Viral Video: యజమాని అత్యుత్సాహం .. పాపం.. రైలు కింద పడిన కుక్క!.. వీడియో వైరల్

ఓ వ్యక్తి  తన పెంపుడు కుక్కతో కలిసి  కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపు తప్పి కుక్క రైలు, ప్లాట్ ఫార్మ్ మధ్యలో పడిపోయింది. దీంతో ఒక్కసారిగా అతడు షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

New Update
viral video dog fell down on train tracks

viral video dog fell down on train tracks

Viral Video: ''కదులుతున్న రైలు ఎక్కడ ప్రమాదకరం'' అనే మాటను ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తోంది. పాపం యజమాని అత్యుత్సాహం పెంపుడు  కుక్క ప్రాణాల మీదకు తెచ్చింది. కళ్ళ ముందే  కుక్క రైలు కింద పడడం చూసి షాకయ్యాడు. కంగారుతో అటు ఇటూ పరుగెత్తాడు.. కానీ అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. అసలు ఈ స్టోరీ ఏంటో తెలియాలంటే ఆర్టికల్ పూర్తిగా చదవండి. 

రైలు కింద పడిన కుక్క 

అయితే ఓ వ్యక్తి  తన పెంపుడు కుక్కతో కలిసి  కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపు తప్పి.. కుక్క రైలు, ప్లాట్ ఫార్మ్ మధ్యలో పడిపోయింది. దీంతో ఒక్కసారిగా అతడు షాకయ్యాడు. కంగారుగా అటు ఇటు పరుగెత్తాడు. కానీ అప్పటికే కుక్క కింద పడిపోయి అరుస్తోంది. మరి ఇప్పుడు ఆకుక్క పరిస్థితి ఎలా ఉంది అనేది తెలియదు. అదృష్టవశాత్తు కుక్క క్షేమంగా ఉండాలని కోరుకుందాం. యజమాని చేసిన తప్పు కుక్క ప్రాణాల మీదకు తెచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. , ‘‘అయ్యో.. తెలిసి తెలిసి కుక్కను చంపేశాడే’’.. అని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు ‘కుక్కతో ఇలాంటి విన్యాసాలు చేయడం దారుణం.. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మండిపడుతున్నారు.

 latest-news | telugu-news | viral-video Dog Incident

Also Read: Actress Abhinaya: హీరో కాదు బిజినెస్ మ్యాన్.. కాబోయే భర్తను పరిచయం చేసిన అభినయ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Viral News: పాపం.. అందర్నీ నవ్విస్తూనే కుప్పకూలి చనిపోయింది!

మహారాష్ట్రలోని పరండా ఆరాజి షిండే కాలేజీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫేర్‌వెల్ పార్టీలో విద్యార్థిని వర్ష ఖరత్ వేదికపై ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే కాలేజీ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు.

New Update
Maharashtra farewell part girl died with heart attack

Maharashtra farewell part girl died with heart attack

Viral News:  కేరింతలు,డాన్సులు, నవ్వులతో సందడిగా ఉండాల్సిన ఫెర్వేల్ పార్టీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వేదికపై ఎంతో సంతోషంగా ప్రసంగిస్తున్న విద్యార్థిని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలో జరిగింది. అసలు ఆఅమ్మాయికి ఏం జరిగిందో తెలియాలంటే ఇక్కడ చదవండి. 

Also Read: Janhvi Kapoor: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్

Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి

ఫేర్‌వెల్ పార్టీలో వీడ్కోలు 

మహారాష్ట్రలోని ధారశివ్ జిల్లాలో పరండా పట్టణంలోని పరండా ఆరాజి షిండే కాలేజీలో ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. అయితే వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా BSC ఫైనల్ ఇయర్ విద్యార్థిని వర్ష ఖరత్ వేదికపై ప్రసంగించింది. కాలేజీలో తన అనుభవాలను, స్నేహితులతో గడిపిన జ్ఞాపకాలను చెబుతూ అందరినీ ఉత్సాహపరిచింది. అప్పటివరకూ అందరినీ నవ్విస్తూ,ఎంతో యాక్టీవ్ గా కనిపించిన వర్ష ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కాలేజీ సిబ్బంది ఆస్పత్రికి  తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.  అయితే వర్షకు ఎనిమిదేళ్ల వయసులో హార్ట్ సర్జరీ అయినట్లు తెలుస్తోంది. కానీ ఆ తర్వాత గత 12 ఏళ్లగా ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చిన్న వయసులోనే కుమార్తె మరణంతో కుటుంబ సభ్యులు గుండె పగిలేలా ఏడుస్తున్నారు. మరోవైపు తోటి విద్యార్థులు, కాలేజీ సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. 

telugu-news | latest-news 

Also Read: యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి' ట్రైలర్! నవ్వులే నవ్వులు

Advertisment
Advertisment
Advertisment