Weather : రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌!

రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలో ఎండలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.

New Update
Weather : రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌!

Orange Alert : గత కొద్ది రోజులుగా తెలంగాణ(Telangana) లో ఎండలు అదరగొడుతున్నాయి. రాబోయే ఐదు రోజుల్లో ఎండలు(Sun) మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు(Weather Officials) హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

మార్చి 27 నుంచి 30 వరకు కూడా నిర్మల్‌, ఆదిలాబాద్‌, జగిత్యాల, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబ్‌ నగర్‌, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలకు అధికారులు ఆరెంజ్‌ అలెర్ట్‌ ను జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు ఇలా ఉంటే రాత్రిపూట కూడా అత్యధికంగా 28 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి.

రాష్ట్రంలో 28 నుంచి వేడిగాలులు కొనసాగుతాయని, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో ఎండ తీవ్రత ఎకువగా ఉంటుందని వాతవరణ శాఖ పేర్కొంది.

Also Read : సెలవులకు ఊరెళ్తున్నారా..అయితే ఈ శుభవార్త మీకోసమే.. రైలు సర్వీసులు పొడిగింపు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HariHaraVeeraMallu Release: వీరమల్లు విడుదల డౌటే..? పవన్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ 'హరిహర వీరమల్లు' మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. మే 9న విడుదల కానుండగా.. ఇంకా షూటింగ్ పనులు పెండింగ్ ఉన్నట్లుగా సమాచారం. పవన్ ఆరోగ్యం, అలాగే కొడుకుకు ప్రమాదం జరగడం ఆలస్యానికి కారణమని టాక్.

New Update

HariHaraVeeraMallu Release:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన  'హరిహర వీరమల్లు' మళ్ళీ పోస్ట్ ఫోన్ కానున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ళ క్రితం మొదలుపెట్టిన ఈ సినిమాకు ఇంకా థియేటర్ మోక్షం కలగడం లేదు. మే 9న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించగా.. షూటింగ్ పనులు ఇంకా పెండింగ్ ఉండడంతో మళ్ళీ వాయిదా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వారం పవన్ కు సంబంధించిన షూట్ పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆయన కుమారుడు అగ్ని ప్రమాదానికి గురవడం, పవన్ ఆరోగ్యం కూడా బాగోలేకపోవడంతో  షెడ్యూల్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో అనుకున్న టైంకి మూవీని  రిలీజ్ చేయగలమా? లేదా అనే  టెన్షన్ లో ఉన్నారు మేకర్స్. మరోవైపు  ఫ్యాన్స్ కూడా  తీవ్ర నిరాశ చెందుతున్నారు.  ఇప్పుడు రిలీజ్ కాకపోతే..? ఇకపై  'హరిహరవీరమల్లు' విడుదల డౌటే? అని కామెంట్లు పెడుతున్నారు కొంతమంది. 

Also Read: HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

ఇప్పటికే మూడు సార్లు

ఇప్పటికే ఈ చిత్రాన్ని మూడు సార్లు పోస్ట్ ఫోన్ చేశారు.  మొదటగా 2021లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా.. కరోనా కారణంగా  2022 మార్చి 28కి పోస్ట్ ఫోన్ చేశారు. ఆ తర్వాత  2023, 2024లో పవన్ రాజకీయాలతో బిజీ అయిపోవడంతో 2025 మార్చి 28కి రిలీజ్ వాయిదా వేశారు. అయితే అప్పటికి కూడా ఈ సినిమా చూసే భాగ్యం దక్కలేదు  ఫ్యాన్స్ కి. మళ్ళీ మే 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు టాక్. 

మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై AM. రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని  క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, బాబీ డియోల్, ఎం. నాసర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిఇలా ఉంటే ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. 

cinema-news | latest-news | harihara-veeramallu-movie

Also Read: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు