/rtv/media/media_files/2025/03/23/LOygEbvdsFjWLwDr9akF.jpg)
meerut
మీరట్లో భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. లండన్లో ఉద్యోగం చేస్తున్న సౌరభ్ రాజ్ పుత్ ఫిభ్రవరిలో ఇండియాకు వచ్చాడు. 2016లో అతను ముస్కాన్ అనే యువతిని ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నాడు. వారికి ఆరేళ్ల పాప కూడా ఉంది. ముస్కాన్ భర్త సౌరభ్ లండన్లో ఉంటుండటంతో ఇంట్లో పాపతో ఒంటరిగా ఉంటుంది. ఈక్రమంలోనే ముస్కాన్కు ఆమె స్కూల్ ఫ్రెండ్ సాహిల్ ఆన్లైన్లో పరిచయం అయ్యాడు. అది కాస్త ప్రేమగా మారింది. సాహిల్కు డ్రగ్స్ బానిసైయ్యాడు. నెమ్మదిగా ముస్కాన్కు డ్రగ్స్కు అలవాటైంది. ప్రియుడితో సెట్టిల్ అవ్వడానికి భర్త సౌరభ్ అడ్డు తొలగించుకుందామని ప్లాన్ చేసింది ముస్కాన్. సౌరభ్ను హత్య చేయడానికి సాహిల్ హెల్ప్ తీసుకున్నాడు. ఫిభ్రవరిలో ఇంటికి వచ్చిన సౌరభ్ను మార్చి 4న తినే ఆహారంలో మత్తుమందు కలిపి చంపేసింది. ఆ తర్వాత సౌరభ్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి డ్రమ్లో పూడ్చిపెట్టారు.
రెండు వారాల తర్వాత సౌరభ్ హత్య బయటపడింది. దీంతో పోలీసులు సాహిల్, ముస్కాన్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. పూర్తిగా డ్రగ్స్కు అడిక్ట్ అయిన వారు జైలులో భోజనం చేయడం లేదు. వారు డ్రగ్స్ కావాలని పోలీసులను అడుగుతున్నారట. ప్రస్తుతం ముస్కాన్, సాహిల్ లను మీరట్ లోని చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలుకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మొదట వారు ఇద్దరు కలిసి ఒకే ఉండాలని కోరారు. కానీ జైలు నిబంధనల ప్రకారం.. ముస్కాన్ను లేడీస్ బ్యారక్, సాహిల్ను పురుషుల గదిలో ఉంచారు. జైలులో వేసినప్పటి నుంచి ముస్కాన్ బాధపడుతుంది. రాత్రి అంతా నిద్రపోలేదు. సాహిల్ మాత్రం సైలెంట్గా ఉంటున్నాడు. భోజనం తినకుండా డగ్స్ కావాలని జైలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అతను ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకునే వాడని డాక్టర్లు చెబుతున్నారు.