TRAI : సేవల్లో అంతరాయం కలిగితే కస్టమర్లకు పరిహారం-ట్రాయ్

జిల్లా స్థాయిలో నెట్వర్క్‌ అంతరాయం కలిగితే పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లకు అద్దెపై రిబేటు ఇవ్వాలని టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ చెప్పింది. టెలికాం కంపెనీలు తప్పనిసరిగా పాటించాల్సిన కొత్త నిబంధనలను ట్రాయ్‌ విడుదల చేసింది. ఈ నిబంధనలు పాటించని కంపెనీలకు జరిమానా వేయనున్నట్లు తెలిపింది.

New Update
TRAI: 2.75 లక్షల నంబర్లు కట్..స్పామ్ కాల్స్ మీద చర్యలు

TRAI New Rules : టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ (TRAI) కొత్త రూల్స్‌ను ప్రకటించింది. వాటి ప్రకారం నడుచుకోకపోతే ఫైన్ కూడా ఉంటుందని హెచ్చరించింది. జారీ చేసిన కొత్త సేవా నిబంధనలు ప్రకారం, జిల్లా స్థాయిలో నెట్వర్క్‌ అంతరాయం కలిగితే పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లకు అద్దెపై రిబేటు ఇవ్వాల్సి ఉంటుంది. అదే ప్రీ పెయిడ్‌ వినియోగదారులకు (Prepaid Customers) అయితే కనెక్షన్‌ చెల్లుబాటు గడువు పెంచాలి. మరో ఆరు నెలల తర్వాత ట్రాయ్ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

నెట్వర్క్ (Network) అంతరాయం 24 గంటలకు మించితే సర్వీసు ప్రొవైడర్లు అద్దెలో కొంత భాగాన్ని రిబేటుగా ఇవ్వాల్సి ఉంటుంది. పోస్ట్‌ పెయిడ్‌ వినియోగదార్లకు (Postpaid Customers) వచ్చే బిల్‌ సైకిల్లో వాటిని చూపించాలి. 12 గంటలకు పైగా అంతరాయం ఉన్నా అద్దెలో రిబేటు లేదా వ్యాలిడిటీ కొనసాగింపునకు దానికి ఒక రోజుగానే పరిగణించాల్సి ఉంటుంది. వారం రోజుల్లోగా నెట్వర్క్ ఇష్యూ లేకుండా చేయాలి. ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో మాత్రమే, ఈ ప్రయోజనాలను అందించాల్సిన అవసరం ఉండదు.
నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైతే కంపెనీలకు కనీస అపరాధ రుసుమును రూ.50,000 నుంచి రూ.1లక్షకు పెంచింది ట్రాయ్. నిబంధనల ఉల్లంఘనల గ్రేడ్లను బట్టి రూ.1 లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షల మేర జరిమానాను విధిస్తుంది. ప్రైమరీ, సెల్యులార్‌ మొబైల్‌ సర్వీసెస్, బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు, బ్రాడ్‌ బ్యాండ్‌ వైర్లెస్‌ సేవలకు ట్రాయ్ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.

ఫిక్స్డ్‌ లైన్‌ సర్వీసు ప్రొవైడర్లు అయినా పోస్ట్‌ పెయిడ్, ప్రీ పెయిడ్‌ కస్టమర్లకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. తమ నెట్వర్క్లోని వైఫల్యానికి మూడు రోజుల్లోగా పరిష్కారం చూపాల్సిందే. చెల్లింపు చేసిన 7 రోజుల్లో బ్రాడ్‌ బ్యాండ్‌ సర్వీసు ప్రొవైడర్లు 98 శాతం కనెక్షన్లను యాక్టివేట్‌ చేయాలి. టెల్కోలు తమ వెబ్సైట్లలో సర్వీసు ప్రకారం (2జీ, 3జీ, 4జీ, 5జీ) జియో స్పేషియల్‌ కవరేజీ మ్యాప్లను వినియోగదారుల సౌకర్యం కోసం ఇవ్వాల్సి ఉంటుంది.

Also Read: China: చైనాలో వరదలు..గ్రీన్ హౌస్ వాయువులే కారణం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Stock Market: 5రోజుల లాభాల పరుగుల తర్వాత నెమ్మదించిన దేశీ స్టాక్ మార్కెట్లు

ఐదు రోజుల లాభాల పరుగులు కాస్త నెమ్మదించాయి. ఈరోజు స్టాక్ మార్కెట్లు అంత ఉత్సాహంగా కనిపించడం లేదు. సెన్సెక్స్ 250 పాయింట్లు పెరిగి 10 పాయింట్లు తగ్గి 79,650 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగి 24,200 స్థాయిలో ఉంది.

New Update

ఈరోజు స్టాక్ మార్కెట్లు మొదలవడం ఫ్లాట్ గా ఉన్నా..తరువాత కాస్త తేరుకున్నాయి. కానీ మరీ అంత దూకుడుగా ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాల నడుమ దేశీ సూచీలు నెమ్మదించాయి.  మదుపర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో సెన్సెక్స్ 250 పాయింట్లు పెరిగి 10 పాయింట్లు తగ్గి 79,650 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగి 24,200 స్థాయిలో ఉంది.

సెన్సెక్స్ స్టాక్‌లు 30లో.. 16 లాభాల్లో ఉన్నాయి. జొమాటో, కోటక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు 4% వరకు పెరిగాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 3.50% పడిపోయాయి. ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ మ, ఎయిర్‌టెల్ 1% వరకు క్షీణించాయి. ఇక నిఫ్టీ విషయానికి వస్తే.. 50 స్టాక్స్‌లో 46  లాభాల్లో ఉన్నాయి. NSE రంగాల సూచీలలో, FMCG, మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు వినియోగ వస్తువులు 1% పెరిగాయి. 

అమెరికా మార్కెట్ డౌన్..

సోమవారం అమెరికా మార్కెట్లు పతనమయ్యాయి. అలాగే ఆసియా మార్కెట్లు కూడా మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అమెరికాకు చెందిన డౌ జోన్స్ 972 పాయింట్లు, నాస్‌డాక్ కాంపోజిట్ 416 పాయింట్లు , ఎస్&పి 500 ఇండెక్స్ 125 పాయింట్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 24 పాయింట్లు తగ్గి 34,255 వద్ద ఉంది. కొరియాకు చెందిన కోస్పి 4 పాయింట్లు పెరిగి 2,493 వద్ద ట్రేడవుతోంది. చైనా షాంఘై కాంపోజిట్ 0.32% పెరిగి 3,302 వద్ద ట్రేడవుతోంది. హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 0.37% తగ్గి 21,316 వద్ద ట్రేడవుతోంది.

ఇక బంగారం ధరలకు  రెక్కలొచ్చాయి. తాజాగా 10 గ్రాముల మేలిమి పసిడి ధర పన్నులతో కలిపి ఏకంగా లక్ష రూపాయలకు చేరింది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిలో చేరుకోవడం ఇదే మొదటిసారి. అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ జరగడం, డాలర్‌ బలహీనపడటం వంటి కారణాల వల్ల మదుపర్లు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే అంచర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం సోమవారం 3,405 డాలర్లకు చేరింది.

today-latest-news-in-telugu | stock-market | sensex | nifty

Also Read: Trump Vs Harvard: ట్రంప్ ప్రభుత్వంపై హార్వర్డ్ దావా

Advertisment
Advertisment
Advertisment