Fairness Cream:ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్‌పై రూ.15 లక్షల ఫైన్

ఇమామి లిమిటెడ్‌ కంపెనీపై కన్స్యూమర్ ఫోరమ్ రూ.15 లక్షల ఫైన్ వేసింది. ఓ వినియోగదారుడు వేసిన ఫిర్యాదు మీద విచారించిన ఫోరం మోసపూరిత యాడ్స్ ఇస్తున్నందకు 15 లక్షల జరిమానా విధించింది. కంపినీ చెప్పినట్లు వాడినా తనకు ఫెయిర్ నెస్ రాలేదని ఫిర్యాదు చేశాడు కస్టమర్.

New Update
fair handsome

ప్రజలను తప్పుదోవ పట్టించే యాడ్స్ చేసినందుకు ఇమామి లిమిటెడ్‌ కంపెనీపై కన్స్యూమర్ ఫోరమ్ రూ.15 లక్షల ఫైన్ వేసింది. కంపెనీకి చెందిన ఫెయిర్‌నెస్ క్రీమ్ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ యాడ్ మోసపూరితంగా ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని ఓ వ్యక్తి వినియోగదారుల హక్కుల ఫోరంను ఆశ్రయించాడు. సెంట్రల్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ రిడ్రెసల్ కమిషన్ ఈ కేసును విచారణ చేసింది.

2013లో కస్టమర్ రూ.79 రూపాయలకి పెట్టి ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్‌ క్రీమ్‌ను కొనుగోలు చేశాడు. ఆ ప్రోడక్ట్ వాడితే స్కిన్ ఫెయిర్ అవుతుందని చెప్పి.. ఇప్పటి వరకు తన స్కిన్‌లో ఎలాంటి మార్పు రాలేదని.. యాడ్స్ అన్ని అబద్ధాలు చెప్పారని వినియోగదారుడు కంప్లైయింట్ చేశారు.

ఇది కూడా చదవండి : కేవలం 3 రోజుల్లో రూ.5.5 లక్షల నష్టం

ప్రోడక్ట్ లేబుల్‌పై ఉన్న సూచన ప్రకారం క్రమం తప్పకుండా ఉపయోగించినట్లు కస్టమర్ చెప్పాడు. కానీ అతను అనుకున్న విధంగా ఫెయిర్‌నెస్ రాలేదని ఆ కంపెనీ అతన్ని మోసం చేసిందని కోర్టుకు తెలిపాడు. ఫిర్యాదు చేసి వ్యక్తి కంపెనీ సూచనలను సరిగ్గా పాటించలేదు.. అసలు క్రీమ్‌ను ఉపయోగించలేదని రుజువు కాలేదని ఇమామి కన్స్యూమర్ కోర్టుకు తెలిపింది. తమ ప్రోడక్ట్‌లో లోపం లేదని చెప్పారు.

ఇది కూడా చదవండి :తెలంగాణలో తీవ్ర చలి.. ఏపీకి భారీ వర్షాలు..!

కంపెనీ సూచనలను పాటించలేదని ఫిర్యాదుదారుని తప్పుబట్టలేమని ఫోరమ్ తెలిపింది. ఇది తప్పుదోవ పట్టించే యాడ్స్, అన్యాయమైన వాణిజ్య పద్దతులను సూచిస్తుందని అధ్యక్షుడు ఇందర్ జీత్ సింగ్, సభ్యురాలు రష్మీ బన్సాల్‌లతో కూడిన ఫోరమ్ ఇమామి లిమిటెడ్‌కి రూ.15 లక్షల జరిమానా విధించింది.

Also Read: Ap Rains: ఏపీ పై అల్పపీడనం ఎఫెక్ట్‌..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

Also Read: Ap: ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌...క్రిస్మస్‌,సంక్రాంతి కానుకలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: ఘనంగా జరిగిన అఘోరీ-వర్షిణిల పెళ్లి.. వేదమంత్రాల సాక్షిగా తాళికట్టిన శీనుగాడు!

లేడీ అఘోరీగా తిరుగుతున్న శ్రీనివాస్, వర్షిణిలు ఎట్టకేలకు అనుకున్నంత పనిచేశారు. సోమవారం ఓ గుడిలో ఘనంగా వివాహం చేసుకున్నారు. వేదమంత్రాల సాక్షిగా వర్షిణి మెడలో తాళి కట్టింది అఘోరి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

New Update

Aghori: లేడీ అఘోరీగా తిరుగుతున్న శ్రీనివాస్, వర్షిణిలు ఎట్టకేలకు అనుకున్నంత పనిచేశారు. సోమవారం ఓ గుడిలో ఘనంగా వివాహం చేసుకున్నారు. వేదమంత్రాల సాక్షిగా వర్షిణి మెడలో తాళి కట్టింది అఘోరీ. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

సాధువుల మధ్య అంగరంగ వైభవంగా..

ఈ మేరకు నార్త్  స్టేట్‌లో అనేక సాధువుల మధ్య అంగరంగ వైభవంగా అఘోరీ-.. వర్షిణి మెడలో తాళి కట్టింది. ఇద్దరు పరస్పరం దండలు మార్చుకుని తలంబ్రాలు పోసుకున్నారు. హోమ గుండం చుట్టూ ఏడు అడుగులు నడిచారు. అక్కడున్న సాధువులంతా భక్తి పాటలు పాడుతూ నూతన జంటను ఆనంద పరిచారు. ఈ సందర్భంగా మాట్లాడిన అఘోరీ.. ఇద్దరం కలిసి మరోసారి పార్వతి పరమేస్వర్లకు జన్మిస్తామని చెప్పింది. శ్రీ వర్షిణీతో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న తన ఇంటికి వస్తానని చెప్పింది. తామిద్దరం పిల్లలను కూడా కంటామంటూ చెప్పడం విశేషం. తల్లిదండ్రుల సమక్షంలో ఒకసారి, అంతకముందు దేవాలయంలో ఒక సారి మొత్తం రెండు సార్లు వర్షిణికి  తాళి కట్టినట్లు అఘోరి చెప్పింది. 

Also Read: పిల్లలు థియేటర్ వైపు రావొద్దు.. హిట్-3 సెన్సార్ షాకింగ్ రిపోర్ట్

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పూజల పేరిట భారీ మోసాలకు పాల్పడ్డట్లు  సైబరాబాద్‌ మొకిలా పీఎస్‌లో కేసు నమోదైంది. యోని పూజ చేస్తానంటూ రూ.10 లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ మహిళా నిర్మాత ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఉజ్జయినిలోని ఫాంహౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. రెండు విడతలుగా అఘోరీకి రూ. 10 లక్షలు ఇచ్చినట్లు తెలిపింది. దీంతో ఫిబ్రవరి 25న అఘోరీపై 308(5), 318(1),351(4),352 BNS సెక్షన్లకింద ఎఫ్ఐఆర్ నమోదైంది. 

Also Read: మేటర్ పెద్దదే..! ఇంట్లో వాళ్ళతో మాత్రం అస్సలు చూడకండి..

Aghori for Varshini | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు