ఐడియా అదిరింది గురూ.. కుంభమేళా నీళ్లతో ఊరంతా స్నానం.. సెల్యూట్ చేయాల్సిందే!

ఢిల్లీని ఓ గ్రెేటెడ్ కమ్యూనిటీ మొత్తం వినూత్న పద్ధతిలో పవిత్ర స్నానం ఆచరించారు. కుంభమేళాకి వెళ్లిన కుటుంబం త్రివేణి సంగమం నుంచి రెండు బాటిళ్ల నీరు తీసుకొచ్చి గ్రేెటెడ్ కమ్యూనిటీలోని స్విమ్మింగ్ పూల్‌లో కలపగా వారంతా పవిత్ర స్నానం ఆచరించారు.

New Update
Viral Video delhi

Viral Video delhi Photograph: (Viral Video delhi)

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా నేటితో పూర్తి కావస్తుంది. చాలా మంది పవిత్ర స్నానం ఆచరించడానికి వెళ్లలేకపోయారు. దీంతో కొందరు డిజిటల్ స్నానాలు చేయడం లేదా ఇతరులు తీసుకొచ్చిన నీటిని చల్లుకోవడం వంటివి చేస్తున్నారు. ఇతరులు తీసుకొచ్చినా మహా అయితే ఒక బాటిల్ లేదా రెండు తీసుకొస్తారు. ఇవి కొంత మందికి మాత్రమే సరిపోతాయి. కానీ ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ మొత్తానికి సరిపోవు. దీంతో ఓ కుటుంబం వినూత్నంగా ఆలోచించింది.

ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!

ఇది కూడా చూడండి: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

అందరూ కూడా పవిత్ర స్నానం ఆచరించాలని..

ఢిల్లీకి చెందిన ఓ కుటుంబం అందరూ కూడా పవిత్ర స్నానం ఆచరించాలని త్రివేణి సంగమం నుంచి రెండు బాటిళ్ల నీరు తీసుకొచ్చారు. వీటిని గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో కలిపారు. వీటిని నీటిలో కలిపే ముందు హర హర మహదేవా అంటూ పూజలు నిర్వహించి స్విమ్మింగ్ పూల్‌లో రెండు బాటిళ్ల నీరు వేశారు. ఆ తర్వాత గ్రేటెడ్ కమ్యూనిటీకి చెందిన వారంతా ఆ స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఐడియా బాగుందని, కొన్ని కారణాల వల్ల కుంభమేళాకు వెళ్లలేని వారికి ఇది బెటర్ అని కామెంట్లు చేస్తున్నారు.  

ఇది కూడా చూడండి: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో

ఇది కూడా చూడండి: AP MLC Elections: రేసు నుంచి వర్మ ఔట్.. దేవినేని ఇన్.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Marriages : ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

బీహార్ వ్యక్తి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, ప్రతి భార్యా అతన్ని 2 నెలల్లోపు వదిలేసింది. ఇప్పుడు అతను నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

New Update
marriage four

marriage four

పెళ్లి అంటే వధూవరులు ఏడు జీవితాల పాటు కలిసి ఉండాలని ప్రమాణాలు చేసుకునే బంధం. అది సుఖమైనా, దుఃఖమైనా, భార్యాభర్తలు ప్రతి క్షణంలో ఒకరికొకరు తోడుగా ఉంటారు.  కానీ  కట్టుకున్న వాళ్లని మిమ్మల్ని మధ్యలో వదిలేస్తే ఇంతకంటే బాధాకరమైనది మరొకటి ఉండదు. బీహార్ కు చెందిన ఒక వ్యక్తి విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. 

 బీహార్‌కు చెందిన బబ్లూ కుమార్ గుండె ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, మూడుసార్లు బద్దలైంది. అతను అసలైన ప్రేమ దొరుకుతుందని -ఏకంగా మూడుసార్లు వివాహం చేసుకున్నాడు, కానీ అతని బ్యాడ్ లక్ కట్టుకున్న ముగ్గురు భార్యలు పెళ్లైన రెండు నెలల్లోనే అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.  

మేకప్ కిట్ తీసుకురమ్మని చెప్పి

బీహార్‌లోని జముయ్ జిల్లాలోని మలయ్‌పూర్ బస్తీలో నివసించే బబ్లూ కుమార్ శర్మ జీవితం సినిమా కథలా అనిపిస్తుంది. ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళిన బబ్లూ ఇప్పటివరకు మూడుసార్లు వివాహం చేసుకున్నాడు, కానీ ప్రతిసారీ అతనికి ద్రోహం, ఒంటరితనమే ఎదురయ్యాయి.  మూడుసార్లు వివాహం చేసుకున్నప్పటికీ, అతని భార్యలు ఎవరూ అతనితో ఎక్కువ కాలం ఉండలేదు. అతని మూడవ భార్య అయితే  పెళ్లైన ఒక రోజుకే తన ప్రియుడితో పారిపోయింది. 2023 డిసెంబర్ 2న మూడో పెళ్లి చేసుకున్న బబ్లూ భార్య మేకప్ కిట్ తీసుకురమ్మని చెప్పి అతను వచ్చేసరికి ప్రియుడితో పరార్ అయింది. 

2022 ఏప్రిల్ లో బబ్లు మొదటిసారి వివాహం చేసుకున్నాడు. కానీ రెండు నెలల తర్వాత అతని భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత జూన్ 2023లో, ఈసారి అంతా బాగానే ఉంటుందని భావించి రెండో వివాహం చేసుకున్నాడు. కానీ కేవలం ఒకటిన్నర నెలల్లోనే అతని రెండవ భార్య కూడా అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. మూడో పెళ్లి చేసుకుంటే ఒక్కరోజుకే ఆమె ప్రియుడితో వెళ్లిపోయింది.  అయిన బబ్లూ పట్టు వదలలేదు. ఇప్పుడు అతను తన నాల్గవ వివాహానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో ఒక రోజు తనను అర్థం చేసుకునే వ్యక్తి దొరుకుతుందని ఆశిస్తున్నాడు.

Also read : Dil Raju: రేపు దిల్ రాజు బిగ్ అనౌన్స్మెంట్.. ఆ సినిమా గురించేనా..?

 

Advertisment
Advertisment
Advertisment