Kerala: కాంగ్రెస్‌ నేత ఇంట్లో చేతబడి వస్తువులు!

కేరళ ప్రదేశ్‌ కమిటీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కన్నూర్‌ ఎంపీ సుధాకరన్‌ నివాసంలో చేతబడికి సంబంధించిన వస్తువులు దొరికాయన్న ఆరోపణల వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

New Update
Kerala: కాంగ్రెస్‌ నేత ఇంట్లో చేతబడి వస్తువులు!

Kerala:  కేరళ ప్రదేశ్‌ కమిటీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కన్నూర్‌ ఎంపీ సుధాకరన్‌ నివాసంలో చేతబడికి సంబంధించిన వస్తువులు దొరికాయన్న ఆరోపణల వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. వీడియోలో కన్నూర్ లోని సుధాకరన్‌ నివాసంలో కొందరు వ్యక్తులు చేతబడికి సంబంధించిన పాతిపెట్టిన వస్తువులను బయటకు తీసుకుని వస్తున్నారు.

అయితే ఈ వీడియో పై కేపీసీస అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు. ఇది పాత వీడియో అని , ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. పాతిపెట్టిన వస్తువులను బయటకు తీసినప్పుడు మీరు సంఘటనా స్థలంలో ఉన్నారా అని సుధాకరన్‌ ప్రశ్నించగా..మీరు ఉన్నితాన్‌ నుంచి పూర్తి సమాచారం పొందండి ఇలాంటి బెదిరింపులకు నేను భయపడేదే లేదు. ఈ విషయాల గురించి తాను కూడా విన్నట్లు చెప్పుకొచ్చారు.

ఈ వీడియోలో మూడో వ్యక్తి కూడా కనిపించాడు. ఆ వ్యక్తి జ్యోతిష్కుడనే ఊహాగానాలు బయటకు వస్తున్నాయి.వీటిని చేతబడి కోసం వినియోగిస్తున్నట్లు ఆ వీడియోలో కొన్ని మాటలు వినపడుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Also read: ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బావిలో పడింది. ఏడుగురు మహిళలు మృతి చెందగా.. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ విషాదం శుక్రవారం జరిగింది. మృతుల కుటుంబాలకు CM రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

New Update
tractor accident in MH

tractor accident in MH

కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళా కూలీలు మరణించగా.. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అసే గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి మహిళా కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పింది. అక్కడున్న వ్యవసాయ బావిలో అది పడింది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు.  

Also read: KCR: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మోటారు పైపులతో నీటిని తోడారు. క్రేన్స్‌ను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని బయటకు తీశారు. ఏడుగురు మహిళా కూలీల మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు మహిళలను రక్షించారు. మరమణించిన ఏడుగురు మహిళలు హింగోలి జిల్లాలోని గుంజ్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మహారాష్ట్ర సీఎం కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

Advertisment
Advertisment
Advertisment