America: ఆ భారతీయ విద్యార్థిని ఆచూకీ చెబితే 10 వేల డాలర్లు..అమెరికా ఎఫ్‌బీఐ!

నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాలో మిస్సయిన భారతీయ విద్యార్థిని మయూషి భగత్‌ ఆచూకీ చెప్పిన వారికి అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ 10 వేల డాలర్ల రివార్డును ప్రకటించింది.

New Update
America: ఆ భారతీయ విద్యార్థిని ఆచూకీ చెబితే 10 వేల డాలర్లు..అమెరికా ఎఫ్‌బీఐ!

నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాలో  (America) కనిపించకుండా పోయిన భారతీయ విద్యార్థిని(Indian Student)  మయూషి భగత్‌  (Mayushi Bhagath) ఆచూకీ తెలిపిన వారికి 10 వేల డాలర్ల బహుమతిని అందిస్తామని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ (FBI) ప్రకటించింది. భారత్‌ కి చెందిన 29 ఏళ్ల మయూషి భగత్‌ 2019 మే 1న న్యూజెర్సీలో (Newjersy)  కనిపించకుండ పోయింది.

ఆమెను చివరిసారిగా స్థానికులు ఆమె అపార్ట్‌ మెంట్‌ లో ఏప్రిల్‌ 29, 2019 న పైజామా ప్యాంట్‌ నల్ల టీషర్టులో చూసినట్లు తెలిపారు. ఆ తరువాత రెండు రోజులకు ఆమె కుటుంబ సభ్యులు ఆమె మే 1 నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంతగా గాలించినప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు.

దీంతో ఆమెను మిస్సింగ్‌ వ్యక్తుల జాబితాలో గతేడాది పోలీసులు చేర్చారు. మయూషి స్టూడెంట్‌ వీసా మీద అమెరికాకు వెళ్లింది. ఆమె న్యూయార్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న సమయంలో ఆమె కనిపించకుండా పోయింది. ఆమె మూడు భాషలను అనర్గళంగా మాట్లాడగలదని పోలీసులు తెలిపారు.

ఆమెకు న్యూజెర్సీలోని సౌత్‌ ప్లెయిన్‌ఫీల్డ్‌ లో స్నేహితులు ఉన్నారని దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ వెల్లడించింది. ఆమె వివరాలను కూడా అధికారులు బయటకు వివరించారు. ఆమె కళ్లు గోధుమ రంగులో ఉంటాయని, ఆమె జుట్టు నల్లగా ఉంటుందని, ఆమె ఎత్తు 5.10 అడుగులు ఉంటుందని వివరించారు.

దీంతో ఎఫ్‌బీఐ తన వెబ్‌సైట్‌ లోని మోస్ట్‌ వాంటెడ వ్యక్తుల జాబితాలో మయూషి పేరును కూడా చేర్చాయి. మయూషి ఆచూకీకి సంబంధించిన సమాచారం తెలిపిన వారికి 10 వేల డాలర్లు అంటే సుమారు 8.32 లక్షల కోట్లు రివార్డు ఇస్తామని ఎఫ్‌బీఐ ప్రకటించింది.ఈ మేరకు ఎఫ్‌బీఐ నెవార్క్ ఫీల్డ్ ఆఫీస్, జెర్సీ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు ప్రకటించారు. మయూషి లొకేషన్ లేదా ఆమె ఆచూకీని కనుగొనే సమాచారం తెలిస్తే అందివ్వాలని కోరారు.

Also read: మల్లన్న భక్తులకు అలర్ట్‌…ఆ మూడు రోజులు ఆర్జిత అభిషేకాలకు బ్రేక్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment