World Cancer Day : మెరుగైన జీవనశైలి క్యాన్సర్ ప్రమాదాన్ని దూరం చేస్తుంది.. ఎలాగంటే!

ప్రతి ఏడాది ఫిబ్రవరి 4ను ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఊబకాయం వల్ల రొమ్ము, గాల్ బ్లాడర్, కిడ్నీ, పేగులతో సహా మొత్తం 11 రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్‌ గురించి మరిన్ని వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.

New Update
World Cancer Day : మెరుగైన జీవనశైలి క్యాన్సర్ ప్రమాదాన్ని దూరం చేస్తుంది.. ఎలాగంటే!

World Cancer Day 2024 : ఇవాళ(ఫిబ్రవరి 4) ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం(World Cancer Day). క్యాన్సర్ రావాడానికి ప్రధాన కారణం అవగాహనా రాహిత్యం కూడా. ప్రీ-క్యాన్సర్ లక్షణాలను(Pre-Cancer Symptoms) చాలామంది విస్మరిస్తారు. నోటిలో తెల్లని లేదా ఎర్రటి మచ్చలు, శరీరంలో ఎక్కడో గడ్డలు ఏర్పడి పెరగడం, దీర్ఘకాలిక దగ్గు, నిరంతర మలబద్ధకం సమస్య, ఎక్కువ అలసట, బరువు తగ్గడం లాంటి లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

క్యాన్సర్ లో రకాలు:
అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరి లక్షణాలు కూడా భిన్నంగా ఉంటాయి. కంటి, చర్మం, గొంతు, నోరు, పేగు, మూత్రపిండాలు, మూత్రాశయం, గర్భాశయం, రొమ్ము, ఊపిరితిత్తులు మొదలైన క్యాన్సర్లు ఉన్నాయి. భారత్‌లో రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్లను గుర్తించడం, స్క్రీనింగ్ చేయడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.

క్యాన్సర్ ఎందుకు వస్తుంది?
జీవనశైలి(Life Style) తో పాటు పర్యావరణ కారణాలు కూడా దీని వెనుక ఉన్నాయి. నీటిలో పెరిగిన ఆర్సెనిక్ కంటెంట్, పెరిగిన ఫుడ్ పాయిజనింగ్(Food Poisoning)(ఫంగస్ లాంటివి) కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. రెండోది ఊబకాయం. ఇక జన్యుపరమైన కారకాలు కూడా కారణమవుతాయి.

వృద్ధాప్యంతో అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉండటం సహజం. కొన్ని అధ్యయనాలలో రేడియేషన్ కూడా ప్రమాద కారకంగా పరిగణించబడింది. ఏదేమైనా, ఇది ఒక కచ్చితమైన కారణం అని నిర్ధారించడానికి విస్తృతమైన అధ్యయనాలు ఇంకా అవసరం. రెండడోది అండాశయం, గర్భాశయం, రొమ్ము క్యాన్సర్ కారణాలు ప్రారంభ దశలో తెలియదు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

Also Read : పగిలిన మడమలను క్యాండిల్ మైనంతో శుభ్రం చేసుకుంటే ఏం అవుతుందో తెలుసా?

ఎలా నియంత్రించుకోవాలి:
-->  మద్యం సేవించడం ఏ పరిమాణంలోనూ సురక్షితం కాదు. దాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించాలి.

--> ఎర్ర మాంసం వినియోగం(Red Meat), ధూమపానం(Smoking) నియంత్రించాలి.

--> అధిక కొవ్వు, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తగ్గించండి.

--> ఊబకాయం వల్ల రొమ్ము, గాల్ బ్లాడర్, కిడ్నీ, పేగులతో సహా మొత్తం 11 రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.

--> బరువు- ఎత్తు నిష్పత్తి(బాడీ మాస్ ఇండెక్స్) 23 దాటితే అది ఊబకాయం.

Also Read: పగిలిన మడమలను క్యాండిల్ మైనంతో శుభ్రం చేసుకుంటే ఏం అవుతుందో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Whatsapp: వాట్సాప్‌ సేవల్లో అంతరాయం..!

మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్‌ యాప్‌ వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వాట్సాప్‌ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్‌ లు అప్‌లోడ్‌ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

New Update
whatsapp

whatsapp Photograph: (whatsapp)

Whatsapp: మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్‌ యాప్‌ వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. భారత్ లోని యూజర్లు యాప్‌ ను ఉపయోగించడంలో అవాంతరం ఎదుర్కొంటున్నారు. వాట్సాప్‌ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్‌ లు అప్‌లోడ్‌ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్ ప్రకారం..81 శాతం మంది మెసేజులు పంపడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు తెలిసింద.వాట్సాప్‌ దీని పై అధికారికంగా స్పందించలేదు. మెటాకే చెందిన ఫేస్‌బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ సేవల్లోనూ అంతరాయం ఎదుర్కొంటున్నట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. ఉదయం యూపీఐ సేవల్లో ..సాయంత్రం వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడడం పై యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?

ఉదయం యూపీఐ సేవలు..

యూపీఐ సేవలు మరోసారి ఆగిపోయాయి. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే సర్వర్లు అన్ని కూడా డౌన్ అయ్యాయి. అసలు పేమెంట్స్ కావడం లేదని సోషల్ మీడియాలో కస్టమర్లు ట్వీట్స్ చేస్తున్నారు. పేమెంట్స్ కాకపోవడంతో హోటల్స్, షాపులు, మాల్స్, టీ షాపులు, టిఫిన్ సెంటర్లు, పండ్ల మార్కెట్లు ఇలా అన్ని చోట్ల కూడా కస్టమర్లు, వ్యాపారులు గందరగోళానికి గురవుతున్నారు. చేతిలో డబ్బులు వాడటం చాలా మంది ఎప్పుడో మరిచిపోయారు. ఇప్పుడు సడెన్‌గా యూపీఐ పనిచేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వారంలో యూపీఐ పేమెంట్స్ ఆగిపోవడం ఇది రెండోసారి. 

Also Read: Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు

Also Read: Sridhar Babu : హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివే...మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన

business | meta | Facebook Meta | instagram | facebook-instagram-down | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment