Rain Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని తెలిపింది. 

New Update
rains

బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనుంది. దీనివల్ల ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీలోని పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని తెలిపింది. 

ఇది కూడా చూడండి: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

తెలంగాణలో కూడా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ తెలిపింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా  జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 17వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

ఇది కూడా చూడండి: YS Sharmila: మరోసారి తన అన్నపై రెచ్చిపోయిన షర్మిల

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు రైతులకు సూచనలు చేశారు. పంట చేతికి వచ్చే సమయం. కాబట్టి పంట కోస్తే వాటిని జాగ్రత్త పరచుకోవాలని తెలిపారు. పంట కోతకు వస్తే ఒక రెండు రోజులు ఆగి కోయాలని సూచించారు. 

ఇది కూడా చూడండి: మరికాసేపట్లో గ్రూప్ - 2 పరీక్ష.. ఈ తప్పు చేశారో ఇంటికే ఇక!

ఇదిలా ఉండగా వర్షాలతో పాటు చలి తీవ్రత కూడా పెరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పన్నెండు గంటల వరకూ సూర్యుడు బయటకు కనిపించడం లేదు. ఉదయం పూట పొగమంచు ఎక్కువగా ఉండటంతో వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

ఇది కూడా చూడండి: Road Accident: అమెరికాలో భారి యాక్సిడెంట్.. తెనాలి విద్యార్థిని మృతి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather: ఎండకాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు.. సగటు కంటే 105% ఎక్కవ వర్షపాతం

ఈఏడాది దీర్ఘకాలిక సగటు కంటే 105 శాతం ఎక్కవ వర్షపాతం నమోదవుతుందని మంగళవారం IMD తెలిపింది. నైరుతి రుతుపవనాలు జూన్ 1న వచ్చి సెప్టెంబర్ మధ్య నాటికి ఉపసంహరించుకుంటాయని IMD అధికారులు వెల్లడించారు. ఇండియాలో రాబోయే వర్షాకాలం సంవృద్ధిగా వర్షాలు పడతాయంటున్నారు.

New Update
india rainfall

india rainfall Photograph: (india rainfall)

2025లో కురిసే వర్షపాత వివరాలు మంగళవారం భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈసారి వర్షకాలం గురించి IMD గుడ్‌న్యూస్ చెప్పింది. ఈఏడాది భారతదేశంలో దీర్ఘకాలిక సగటులో 105 శాతం సగటు కంటే ఎక్కవ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. లాంగ్ పిరిడయడ్ యావరేజ్‌లో 105 నుంచి 110% పరిధిలో వర్షపాతాన్ని సగటు కంటే ఎక్కువగా IMD నిర్వచిస్తుంది. ఈ ఏడాది వర్షకాలం సీజన్‌లో మంచి వర్షాలు కురుస్తాయని మంగళవారం వాతావరణ నిపుణులు తెలిపారు. ఇండియా అంత రుతుపవనాలు వ్యాపించి బలమైన వర్షాలు పడతాయట. IMD అంచనాలకు 5శాతం తక్కువ లేదా ఎక్కవ వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నారు.

Also read: Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 వల్ల లాభాలు ఇవే..

IMD Weather Alert In AP & TG

Also read: ఎండకాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు.. సగటు కంటే 105% ఎక్కవ వర్షపాతం

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!


లడఖ్, ఈశాన్య, తమిళనాడులో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళ మీదుగా దేశంలో వ్యాపించి సెప్టెంబర్ మధ్య నాటికి ఉపసంహరించుకుంటాయి. ఎల్ నినో, హిందూ మహాసముద్ర డైపోల్ (IOD) వంటి కీలక వాతావరణ కారకాలు తటస్థంగా ఉంటాయని, బలమైన రుతుపవనాలు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని IMD అధికారులు భావిస్తున్నారు. గతంలో ఎన్నడు లేనట్టుగా భారతదేశంలో సగటు కంటే ఎక్కువ రుతుపవన వర్షాలు పడే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

 

imd alert | heavy-rainfall | Cold Weather | telugu states monsoon | Andhra Pradesh and Telangana Weather Report | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu

Advertisment
Advertisment
Advertisment