Watch Video: పట్టపగలే నగల షాపులో చోరీ.. యజమానిని కత్తితో బెదిరించి

హైదరాబాద్‌లోని మెడ్చల్‌లో జగదాంబ జ్యూవెల్లరీ షాప్‌లో దొంగతనం జరిగింది. షాప్‌లోకి వచ్చిన ఇద్దరు దుండగులు బంగారం ఇవ్వాలంటూ యజమానిని కత్తితో బెదిరించారు. యజమాని వారినుంచి తప్పించుకోగా.. కొంత బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు.

New Update
Watch Video: పట్టపగలే నగల షాపులో చోరీ.. యజమానిని కత్తితో బెదిరించి

హైదరాబాద్‌లోని మెడ్చల్‌లో పట్టపగలే ఓ నగల దుకాణంలో దోపిడి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జగదాంబ జ్యూవెల్లరీ షాప్‌కు ఇద్దరు దుండగులు వచ్చారు. అందులో ఓ వ్యక్తి బుర్కా వేసుకొన్నాడు. బంగారం ఇవ్వాలంటూ యజమానిని కత్తితో బెదిరించాడు. ఆ యజమాని వారి నుంచి తప్పించుకొని బయటకు పారిపోయారు. దీంతో ఆ దుండగులు కొంత బంగారాన్ని ఎత్తుకెళ్లి.. బైక్‌పై పారిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also read: తక్షణమే నీట్ పరీక్ష రద్దు చేయాలి.. రాహుల్ గాంధీ డిమాండ్

Advertisment
Advertisment
తాజా కథనాలు