Holi 2024: చితాభస్మంతో హోలీ.. ఎక్కడో తెలుసా?

కాశీలోని మార్నికర్ణికా ఘాట్ వద్ద అఘోరీలు, సాధువులు మసాన్ హోలీలో పాల్గొంటారు. చితాభస్మంతో ఆడే హోలీ ఇది. రంగ్భరి ఏకాదశి తర్వాతి రోజు ఈ హోలీ జరుపుకుంటారు. రేపే(మార్చి 21) మసాన్‌ హోలీ. శివుడు మార్నికర్ణికా ఘాట్ వద్ద ఇలానే హోలీ ఆడాడని భక్తుల నమ్మకం.

New Update
Holi 2024: చితాభస్మంతో హోలీ.. ఎక్కడో తెలుసా?

Holi 2024: ప్రతీఏడాది హోలీ పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది. ఈ ఏడాది హోలికా దహన్ మార్చి 25న వచ్చింది. అయితే ప్రతీ ఊరులోనూ హోలీని ఒకే రకంగా జరుపుకోరు. అందరికి హోలి అంటే కలర్స్‌ చల్లుకోవడం గుర్తొస్తుంది. కానీ అక్కడ మాత్రం చితాభస్మంతో హోలీ ఆడుతారు. మధుర-బృందావనం హోలీ దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. అటు కాశీలో హోలీ గురించి ఓ ఆసక్తికర విషయం ఇవాళ మేం మీకు చెప్పబోతున్నాం.

కాశీలో మసల్ హోలీ ఆడతారు. చితాభస్మంతో ఈ హోలీ ఆడతారు. నిజానికి కాశీలో హోలీ వేడుకలు రంగభరి ఏకాదశి రోజున ప్రారంభమవుతాయి. ఫాల్గుణ మాసంలోని శుక్లపక్షం ఏకాదశి నాడు రంగ్భరి ఏకాదశి జరుపుకుంటారు. ఈ రోజున శివుడు పార్వతీదేవిని కాశీకి తీసుకువచ్చాడని భక్తుల నమ్మకం. శివుడు, పార్వతి గులాల్ తో హోలీ ఆడారని చెబుతుంటారు. కాశీలో రంగ్భరి ఏకాదశి మరుసటి రోజు మసాన్ హోలీ జరుపుకుంటారు. ఈసారి రంగ్భరి ఏకాదశి మార్చి 20న ఉంది. మరుసటి రోజు అంటే రేపు(మార్చి 21న) మసాన్ హోలీ జరగనుంది.

publive-image

మసాన్ కీ హోలీ:

  • కాశీలోని మార్నికర్ణిక ఘాట్ వద్ద చితాభస్మంతో హోలీ ఆడతారు. దీనిని మసాన్ హోలీ అంటారు. కాశీలో ఏళ్ల తరబడి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. రంగ్భరి ఏకాదశి నాడు శివుడు పార్వతీమాతతో హోలీ ఆడాడని, ఈ కారణంగా దయ్యాలతో హోలీ ఆడలేకపోయాడని చెబుతుంటారు. అలాంటి పరిస్థితిలో మరుసటి రోజు శివుడు మార్నికర్ణికా ఘాట్ వద్ద దెయ్యాలతో హోలీ ఆడారని నమ్ముతారు.

 what is masan holi an festiwal with ashes aghoras

  • కాశీలోని మార్నికర్ణికా ఘాట్ వద్ద అఘోరీలు, సాధువులు ఈ హోలీలో పాల్గొంటారు. వారు హోలీ గులాల్ వలె మసాన్ బూడిదను పూస్తారు. కాశీకి మసాన్ హోలీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. హోలీ పండుగ రోజున మణికర్ణిక ఘాట్ మొత్తం హర హర మహాదేవ్ నినాదాలతో మార్మోగుతుంది.

ఇది కూడా చదవండి: ఉపవాసం ఇలా చేశారంటే ప్రమాదంలో పడ్డట్టే..హెచ్చరిస్తున్న నిపుణులు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్‌ కీలక నిర్ణయం

 ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు.

New Update
Babu Mohan

Babu Mohan

 ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రస్తుతం ఆయన ఏ పదవిలో లేరు. అయితే ఆయన ఈ రోజు మరో రంగంలోకి అడుగుపెట్టారు. అదే సేవా రంగం. అవును తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు చేయూత అందిస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం బషీర్ బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఆవిర్భావ సమావేశంలో బాబు మోహన్ ట్రస్ట్ లక్ష్యాలు, కార్యక్రమాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి పొందిన ఈ ట్రస్ట్.. నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు చేయూత అందించడం కూడా ట్రస్ట్ ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
 
బాబు మోహన్ మాట్లాడుతూ.. తన కుమారుడి పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం అందించాలనేది తన చిరకాల కోరిక అని అన్నారు. పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక ముఖ్యమైన సాధనమని ఆయన నొక్కి చెప్పారు. అందుకే.. ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.అలాగే.. సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించడం కోసం.. వైద్య శిబిరాలు నిర్వహించడం, ఆసుపత్రి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాలను ఈ ట్రస్ట్ చేపడుతుందని బాబు మోహన్ తెలిపారు. ఉపాధి లేని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి.. వారు ఉద్యోగాలు పొందేలా సహాయం చేస్తుందన్నారు.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
 
ట్రస్ట్ ద్వారా సహాయం పొందాలనుకునే వారు కోఆర్డినేటర్ రాజ్ కుమార్‌ను 8919511215 నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని బాబు మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారు గూడెం కోయజాతికి చెందిన సమీప అనే విద్యార్థి ఎంటెక్ చేయడానికి, గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడానికి బాబు మోహన్ తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !


బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబర్ 12న జరిగిన హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొడుకు మరణంతో బాబు మోహన్ ఎంతగానో కుంగిపోయారు. కొడుకు పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టాలని తాను ఎంతో కాలంగా భావిస్తున్నానని.. కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ట్రస్ట్ కోసం పని చేస్తానని ఆయన చెప్పారు.

 Also Read :  ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

Advertisment
Advertisment
Advertisment