TSPSC : నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. కొలువుల భర్తీ అప్పుడే

తెలంగాణలో ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షల తుది ఫలితాలను లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత విడుదల చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. అప్పటిలోగా రాతపరీక్షల తుది 'కీ' ల వెల్లడి, జనరల్ ర్యాంకు జాబితాల ప్రకటన, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయనుంది.

New Update
TSPSC : నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. కొలువుల భర్తీ అప్పుడే

Good News For Un-Employees : తెలంగాణ(Telangana) లో ప్రభుత్వ ఉద్యోగాలను(Government Jobs) త్వరగా భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ(TSPSC) దృష్టి సారించింది. ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షల తుది ఫలితాలను లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం విడుదల చేయాలని యోచిస్తోంది. అప్పటిలోగా రాతపరీక్షల తుది 'కీ' ల వెల్లడి, జనరల్ ర్యాంకు జాబితాల ప్రకటన, ధ్రవీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను పూర్తి చేయనుంది. ఈ మేరకు రానున్న రెండు నెలల్లో పూర్తి చేయాల్సిన పనులను కొనసాగిస్తోంది.

Also Read: తెలంగాణలో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

27సార్లు ఉద్యోగ ప్రకటనలు 

2022 నుంచి ఇప్పటిదాకా 18 వేలకు పైగా ఉద్యోగాలతో.. మొత్తం 27 సార్లు ఉద్యోగ ప్రకటనలు చేసింది టీఎస్‌పీఎస్సీ. 2023లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడటంతో గ్రూప్‌ 1తో సహా 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు రద్దయిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో అధికారంలోకి కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్.. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎస్‌పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి మళ్లీ నియమించింది. దీంతో కొత్తగా వచ్చిన టీఎస్‌పీఎస్సీ బోర్డు రెండు నెలల్లోనే మూడు నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి.. 10 ఉద్యోగ ప్రకటనలను జనరల్ ర్యాంకు జాబితాలను ప్రకటించింది.

గ్రూప్-1, గ్రూప్-2తో పాటు డీఏవో, వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టులకు సంబంధించి రాతపరీక్ష తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. జనరల్ ర్యాంకు జాబితాలు ప్రకటించిన నోటిఫికేషన్లకు కూడా త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనుంది. ఇందులో భాగంగా.. జిల్లా స్థాయి పోస్టులైన గ్రూప్-4 ఖాళీల భర్తీకి త్వరలోనే 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు. ఏఈఈ పోస్టులకు(AEE Posts) సాధారణ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ ప్రక్రియ ముగిసింది. క్రీడా అభ్యర్థుల పరిశీలన పూర్తయిన తర్వాత తుది ఫలితాలు వెల్లడించనుంది. అలాగే ఏఈ పోస్టులకు సైతం తుది 'కీ' ని విడుదల చేయనుంది. రాష్ట్రంలో ఇంటర్ విద్యా విభాగంలో.. 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు 2022 డిసెంబర్‌లో ఉద్యోగ ప్రకటన జారీ చేయడం.. 2023 అక్టోబర్‌లో రాతపరీక్షలు పూర్తయిన సంగతి తెలిసిందే. మరో వారం, పది రోజుల్లో 'కీ' ని వెల్లడించాలని భావిస్తోంది టీఎస్‌పీఎస్సీ.

Also Read: నేడు తుక్కుగూడలో కాంగ్రెస్‌ జనజాతర సభ!

అయితే పరీక్షలకు సంబంధించి కీ విడుదల చేసిన తర్వాత ఎలాంటి అభ్యంతరాలకు తావు లేకుండా చేసేందుకు కమిషన్‌ చర్యలు తీసుకుంటోంది. గతంలో ప్రశ్నపత్రం రూపొందించే సమయంలో నిర్ణయించిన సమాధానాన్ని ప్రాథమిక కీగా ఇస్తుండేవారు. ఆ తర్వాత పరీక్ష రాసి అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని.. సబ్జెక్టు నిపుణులతో కమిటీ ఏర్పాటుకు తుది నిర్ణయం తీసుకునేవారు. అందుకే ఇప్పుడు ముందుగానే సబ్జెక్టు కమిటీ జవాబులను పరిశీలించి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్రాథమిక కీ ని వెల్లడించనున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam attack: మోదీకి చెప్పడానికి నువ్వు బతికుండాలి.. కాల్పుల ముందు టెర్రరిస్ట్ మాటలు (VIDEO)

జమ్మూ కాశ్మీర్‌‌లో పర్యటకులపై ఫైరింగ్ ముందు టెర్రరిస్టులు వారితో మాట్లాడారు. పేరు, మతం అడిగి మహిళ కళ్లముందే ఆమె భర్తని చంపారు. అయితే ఆమెని కూడా చంపమని టెర్రరిస్ట్‌ను అడిగింది. జరిగింది మోదీకి చెప్పడానికి నువ్వు బతికుండాలని ఉగ్రవాది అన్నట్లు తెలుస్తోంది.

New Update
Pahalgam attack 123

జమ్మూ కాశ్మీర్ టెర్రర్ అటాక్‌పై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాల్పులు జరిగిన సమయంలో టూరిస్టులతో ఉగ్రవాదులు మాట్లాడారు. పర్యటకులందరినీ తుపాకులతో బెదిరించి మోకాళ్లపై కూర్చోబెట్టారని ప్రత్యేక సాక్షులు మీడియాకు తెలిపారు. టూరిస్టుల పేరు, మతం అడిగి ముస్లింలు కానివారిని కాల్చి చంపారని ప్రత్యేక్ష సాక్షి పల్లవి చెబుతున్నారు. ఆమె భర్త తన పేరు మంజునాథ్ అని చేప్పగానే అతన్ని కాల్చి చంపారని ఆమె తెలిపారు. తనని కూడా చంపమని ఆమె ఉగ్రవాదులను వేడుకుందట. ఇక్కడ జరిగిందంతా మోదీకి చెప్పడానికి నువ్వు బతికే ఉండాలని ఓ టెర్రరిస్ట్ ఆమెతో అన్నాడని తెలుస్తోంది. టెర్రిస్టులు కాల్పులకు ముందు పర్యటకులతో మాట్లాడిని సంభాషణ గురించి సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ అవుతున్నాయి.

Also read: J&K Terror Attack: ‘పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు’

అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గామ్‌లో మంగళవారం సాయంత్రం టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 30మంది మృతి చెందారు. కాల్పుల్లో మరో 20 మంది గాయపడ్డారు. ది రెసిస్టెంట్ ఫ్రంట్(TRF) అనే ఉగ్రవాద సంస్థనే దాడి చేసినట్లు ప్రకటించింది. పక్కా ప్లాన్ ప్రకారమే ఉద్రవాదులు కాల్పులు జరిపారు. ఇండియన్ ఆర్మీ యూనిఫాంలో వచ్చి ఆకస్మాత్తుగా ఫైరింగ్ చేశారని ప్రత్యేక్ష సాక్షులు, క్షతగాత్రులు చెబుతున్నారు.

Also read: J&K Terror Attack : పాపం.. హనీమూన్కు వచ్చి కట్టుకున్న భర్తను కోల్పోయింది( Video Viral)

Advertisment
Advertisment
Advertisment