TGSRTC: ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఫోన్ పే, గూగుల్ పేతో టికెట్స్

TG: ప్రయాణికులకు RTC తీపి కబురు అందించింది. బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. తొలుత పైలెట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, బండ్లగూడ డిపోల్లో అమలు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.

New Update
City Buses : మహిళలకు సిటీ బస్ లో ఫ్రీ జర్నీ ఉంటుందా? ఉండదా?.. క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ!

Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబురు అందించింది. ఇకపై బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అందుబాటులోకి తేనుంది. తొలుత పైలెట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్, బండ్లగూడ డిపోల్లో ఇది అమలు అవుతోందన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. కొద్ది రోజుల్లోనే అన్ని డిపోల్లో అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఇందుకోసం 10వేల ఐ-టిమ్ మెషీన్లను తమ సిబ్బందికి ఆర్టీసీ అందించనుంది. దీని ద్వారా ప్రయాణికులు ఫోన్ తో QR కోడ్ స్కాన్ చేసి డబ్బు చెల్లించి టికెట్ పొందవచ్చు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో అటు కండక్టర్లకు, ఇటు ప్రయాణికులకు 'చిల్లర' కష్టాలు తప్పనున్నాయి.

ఇప్పటికే కొన్ని రూట్లలో గరుడ, రాజధాని, సిటీ బస్సుల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది ఆర్టీసీ సంస్థ. చిల్లర సమస్య, లావాదేవీలలో పారదర్శకత ఉంచేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ప్రెమెంట్స్ అమలు చేయడం వల్ల పేపర్, ప్రింటర్ వంటి వాటికీ అయ్యే ఖర్చులు కూడా కాస్త తగ్గుతుందని ఆర్టీసీ భావించింది. ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది.

మహిళలకు ప్రత్యేక కార్డు..

తెలంగాణలో కొలువుదీరిన రేవంత్ సర్కార్ ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కేవలం తెలంగాణ మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఆధార్ కార్డు ద్వారా జీరో టికెట్ ను మహిళలకు ఇస్తున్నారు. కాగా తాజాగా మహాలక్ష్మి పథకంపైన కూడా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు స్మార్ట్ కార్డు ను ఇవ్వనుంది. ఆధార్ కార్డుతో ఈ కార్డును అనుసంధానం చేయనున్నట్లు సమాచారం.

Also Read : RTV చెప్పిందే.. సీఎం రేవంత్ చెప్పారు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

మధ్యప్రదేశ్‌ లో ఓ వింత దొంగతనం జరిగింది. అప్పుల వాళ్ల బాధలు భరించలేక దొంగతనం చేశాడు ఓ వ్యక్తి.అంతేకాకుండా తనని క్షమించాలని,ఆరు నెలల్లో ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తానని,లేని పక్షంలో పోలీసులకు పట్టించవచ్చని నిందితుడు ఓ లేఖను కూడా ఉంచాడు.

New Update
money

money

అప్పుల వాళ్ల వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఓ బాధితుడు దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు.అంతటితో ఆగకుండా..తనను క్షమించాలని,డబ్బును ఆర్నెళ్లలో తిరిగి ఇచ్చేస్తానని టైప్‌ చేసి ఉంచిన లేఖను సైతం వదిలి వెళ్లడం గమనార్హం.మధ్యప్రదేశ్‌ లోని ఖర్గోన్‌ జిల్లాల్లో ఓ వింత వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Also Read: ఐదు విమానాల్లో అమెరికాకు ఐఫోన్లు.. ట్రంప్ సుంకాలకు అలా షాకిచ్చిన యాపిల్!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ...స్థానికంగా ఓ దుకాణంలో ఆదివారం అర్థరాత్రి దొంగతనం జరిగింది. నిందితుడు రూ.2.45 లక్షలు ఎత్తుకెళ్లాడు.ఈ విషయాన్ని గురించిన యజమాని...ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్లాడు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దుకాణంలో ఓ లేఖ దొరికింది.

Also Read: TRUMP Tariffs: టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ఈ దేశాలపై సుంకాలు రద్దు..!

తాను దొంగతనం చేయాలనుకోలేదని, కానీ ...వేరే మార్గం లేకపోయిందని నిందితుడు అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.నేను పొరుగు ప్రాంతంలోనే ఉంటాను. కొంతకాలంగా అప్పుల వాళ్ల వేధింపులు ఎక్కువ అయ్యాయి. రామనవమి రోజు చోరీకి పాల్పడినందుకు క్షమాపణలు.నేను దొంగతనం చేయాలనుకోలేదు.

కానీ వేరే మార్గం లేకపోయింది. అవసరమైనంత డబ్బే తీసుకున్నాను. ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను.లేని పక్షంలో పోలీసులకు పట్టించొచ్చు.కానీ ఇప్పుడు మాత్రం ఈ డబ్బు తీసుకుని వెళ్లడం నాకు చాలా ముఖ్యం అని ఆ లేఖలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దుకాణం యజమాని సైతం బ్యాగులో రూ. 2.84 లక్షలు భద్రపర్చగా..అందులో రూ.2.45 లక్షలు కనిపించడం లేదని చెప్పినట్ఉ తెలుస్తుంది.

నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Sharmila fires on YCP :  ప్రజలు చెప్పుతో కొట్టినా పద్ధతి మారలేదు.. వైసీపీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు!

Also Read: Trump's another shock : హెచ్ 1బీ, ఎఫ్1 వీసాదారులు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు ట్రంప్ మరో షాక్..! హెల్ప్ డెస్క్ సస్పెండ్

 note | madhya-pradesh | madhya pradesh news | apology | steals money | police | letter | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment