/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-103.jpg)
పాము పగబట్టడం అనేది కేవలం సినిమాల్లోనే ఉంటుంది...బయట అలా ఏమీ ఉండదు అనుకుంటాము కానీ అది నిజం కాదని నిరూపించింది ఉత్తరప్రదేశ్లోని ఓ పాము. ఓ యువకుడిపై పాము పగబట్టింది. అతడు ఎక్కడకు వెళ్లి వదలడం లేదు. వరుస కాట్లతో బెంబేలెత్తిస్తోంది. ఉన్నచోటు వదిలేసి వేరే ప్రదేశానికి వెళ్ళినా కూడా అక్కడ ప్రత్యక్షమై కాటు వేస్తోంది. ఎందుకిలా జరుగుతోందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అయితే ఇప్పటివరకు పాము కాటు నుంచి కోలుకున్న దూబేకు చివరిసారి మాత్రం బాగా ఆరోగ్యం దెబ్బ తింది.
దూబే పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఈ పాము కాటుకు సంబంధించి వికాస్ కొన్ని విస్తుపోయే వివరాలను తెలిపాడు. తనకు ఇటీవల ఓ కల వచ్చిందని, అందులో తనను పాము 9సార్లు కాటు వేసిందని తెలిపాడు. చివరిసారి పాము కాటు వేసిన సమయంలో తనను ఎవరూ కాపాడలేరని కలలో కనిపించిన వివరాలు వెల్లడించారు. దీంతో వికాస్ తెలిపిన విషయాలతో వైద్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
దూబే పాము కాటు విషయం వింతగా ఉండడంతో.. కేసు వివరాలను దర్యాప్తు చేయడానికి అధికారులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనల వెనుక అసలు విషయాలను వెలికితీయడమే దర్యాప్తు చేపట్టామని తెలిపారు.
TG News: రేవంత్ సర్కార్ ను కూల్చడానికి రంగం సిద్ధం.. BRS ఎమ్మెల్యే సంచలన ప్రకటన!
రేవంత్ సర్కార్ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొని గవర్నమెంట్ కూల్చాలని కోరుతున్నారంటూ దుమారం రేపారు.
TG News: రేవంత్ సర్కార్ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు కాంగ్రెస్ పాలనతో విసుగు చెందారని, వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని అన్నారు. అంతేకాదు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామంటున్నారంటూ దుమారం రేపారు.
కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది..
ఈ మేరకు పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్ గా ఉంటే కుదరడం లేదు. దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు. సర్పంచులకు బిల్లులు రాక లబో దిబోమని మొత్తుకుంటున్నారని, ఇళ్లు, డ్రైనేజీలు కట్టినవారు బిల్లులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారన్నారు. తెలంగాణ పది జిల్లాల్లో దుబ్బాక అంత దారుణంగా ఏదీ లేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
పొంగులేటి కౌంటర్..
అయితే ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై ఘాటుగా స్పందించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 'ప్రభుత్వాన్ని కూల్చాలన్నదే తండ్రీకొడుకుల ఆలోచన. గవర్నమెంట్ కూల్చి తండ్రీకొడుకులు ఆ కుర్చీలో కూర్చోవాలన్నదే ఆలోచన. ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్ నేతలు పదేపదే అంటున్నారు. దమ్ముంటే ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనండి. కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డి. తాటాకు చప్పుళ్లకు ప్రభుత్వం భయపడదు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా భూభారతి అమలు చేసి తీరుతాం' అని పొంగులేటి కౌంటర్ ఇచ్చారు.
kotta-prabhakar | cm revanth | brs | congress | telugu-news | today telugu news
Stomach Ulcers: కడుపులో పుండ్లు ఎందుకు వస్తాయి.. ఎలా నియంత్రించాలి?
Mamya Shajaffar: ట్రెడిషనల్ లుక్లో మమ్యా షజాఫర్.. ఎల్లో డ్రెస్లో లక్ష్మీదేవిలా కనిపిస్తుందిగా!
HCU భూముల వ్యవహారం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన!
JEE Main Exam: జేఈఈ విద్యార్థులకు షాక్.. 'కీ' లో గందరగోళం
Balayya: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..