పేరేంటో తెలుసా?

Maha Shivaratri 2024 : మహాశివరాత్రి(Maha Shivaratri) రోజున చాలామంది ఉపవాసాలు ఉంటూ శివయ్య(Lord Shiva) కు ప్రత్యేక పూజలు చేస్తారు. శివుని రూపం చూసేందుకు మిగతా దేవుళ్ల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. పరమశివుడు మెడలో ఎప్పుడూ పాముని మాలలా ధరిస్తాడు. అసలు అలా ధరించడానికి కారణమేంటి?, మెడలో ఉన్న పాము పేరేంటి అన్న సందేహాలు ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటాయి. క్యాలెండర్ ప్రకారం.. మహాశివరాత్రి ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఇవాళే మహాశివరాత్రి . ఈ రోజున శివుడు, పార్వతీదేవి కల్యాణం జరిపిస్తారు.

మహాశివుని రూపం:

  • ఇక మహాశివుని రూపం విషయానికి వస్తే ఆయన రూపం చాలా విశిష్టమైనది, ఆకర్షణీయమైనది, విచిత్రమైనది. అంతేకాకుండా ఎంతో రహస్యమైంది. వివాహ సమయం(Marriage Time) లో పార్వతిదేవి కూడా శివుడి ప్రసిద్ధ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయిందని పురాణాలు చెబుతున్నాయి. శివుడు పులి బెరడుతో చేసిన వస్త్రాన్ని ధరించి, శరీరమంతా భస్మం పూసుకొని ఉంటాడు. అంతేకాకుండా జడపై గంగమ్మ, నుదుటిపై చంద్రుడు, మెడలో పాముని ధరించి ఉంటాడు. అయితే వీటిని ధరించడం వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయి.

శివుడు మెడలో పామును ఎందుకు ధరిస్తాడు?

  • శివుడు తన మెడలో పాము(Snake) ను ధరించడంతో ఆయన మహిమలు కేవలం మనుషులపైనే కాకుండా పాములపైనా ఉంటాయని అర్థమవుతోంది. శివుడు మనకు పూజనీయమైన దేవుడు. అలాగే పాములు కూడా ఆ మహాశివుడిని దేవుడిగా భావిస్తాయని అంటున్నారు. అందుకే ఎప్పుడూ ఆయన మెడలో పాముతో పాటు రుద్రాక్ష జపమాలను సైతం ధరిస్తాడని అంటున్నారు.

శివుడి మెడలో ఉండే పాము పేరు:

  • శివుడు మెడలో ధరించిన పాము పేరు వాసుకి నాగ్. నాగరాజు వాసుకి శివభక్తుడు. పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో వాసుకి రాజు సముద్రాన్ని మథనం చేయడానికి తాడును ఉపయోగించాడు. ఆ ఘర్షణలో వాసుకి రక్తస్రావమై చనిపోయింది. ఈ విధంగా వాసుకి భక్తికి మెచ్చిన శివుడు వాసుకిని నాగలోకానికి రాజుగా చేసి వాసుకిని తన మెడకు ఆభరణంగా చుట్టుకునే వరం ఇచ్చాడు.

వాసుకి శివుని సేవకురాలిగా ఎలా మారింది?

  • నాగలోకంలోని అన్ని పాములు హిమాలయాలలో శివుడు ఉన్న ప్రాంతంలో నివసించాయి. శివునికి కూడా నాగవంశీయులంటే అమితమైన ప్రేమ. మొదట్లో శేషనాగ్, వాసుకి, తక్షక్, పింగ్లా, కర్కోటక వంటి ఐదు పాముల వంశాలు ఉండేవి. ఈ ఐదు వంశాల పాములను దేవతల వర్గంలో ఉంచారు. వీటిలో శేషనాగు పాముల మొదటి రాజుగా పరిగణించబడతాడు. అతన్ని అనంత్ అని కూడా పిలుస్తారు. తర్వాత వాసుకి పాముల రాజు అయ్యాడు. అతను కూడా శివుని సేవకుడయ్యాడు. వాసుకి తరువాత, తక్షకుడు, పింగ్లా రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి : ఫేస్‌కి మాయిశ్చరైజర్ బెటరా?..ఫేస్‌ సీరమ్‌ బెటరా?..నిపుణుల సలహా ఇదే

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్‌ కీలక నిర్ణయం

 ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు.

New Update
Babu Mohan

Babu Mohan

 ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రస్తుతం ఆయన ఏ పదవిలో లేరు. అయితే ఆయన ఈ రోజు మరో రంగంలోకి అడుగుపెట్టారు. అదే సేవా రంగం. అవును తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు చేయూత అందిస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం బషీర్ బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఆవిర్భావ సమావేశంలో బాబు మోహన్ ట్రస్ట్ లక్ష్యాలు, కార్యక్రమాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి పొందిన ఈ ట్రస్ట్.. నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు చేయూత అందించడం కూడా ట్రస్ట్ ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
 
బాబు మోహన్ మాట్లాడుతూ.. తన కుమారుడి పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం అందించాలనేది తన చిరకాల కోరిక అని అన్నారు. పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక ముఖ్యమైన సాధనమని ఆయన నొక్కి చెప్పారు. అందుకే.. ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.అలాగే.. సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించడం కోసం.. వైద్య శిబిరాలు నిర్వహించడం, ఆసుపత్రి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాలను ఈ ట్రస్ట్ చేపడుతుందని బాబు మోహన్ తెలిపారు. ఉపాధి లేని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి.. వారు ఉద్యోగాలు పొందేలా సహాయం చేస్తుందన్నారు.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
 
ట్రస్ట్ ద్వారా సహాయం పొందాలనుకునే వారు కోఆర్డినేటర్ రాజ్ కుమార్‌ను 8919511215 నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని బాబు మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారు గూడెం కోయజాతికి చెందిన సమీప అనే విద్యార్థి ఎంటెక్ చేయడానికి, గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడానికి బాబు మోహన్ తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !


బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబర్ 12న జరిగిన హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొడుకు మరణంతో బాబు మోహన్ ఎంతగానో కుంగిపోయారు. కొడుకు పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టాలని తాను ఎంతో కాలంగా భావిస్తున్నానని.. కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ట్రస్ట్ కోసం పని చేస్తానని ఆయన చెప్పారు.

 Also Read :  ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

Advertisment
Advertisment
Advertisment