US Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి షాక్.. హెచ్‌-1బీ సహా పలు కేటగిరీలకు ఫీజులు పెంపు

హెచ్‌-1 బీ వీసా అప్లికేషన్‌ ఫీజును 460 డాలర్లుగా ఉండగా.. ఇప్పుడు దాన్ని 780 డాలర్లకు పెంచినట్లు బైడెన్ సర్కార్ వెల్లడించింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. అలాగే హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్, ఈబీ-5 వీసాల దరఖాస్తు రుసుమును కూడా పెంచినట్లు తెలిపింది.

New Update
US Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి షాక్.. హెచ్‌-1బీ సహా పలు కేటగిరీలకు ఫీజులు పెంపు

అమెరికాకు వెళ్లాలనుకునే ఇండియన్స్‌పై మరింత భారం పడనుంది. H-1 బీ సహా కొన్ని కేటగిరీల దరఖాస్తు ఫీజులను పెంచుతున్నట్లు తాజాగా అమెరికా ప్రకటించింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. చివరిసారిగా 2016లో వీసాల దరఖాస్తుల రుసుమును పెంచారు. ఈ తర్వాత మళ్లీ ఇప్పుడు 2024లో పెంచుతున్నట్లు బైడెన్ ప్రభుత్వం తెలిపింది.

అప్లికేషన్ ఫీజు పెంపు

ప్రస్తుతం హెచ్‌-1బీ వీసా అప్లికేషన్ ఫీజు 460 డాలర్లుగా ఉండగా.. ఇప్పుడు దాన్ని 780 డాలర్లకు పెంచారు. అలాగే హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్ ఫీజును కూడా 10 డాలర్ల నుంచి 215 డాలర్ల వరకు పెంచారు. అయితే ఇది 2025 నుంచి అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. మరోవైపు ఎల్‌-1 వీసా దరఖాస్తు ఫీజును కూడా 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు పెంచేశారు.

Also Read: రూ.లక్ష కోట్లు కాజేసి దేశాన్నే కుదిపేసిన మహిళ..

భారతీయులే అధికం

ఈబీ-5 వీసాల దరఖాస్తు రుసుములను కూడా 3,675 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచారు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ తమ ఫెడరల్‌ నోటిఫికేషన్‌లో ఈ విషయాలను వెల్లడించింది. అయితే అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను రిక్రూట్‌ చేసుకునేందుకు హెచ్‌-1బీ వీసా అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ హెచ్‌-1బీ వీసాలు వినియోగిస్తున్న వాళ్లలో భారతీయులే అధికం.

1990లో ఈబీ-5 ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. అమెరికన్ స్థానికులకు కనీసం 10 మందికి ఉద్యోగం కల్పించేలా కనిష్ఠంగా రూ.5 లక్షల డాలర్ల పెట్టుబడితో వ్యాపారాలు ప్రారంభించేవారికి ఈ వీసాలను జారీ చేస్తారు. ఇక ఎల్‌-1 వీసా అనేది కంపెనీలో అంతర్గతంగా బదిలీ అయ్యే ఉద్యోగులకు ఇచ్చే వీసా. మల్టీ నేషనల్‌ కంపెనీలు విదేశాల్లో ఉన్న తమ బ్రాంచీల నుంచి ఉద్యోగులను కొంతకాలం పాటుగా అమెరికాకు తీసుకొచ్చి అక్కడ విధులు నిర్వహించడానికి ఈ ఎల్‌-1 వీసా అనేది అవకాశం కల్పిస్తుంది.

Also Read: ‘నన్ను క్షమించండి’ 😢.. ఎమోషనల్ అయిన మార్క్‌ జూకర్‌బర్గ్‌

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pakistan PM: యుద్ధానికి సిద్ధం సైన్యానికి సెలవులు రద్దు.. పాకిస్థాన్ కీలక ప్రకటన

భారత్ సిందూ ఒప్పందం రద్దు చేయడమంటే యుద్ధం ప్రకటించడమే అంటూ పాక్ పేర్కొంది. పాక్ ప్రధాన మంత్రి గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. పాక్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది. భారత్ దాడి చేస్తే.. తిప్పికొట్టాలని ఆర్మీని ఆదేశించింది.

New Update
pak meeting

పాక్, భారత్ మధ్య ఉత్రిక్తత పరిస్థితిను నెలకొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ పాక్‌తో దౌత్య సంబంధాలు తెచ్చుకుంది. పాకిస్థాన్ హై కమిషన్ ఆఫీస్ కూడా ఖాళీ చేయాలని 72 గంటల టైం ఇచ్చింది. అలాగే సిందూ నదీ జలాల ఒప్పందం కూడా రద్దు చేసింది. దీంతో గురువారం పాకిస్థాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత వైఖరిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది.

భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని పాక్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. పహల్గామ్ దాడిలో భారత్ అసత్యాలు ప్రచారం చేస్తోందని పాక్ ప్రధాని రిలీస్ చేసిన ప్రెస్ మీట్ లో అన్నాడు. భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన అన్నారు. పాకిస్థాన్ భద్రతా అధికారులు, ఆర్మీ ఆఫీసర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయాలన్న భారత ప్రకటనను పాకిస్తాన్ తీవ్రంగా తిరస్కరించింది. ఈ ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఏకపక్షంగా నిలిపివేయడానికి ఇందులో ఎటువంటి నిబంధన లేదని పాక్ ప్రధాని చెప్పారు.

సిందూ నదీ జలాలు ఆపడం అంటే యుద్ధం ప్రకటించడమే అని పాక్ అభిప్రాయ పడుతుంది. భారత్ నుంచి పాకిస్థాన్‌కు విమానాలను కూడా పాకిస్తాన్ రద్దు చేసింది. పాకిస్తాన్, దాని సార్వభౌమాధికారానికి ఏదైనా భంగం వాటిల్లితే వెంటనే ప్రతిచర్యలు ఉంటాయని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ అన్నాడు.

( attack in Pahalgam | india pakistan news | india-pakistan | war | terrorist | jammu-and-kashmir | pakistan | latest telugu news | today news in telugu)

 

Advertisment
Advertisment
Advertisment