RCB Vs SRH : నేడు ఉప్పల్ లో టఫ్ ఫైట్.. ప్రాక్టీస్ సెషన్లో మార్మోగిన కోహ్లీ నామస్మరణ!

New Update
RCB Vs SRH : నేడు ఉప్పల్ లో టఫ్ ఫైట్.. ప్రాక్టీస్ సెషన్లో మార్మోగిన కోహ్లీ నామస్మరణ!

IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్(IPL 17 Season) లో భాగంగా నేడు ఉప్పల్ వేదికగా బిగ్ మ్యాచ్ జరగనుంది. గురువారం ఏప్రిల్ 25న RCB Vs SRH తలపడనున్నాయి. ఈ సీజన్ లో దారుణంగా విఫలమైన బెంగళూర్ జట్టు 8 మ్యాచ్ ల్లో కేవలం 1 మాత్రమే గెలిచి అట్టడుగు స్థానంలో ఉంది. మరో వైపు SRH వరుస విజయాలతో దూసుకెళ్తోంది. దీంతో ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.

కోహ్లీ.. కోహ్లీ.. అంటూ నినాదాలు..
ఇదిలావుంటే.. నేడు జరగబోయే మ్యాచ్ లో భాగంగా హైదరాబాద్(Hyderabad) చేరుకున్నాయి ఇరుజట్లు. అయితే నిన్న సాయంత్రం ప్రాక్టీసులో భాగంగా స్టేడియానికి కోహ్లీ రాబోతున్న విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోహ్లీ వచ్చిన సమయంలో అభిమానులంతా కోహ్లీ.. కోహ్లీ.. అంటూ నినాదాలు చేయడంతో స్టేడియం చుట్టుపక్కలా కోహ్లీ నామస్మరణతో మార్మోగింది. కోహ్లీకి ఉప్పల్ స్టేడియంలో మంచి రికార్డ్ ఉండగా.. నేటి మ్యాచ్ లో భారీ స్కోర్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.

ఇది కూడా చదవండి: Dasari sahithi: ఎంపీగా పోటీ చేస్తున్న తెలుగు నటి.. నామినేషన్‌ దాఖలు!

భారీ బందోబస్తు ఏర్పాటు..
ఇక మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) ఆంక్షలు విధించారు. స్టేడియంలో 2500 మందితో పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం అర్థరాత్రి వరకూ ఆర్టీసీ, మెట్రో రైలు ప్రత్యేక సర్వీసులను నడపబోతున్నాయి. ఇక సీజన్ లో హైదరాబాద్ వేదికగా మరో 4 మ్యాచ్ లు జరగనున్నాయి. మే 2న హైదరాబాద్- రాజస్థాన్, మే 8న హైదరాబాద్- లక్నో, మే 16న హైదరాబాద్- గుజరాత్, మే 19న హైదరాబాద్- పంజాబ్ మధ్య జరగనున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment