AP Congress: చిరంజీవిని సీఎం చేస్తాం.. చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ నేత చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవీ ఒప్పుకుంటే తిరుపతి నుంచి గెలిపించి ఆయనను ఏపీకి సీఎం చేస్తామని అన్నారు. చిరంజీవి ఇప్పటికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్టు తెలిపారు. చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. By V.J Reddy 18 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Chiranjeevi: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవీ ఒప్పుకుంటే తిరుపతి నుంచి గెలిపించి ఆయనను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తామని అన్నారు. ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన చింతా మోహన్ మాట్లాడుతూ.. చిరంజీవి ఇప్పటికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారని అన్నారు. అలాగే ఆయనకు నేటికి కూడా.. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రాథమిక సభ్యత్వం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైందని.. చిరంజీవి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే.. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి గెలిపిస్తామని తెలిపారు. NEWS IS BEING UPDATED DO WATCH: #sharmila #ap-latest-news #chiranjeevi #ap-congress #chitha-mohan సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి