అమ్మో.. ఆ రాష్ట్రంలో 11,888 బాలికలకు కన్య పూజలు ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఆడబిడ్డల ఆరాధన మహోత్సవం 'శక్తివందనం' కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో 11,888 మంది బాలికలకు పూజలు చేసి, కన్యా భోజనం ఏర్పాటు చేశారు. షాహీద్-ఎ-ఆజం సర్దార్ భగత్ సింగ్ ఇంటర్ కళాశాల ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఈ వేడుకలను నిర్వహించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ తెలిపారు. By B Aravind 23 Oct 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమి సందర్భంగా పల్లెల నుంచి మహానగరాల దాకా సందడి వాతావరణం నెలకొంది. అయితే వివిధ ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా.. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో చేసిన ఓ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గొండాలో ఆడబిడ్డల ఆరాధన మహోత్సవం 'శక్తివందనం' నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో 11,888 మంది బాలికలకు పూజలు చేసి, కన్యా భోజనం ఏర్పాటు చేశారు. షాహీద్-ఎ-ఆజం సర్దార్ భగత్ సింగ్ ఇంటర్ కళాశాల ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఈ వేడుకలను నిర్వహించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ తెలిపారు. Also Read: ఇద్దరి ఫొటోలు లీక్.. స్పందించిన శశిథరూర్ భారీ స్థాయిలో ఈ కన్యా పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఘనమైన ఏర్పాట్లు చేసింది. 11 వేల 888 మందికి పైగా బాలికలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని రికార్డు సృష్టించారు. అంతేకాదు కన్యా పూజ వేడుకలో ‘జీరో వేస్ట్ ఈవెంట్’ ను కూడా నిర్వహించారు. అయితే ఈ భారీ కార్యక్రమంలో మొత్తం 138 కిలోల తడి చెత్త.. అలాగే 70 కిలోల పొడి చెత్త ఏర్పడింది. ఈ వ్యర్థాలను అక్కడికక్కడే పూర్తిగా తొలగించేలా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక తడి చెత్తను పారవేసేందుకు వేదిక వద్ద కంపోస్టు పిట్ను కూడా ఏర్పాటు చేశారు. #uttar-pradesh-news #durgashtami #kanya-puja #national-news #telugu-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి