No Petrol and Diesel:ట్రక్ డైవర్ల సమ్మె-బంకుల్లో నిలిచి పోయిన పెట్రోల్, డీజిల్

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్‌లో పెట్రోలు బంకుల ముందు వాహనదారుల క్యూ కడుతున్నారు. నిన్నటి నుంచి ఆయిల్ ట్యాంకర్ యజమానుల ధర్నా చేస్తుండడంతో వీటి సరఫరా ఆగిపోయింది.

New Update
No Petrol and Diesel:ట్రక్ డైవర్ల సమ్మె-బంకుల్లో నిలిచి పోయిన పెట్రోల్, డీజిల్

Truck Drivers Strike:ఇండియన్ పీనల్ కోడ్‌ను మారుస్తూ కొత్త న్యాయసంహిత అనే చట్టాన్ని అమలులోకి తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని తాలూకా బిల్లు కూడా పార్లమెంటులో ఆమోదం పొందింది. అయితే ఇప్పుడు ఇందులో నిబంధనలు కొన్ని తమకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ట్రక్ యజమానులు, డైవర్లు ఆందోళనకు దిగారు. ఆ రూల్స్‌ను తొలగించాలని కోరుతూ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మె జరుపుతున్నారు. ఇది ఇప్పుడు రెండో రోజుకు కూడా చేరుకుంది. దీంతో గ్యాస్, పెట్రోలు, డీజిల్ లాంటి నిత్యావసరాల సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.నిత్యావసరాల ధరలకు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.

Also Read:కొత్త ఎన్నికల కమిటీని ఏర్పాటు చేస్తున్నాం-కిషన్ రెడ్డి

కొత్తగా రానున్న భారతీయ న్యాయ సంహిత చట్టంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కఠిన నిబంధనలను చేర్చారు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత బాధితులను అక్కడే వదిలేయడం, కనీసం పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకుండా పారిపోవడం లాంటివి చాలా మంది చేస్తారు. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు...హిట్ అండ్ రన్ వాహనాల యజమానులకు సంబంధించి కఠినమైన జరిమానాలను కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ కొత్త చట్టం ప్రకారం ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఇప్పుడే ఈ రూల్‌నే ట్రక్ డైవర్లు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

పెట్రోల్ బంద్...

ట్రక్ డైవర్ల సమ్మెతో చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్‌లో పెట్రోలు బంకుల ముందు వాహనదారులు క్యూలు కడుతున్నారు. ట్రక్ డైవర్ల సమ్మె గురించి తెలియక పెట్రోల్ బంక్ యజమానులు ఫుల్ స్టాక్ పెట్టుకోలేదని చెబుతున్నారు. దీంతో ఉన్న స్టాక్ అయిపోవడంతో చాలా పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఎల్పీజీ సిలెండర్ల కొరత కూడా చాలా ఎక్కువగానే ఉంది. లారీ డ్రైవర్లు ప్లాంటుకు రిపోర్డు చేయకపోవడంతో పంపిణీ జరగలేదని చెబుతున్నారు.

ప్రస్తుతం సమ్మె వలన మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ ల మీద ప్రభావం చాలా ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అక్కడ రహదారుల మీద వాహనాలు కూడా భారీగా నిలిచిపోయాయి. దీంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. అహ్మదాబాద్-వడోదర హైవే మీద ౧౦ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పాటూ అక్కడ ఆర్టీసీ బస్సులను కూడా నిరసకారులు అడ్డుకుంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment