Akhila Priya : రగిలిపోతోన్న అఖిల.. ఏవీపై అటాక్ ఉంటుందా?

తన బాడీగార్డ్ పై దాడి చేసిన వారిపై భూమ అఖిల ప్రియ రివేంజ్ ఎలా తీసుకుంటారనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఆమె సైలెంట్ గా ఉండడం వెనుక పెద్ద వ్యూహం ఉండి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

New Update
Akhila Priya : రగిలిపోతోన్న అఖిల.. ఏవీపై అటాక్ ఉంటుందా?

Bhuma Akhila Priya Next Step Over AV Subba Reddy : తన బాడీగార్డ్(Body Guard) పై దాడితో మాజీ మంత్రి అఖిలప్రియ(Akhila Priya) షాక్ కు గురయ్యారని తెలుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి(AV Subba Reddy) వర్గీయులు అటాక్‌ చేస్తారని అఖిల ఏ మాత్రం ఊహించలేదని తెలుస్తోంది. పైగా తన ఇంటి ముందే దాడి జరగడంతో ఆమె వర్గం ఉలిక్కిపడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఊహించని పరిణామంతో అఖిల ఎలా రియాక్ట్‌ అవుతారన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ దాడి తర్వాత పోలీసులకు కత్తి దొరికొంది. అఖిల బాడీగార్డ్‌ నిఖిల్‌ను చంపడం కోసం రూ.50 లక్షల సుపారీ ఇచ్చినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. లోకల్‌ రౌడీషీటర్లు(Local Rowdy Sheeters) దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. రెండు వాహనాల్లో వచ్చిన దుండగులు ఈ దాడికి తెగబడ్డారని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

Also Read : అఖిల ప్రియ, సుబ్బారెడ్డి మధ్య వైరం ఎలా మొదలైందో తెలుసా?

ఈ ఘటనపై ఏవీ సుబ్బారెడ్డితోపాటు ఐదుగురిపై కేసు నమోదు చేశారు నంద్యాల పోలీసులు(Nandyal Police). అయితే.. ఈ విషయమై మీడియాతో మాట్లాడేందుకు అఖిల విముఖత చూపుతున్నారు. దీంతో అఖిల మౌనానికి కారణం ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది. అఖిల ప్రతికారం తీర్చుకుంటారా? ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటన్న చర్చ ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు