Aishwarya: మేమూ మనుషులమే.. మాకూ భావోద్వేగాలుంటాయి.. రజనీ కూతురు

తండ్రి రజనీకాంత్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరగడంపై ఆయన కూతురు, డైరెక్టర్ ఐశ్వర్య స్పందించింది. 'మేమూ మనుషులమే. మాకూ భావోద్వేగాలుంటాయి. ఈ మధ్యకాలంలో నా తండ్రిని ‘సంఘీ’ అంటూ విమర్శలు చేస్తున్నారు. రజనీకాంత్‌ సంఘీ కాదు' అంటూ ఎమోషనల్ అయింది.

New Update
Aishwarya: మేమూ మనుషులమే.. మాకూ భావోద్వేగాలుంటాయి.. రజనీ కూతురు

Chennai: తమిళ స్టార్ నటుడు రజనీకాంత్‌ (Rajinikanth)పై ఇటీవల సోషల్ మీడియా వేదికగా జరిగిన నెగెటీవ్ ప్రచారంపై ఆయన కూతురు ఐశ్వర్య (Aishwarya) స్పందించింది. తన తండ్రి రజనీపై ట్రోల్స్‌ తమనెంతో బాధించాయని చెప్పింది. ఈమేరకు విష్ణు విశాల్‌ హీరోగా ఆమె దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘లాల్‌ సలామ్‌’ (Lal Salaam) త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ ఐశ్వర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మేమూ మనుషులమే..
‘నిజానికి నేను సోషల్‌మీడియాకు చాలా దూరంగా ఉంటా. ఆన్‌లైన్‌ నెగెటివిటీ గురించి నా టీమ్‌ ఎప్పుడూ చెబుతూనే ఉటుంది. వాటి వల్ల నేను కొన్నిసార్లు తీవ్ర ఆగ్రహాం, ఆందోళనకు గురైన సందర్భాలున్నాయి. మేమూ మనుషులమే. మాకూ భావోద్వేగాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో నా తండ్రిని ‘సంఘీ’ అంటూ విమర్శలు చేస్తున్నారు. ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చేవారిని అలా పిలుస్తారని తెలుసుకున్నా. రజనీకాంత్‌ సంఘీ కాదు. అలా అయితే.. ఆయన ‘లాల్‌ సలామ్‌’లో నటించేవారు కాదు' అంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: Hyderabad: స్టంటర్ శ్రీకాంత్ రౌడీ, దొంగ, డ్రగ్గిస్ట్.. Rtv రిపోర్టులో సంచలన నిజాలు

తప్పుగా అర్థం చేసుకున్నారు..
ఈ క్రమంలోనే రజనీకాంత్ మాట్లాడుతూ.. '‘జైలర్‌’ ఈవెంట్‌లో భాగంగా ‘అర్థమైందా రాజా’ అంటూ నేను చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. విజయ్‌పై పరోక్షంగా మాటల దాడి చేశానన్నారు. అవి నన్నెంతో బాధించాయి. అతడు నా కళ్ల ముందు పెరిగాడు. టాలెంట్‌, పట్టుదలతో ఈ స్థాయికి వచ్చాడు. నాకు ఎవరితోనూ పోటీ లేదు. నాకు నేనే పోటీ. మా అభిమానులకు చెప్పేది ఒక్కటే.. మమ్మల్ని పోల్చి చూడొద్దు. ‘లాల్‌ సలామ్‌’ కథ విన్న వెంటనే యాక్ట్‌ చేయాలని నిర్ణయించుకున్నా. విష్ణు అద్భుతంగా నటించాడు. ఈ సినిమా చూశాక చిత్ర సంగీత దర్శకుడు రెహమాన్‌.. ఐశ్వర్యను ఎంతగానో మెచ్చుకున్నాడు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పాడు’ అంటూ రజనీ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment