Budget 2024: రూ. 3 లక్షల లోపు జీతం ఉన్న వారికి నో టాక్స్..

ఇంతకు ముందు ఉన్న పన్ను విధానాలను కొనసాగిస్తూనే కొత్త బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. కొత్త పన్ను విధానంలో కేంద్రం స్వల్ప మార్పులు చేసింది. దీంతో కొంతమంది వేతన జీవులకు ఊరట లభించింది.

New Update
Budget 2024: రూ. 3 లక్షల లోపు జీతం ఉన్న వారికి నో టాక్స్..

New Tax Slabs: వేతన జీవులకు పెద్ద రిలీఫ్ వచ్చింది. కొత్త పన్ను విధానంతో వారికి స్వల్ప ఊరట లభించింది. కొత్త బడ్జెట్ ప్రకారం ట్యాక్స్ సిస్టమ్‌ లో స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంచడంతో పాటు, శ్లాబుల్లోనూ స్వల్ప మార్పులు చేశారు. దీంతో కొత్త పన్ను విధానం ఎంచుకునే టాక్స్ పేయర్స్‌కు రూ.17,500 మేర ఆదా అవుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో ప్రకటించారు.

కొత్త పన్ను విధానాలు..

₹ 3 లక్షల కంటే తక్కువ సంపాదిస్తున్న వ్యక్తులు ఇక మీదట అసలు పన్ను కట్టక్కర్లేదు. వారికి పన్ను రేటు శూన్యం . ఇంతకు ముందు ఉన్న ₹ 3 లక్షల నుంచి ₹ 6 లక్షల శ్లాబ్‌ను...ఇప్పుడు ₹ 3 లక్షల నుంచి ₹ 7 లక్షలకు పెంచారు . పన్ను రేటు, అంటే 5%, మారదు. అదేవిధంగా, ఇతర కొత్త పన్ను స్లాబ్‌లు రూ.7 లక్షల నుండి రూ.10 లక్షల వరకు 10%, రూ.10 లక్షల నుండి రూ.12 లక్షల వరకు 15%, ₹ 12 లక్షల నుండి ₹ 15 లక్షల వరకు 20%...₹ 15 లక్షలకు పైబడిన ఆదాయం వారు 30% టాక్స్‌లు కట్టాల్సి ఉంటుంది.

మరోవైపు పన్ను స్లాబ్‌లను మార్చడమే కాకుండా ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్‌ను ₹ 50,000 నుండి ₹ 75,000కి మార్చింది కేంద్ర ప్రభుత్వం . రిబేట్ మొత్తంలో మాత్రం ఎటువంటి మార్పూ చేయలేదు. కాబట్టి రూ.7.75 లక్షల వరకు ఆదాయం కలిగిన వారు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి వర్తిస్తుంది. కాబట్టి రూ.7.75 లక్షల వరకు ఆదాయం కలిగిన వారు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఇది వర్తిస్తుంది.

అలాగే..పింఛనుదారులకు కుటుంబ పెన్షన్‌లో కోత ₹ 15,000 నుండి ₹ 25,000 కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది . దీనిద్వారా పెన్షన్ పొందే వ్యక్తులకు ఉపశమనం లభించింది. రిటైర్మెంట్ తర్వాత మెరుగైన ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ కొత్త పన్ను విధానం ఉయోగపడుతుంది. ఇక ఆదాయపు పన్ను విధానంలో మార్పుల కారణంగా ప్రభుత్వం ₹ 7,000 కోట్ల ఆదాయాన్ని వదులుకోనుందని ఆర్థిక మంత్రి తెలిపారు .

Also Read: budget 2024: బడ్జెట్ తర్వాత పడిపోయిన రైల్వే స్టాక్స్..



Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Allu Arjun- Atlee: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ హైప్ నెలకొంది. బన్నీ డ్యూయల్ రోల్, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఉండనున్నారని టాక్‌ ప్రచారంలో ఉంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది.

New Update
Allu Arjun – Atlee

Allu Arjun – Atlee Movie

Allu Arjun- Atlee : ఇటీవల టాలీవుడ్ లో హైప్ క్రియేట్ చేసిన ఓ భారీ ప్రాజెక్ట్ ఏమిటంటే.. అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందనున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చిన నాటి నుంచి ఎన్నో ఆసక్తికర రూమర్స్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై, కొన్ని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారన్న టాక్ హీట్ పెంచింది. అంతేకాదు, ఈ చిత్రానికి గ్లోబల్ స్టాండర్డ్స్‌ను లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల, హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ టాప్ స్టార్ ప్రియాంక చోప్రా పేరు తెరపైకి వచ్చింది. హాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెను ఎంపిక చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

ఇప్పటికే ప్రియాంక చోప్రా, మహేశ్ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఇంటర్నేషనల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన కూడా ఆమె కనిపిస్తే, అది మరో క్రేజీ కాంబోగా మారనుంది. అయితే దీనిపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: ఫ్యాన్స్ కు మెగా ట్రీట్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.

ఈ గ్రాండ్ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. బడ్జెట్ పరంగా, విజువల్ ట్రీట్ పరంగా ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో తెరకెక్కించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది. షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం.

Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!

మొత్తానికి అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ హైప్‌ను సృష్టించగా, కథ, తారాగణం, టెక్నికల్ టీమ్ డీటెయిల్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment