Fengal Cyclone: తీరాన్ని తాకిన ఫెంగల్..ఏపీ, తమిళనాడుకు రెడ్ అలెర్ట్

ఫెంగల్ తుఫాను పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని తాకింది. మహాబలిపురం–కరైకల్ మధ్యలో తుఫాన్ తీరం దాటడం మొదలైందని వాతావరణశాఖ చెప్పింది. దీని ప్రభావం వలన ఈదురు గాలులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. 

author-image
By Manogna alamuru
New Update
cyclone

దంచికొట్టిన ఫెంగల్ తుఫాన్ ఒత్తానికి తీరం దాటుతోంది. మూడు రోజుల పాటూ ఏపీ, తమిళనాడు ప్రజలను వణికించిన ఈ తుఫాన్  మహాబలిపురం–కరైకల్ మధ్యలో పుదుచ్చేరి సమీపంలో తీరం దాటుతోంది. ఈ మొత్తం ప్రక్రియకు నాలుగు గంటలు పట్టవచ్చని భారత వాతావరణ శాఖ చెప్పింది. తుపాను తీరం దాటే సమయంలో 70 నుంచి 80 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని.. తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలతో పాటు ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణసంస్థ అధికారులు తెలిపారు. 

ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో మూడ్రోజులుగా..

తుఫాన్ కారణంగా చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, విలుప్పురం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. వీటివల్ల  లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయాయి. ఎయిర్‌పోర్ట్‌లో భారీగా నీళ్ళు నిలిచి పోయాయి. దీంతో చెన్నైకి  విమాన సర్వీసులు నిలిపేశారు. దాంతో పాటూ రైల్వే ట్రాక్‌లపైకి వరద నీరు చేరడంతో..ఎలక్ట్రిక్‌ ట్రైన్ సర్వీసులు పూర్తిగా రద్దు చేశారు. విమాన, రైల్వే సేవలు నిలిపివేయడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఇప్పుడు తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం  ఉండడంతో..తిరువళ్లూరు, కాంచీపురం, విలుప్పురం జిల్లాలకు ఐఎమ్‌డీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఏపీలో చిత్తూరు, తిరుపతి రాష్ట్రాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. 

Also Read: Holidays: బ్యాంకులకు నెలలో సగంపైనే హాలిడేస్... ఎంజాయ్ డిసెంబర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather: ఎండకాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు.. సగటు కంటే 105% ఎక్కవ వర్షపాతం

ఈఏడాది దీర్ఘకాలిక సగటు కంటే 105 శాతం ఎక్కవ వర్షపాతం నమోదవుతుందని మంగళవారం IMD తెలిపింది. నైరుతి రుతుపవనాలు జూన్ 1న వచ్చి సెప్టెంబర్ మధ్య నాటికి ఉపసంహరించుకుంటాయని IMD అధికారులు వెల్లడించారు. ఇండియాలో రాబోయే వర్షాకాలం సంవృద్ధిగా వర్షాలు పడతాయంటున్నారు.

New Update
india rainfall

india rainfall Photograph: (india rainfall)

2025లో కురిసే వర్షపాత వివరాలు మంగళవారం భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈసారి వర్షకాలం గురించి IMD గుడ్‌న్యూస్ చెప్పింది. ఈఏడాది భారతదేశంలో దీర్ఘకాలిక సగటులో 105 శాతం సగటు కంటే ఎక్కవ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. లాంగ్ పిరిడయడ్ యావరేజ్‌లో 105 నుంచి 110% పరిధిలో వర్షపాతాన్ని సగటు కంటే ఎక్కువగా IMD నిర్వచిస్తుంది. ఈ ఏడాది వర్షకాలం సీజన్‌లో మంచి వర్షాలు కురుస్తాయని మంగళవారం వాతావరణ నిపుణులు తెలిపారు. ఇండియా అంత రుతుపవనాలు వ్యాపించి బలమైన వర్షాలు పడతాయట. IMD అంచనాలకు 5శాతం తక్కువ లేదా ఎక్కవ వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నారు.

Also read: Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 వల్ల లాభాలు ఇవే..

IMD Weather Alert In AP & TG

Also read: ఎండకాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు.. సగటు కంటే 105% ఎక్కవ వర్షపాతం

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!


లడఖ్, ఈశాన్య, తమిళనాడులో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళ మీదుగా దేశంలో వ్యాపించి సెప్టెంబర్ మధ్య నాటికి ఉపసంహరించుకుంటాయి. ఎల్ నినో, హిందూ మహాసముద్ర డైపోల్ (IOD) వంటి కీలక వాతావరణ కారకాలు తటస్థంగా ఉంటాయని, బలమైన రుతుపవనాలు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని IMD అధికారులు భావిస్తున్నారు. గతంలో ఎన్నడు లేనట్టుగా భారతదేశంలో సగటు కంటే ఎక్కువ రుతుపవన వర్షాలు పడే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

 

imd alert | heavy-rainfall | Cold Weather | telugu states monsoon | Andhra Pradesh and Telangana Weather Report | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు