MISSING : ఫ్రీ బస్సు ఎఫెక్ట్.. వందల కిలోమీటర్లు ప్రయాణించిన వశిష్ట.. ఎక్కడ దొరికిందంటే!

కరీంనగర్ లో తప్పిపోయిన 13 ఏళ్ల బాలిక వశిష్ట కృష్ణను ఎట్టకేలకు పోలుసులు గుర్తించారు. ఐదు బృందాలుగా ఏర్పడి గాలించిన పోలీసులు శుక్రవారం రాత్రి 1:09 గంటలకు హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ లో పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

New Update
MISSING : ఫ్రీ బస్సు ఎఫెక్ట్.. వందల కిలోమీటర్లు ప్రయాణించిన వశిష్ట.. ఎక్కడ దొరికిందంటే!

Free Bus Effect :  కరీంనగర్(Karimnagar) లో తప్పిపోయిన 13 ఏళ్ల బాలిక వశిష్ట కృష్ణ(Vasista Krishna) ను ఎట్టకేలకు పోలుసులు గుర్తించారు. కరీంనగర్ బైపాస్ ఫ్లైఓవర్ ప్రాంతంలో బస్సు దిగి కనిపించకుండా పోయిన బాలికను కరీంనగర్ పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో గుర్తించి పట్టుకున్నారు.

ఈ మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా జూబ్లీ బస్టాండ్ ప్రాంతంలో తిరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. శుక్రవారం రాత్రి రాత్రి 1:09 గంటలకు బాలికను చాకచక్యంగా పట్టుకొని కరీంనగర్ కు చేరుకున్నారు. బాలిక దొరికిన ఆనందంలో వశిష్ట కుటుంబ సభ్యులు పోలీసులకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ ఆపరేషన్ లో కరీంనగర్ రూరల్ ఎస్సై వెంకట్రాజం, అమ్మాయి బంధువులు, జూబ్లీ బస్టాండ్(Jubilee Bus Stand) పరిసర ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చేయగా దొరికింది. అయితే బాలిక ఎలా తప్పిపోయిందో.. ఇక్కడకు ఎలా వచ్చిందనే వివరాలు తెలియాల్సివుంది. 37 గంటల్లోనే కేసును చేధించిన పోలీసులపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం ఊటూరుకు చెందిన కనుకుంట్ల నరసింహ రిటైర్డ్ ఆర్మి ఉద్యోగి. ప్రస్తుతం అతడు కుటుంబంతో కలిసి కరీంనగర్ లో నివాసం వుంటున్నారు. నరసింహ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు... పెద్దకూతురు వశిష్ట కృష్ణ (13 ) ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. అయితే క్రిస్మస్ పండగ, బాక్సింగ్ డే సందర్భంగా స్కూల్ కి వరుస సెలవులు వుండటంతో వశిష్ట కృష్ణ అమ్మమ్మవాళ్ల ఇంటికి వెళ్లింది. సెలవులు ముగియడంతో నిన్న(బుధవారం) బాలికను తాతయ్య పెద్దపల్లిలో ఆర్టిసి బస్సు ఎక్కించాడు. కూతురు ఒంటరిగా వస్తుండటంతో ముందుగానే బస్టాప్ వద్దకు వచ్చి ఎదురుచూసాడు. బస్సు రాగానే దగ్గరకు వెళ్లి కూతురు కోసం చూసాడు. ఆమె కనిపించకపోవడంతో కంగారుపడిపోయిన అతడు కండక్టర్ తో పాటు ఇతర ప్రయాణికులను ఆరా తీసాడు. ఆమె కరీంనగర్ బైపాస్ లో దిగిపోయిందని వారు చెప్పారు.

ఇది కూడా చదవండి : AP: కోడికత్తి, బాబాయ్ మర్డర్ సినిమాలు కూడా తీయండి.. ఆర్జీవీకి లోకేష్ సలహా

దీంతో ఏదయినా అవసరం వుండి అక్కడి దింగిదేమోనని తండ్రి అక్కడికి వెళ్లాడు. కానీ బాలిక ఎక్కడా కనిపించలేదు. కూతురు వశిష్ట ఆచూకీ కోసం ఎంత వెతికినా లభించకపోవడంతో నరసింహ పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదుతో బాలిక కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సోషల్ మీడియా ద్వారా బాలిక మిస్సింగ్ గురించి తెలియడంతో ఓ యువకుడు బాలిక కుటుంబసభ్యులకు కొంత సమాచారాన్ని ఇచ్చాడు. హైదరాబాద్ నుండి జగిత్యాలకు వెళుతున్న బస్సులో తనతోపాటు వశిష్ట కూడా వుందని... అయితే తాను మార్గమధ్యలో దిగిపోయానని తెలిపాడు. దీంతో బాలిక జగిత్యాలకు వెళ్లివుంటుందని భావించిన పోలీసులు అక్కడికి వెళ్లారు. జగిత్యాల పోలీసుల సాయంతో బస్టాండ్, ఇతర ప్రాంతాల్లో వశిష్టం జాడకోసం గాలించారు కరీంనగర్ పోలీసులు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment