ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ లకు మరో యువకుడు బలి.. రూ.10 లక్షల అప్పు చేసి

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలైపోయాడు. బెట్టింగ్ లో నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దపెల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కోరబోయిన సాయి తేజ (25) లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. రూ.10లక్షలకు పైగా అప్పులపాలై వాటని కట్టలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

New Update
online betting yuvakudu

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు  మరో యువకుడు బలైపోయాడు. బెట్టింగ్ లో నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దపెల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన కోరబోయిన సాయి తేజ (25) లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.

Also read :  హైదరాబాద్‌లో తక్కువ ధరకే మేక, గొర్రె మాంసం...ఇది తింటే ఇక బతికినట్టే..

రూ.10లక్షలకు పైగా అప్పులు

గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో కాపురం పెట్టాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తు్న్న సాయితేజ్.. బెట్టింగులకు బానిసయ్యాడు.  ఈ క్రమంలో రూ.10లక్షలకు పైగా అప్పులపాలయ్యాడు. వాటని కట్టలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. దీంతో మార్చి 18వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం రాత్రి సాయి తేజ మృతి చెందాడు. అతని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మంథనికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read :  Online Betting: మధురానగర్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్..ముఠా అరెస్ట్

తెలంగాణ ప్రభుత్వం సీరియస్

మరోవైపు బెట్టింగ్ ప్రమోషన్స్ ను తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. బెట్టింగ్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన కేసులపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఏడాదిలో 25 మంది బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు.  నమోదైన కేసుల ఆధారంగా ఆయా బెట్టింగ్‌ యాప్స్ ను గుర్తించే పనిలో పడ్డారు. 

Also read :  బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తే తప్పని ఎలా తెలుస్తుంది ?  అనన్య నాగల్ల సంచలన వ్యాఖ్యలు

Also read :  ఐపీఎల్ టీమ్స్ వెనుకున్న పెద్ద మనుషులు ఎవరు.. బ్యాక్ గ్రౌండ్ ఏంటీ?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం.. 17 మంది సజీవ దహనం!

గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బనస్కాంతలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో భవనం కుప్పకూలిపోగా 17 మంది మృతి చెందారు. మరికొందరు థిలాల కింద చిక్కుకుపోయారు. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చెపట్టారు.

New Update
gujarath crime

gujarath crime

Crime News: గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బనస్కాంత జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ప్రమాదంలో భవనం కుప్పకూలింది. పేలుడు దాటికి 17 మంది మృతి చెందాగా.. ఆరుగురు గాయపడ్డారు. గాయ పడిన క్షతగాత్రులను  దగ్గరలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తునట్లు జిల్లా పరిపాలన అధికారి   తెలిపారు. దీసా పట్టణానికి సమీపంలో ఉన్న బాణసంచా కేంద్రంలో మంగళవారం జరిగిన ఈ ఘటనతో నగర వాసులు భయంతో పరుగులు తీశారు.  

 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు చెపట్టారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ ప్రమాదం జరగటంతో ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ చౌదరి ఆధ్వర్యంలో  ప్రమాద స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీంచారు. మృతుల వివరాలపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Sagar Patoliya on X: "ડીસા GIDCમાં આગ, 10+ લોકોના મોત! બનાસકાંઠાના ડીસા GIDCમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 10થી વધુ મજૂરોનાં મોત થયા છે. બોઈલર ફાટવાના કારણે આજે સવારે આગ લાગી હતી, આગ કાબૂમાં લેવા ફાયર વિભાગ ઘટના સ્થળે તાત્કાલિક હાજર થયો હતો.. બોઈલર https://t.co/1jOSR3Skdy" / X

కార్మికులు మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం ఆందోళన  చెందుతున్నారు. 17 మంది ఒక్కసారి చనిపోవటంతో బనస్కాంత నగరం అంతా విషాదఛయాలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి:  శరీరంలో విటమిన్ K లోపం ఉంటే రక్తస్రావం తప్పదా?

Advertisment
Advertisment
Advertisment