Tenth Exams: పది పరీక్షల మీద పది సార్లు దండయాత్ర..పాసవ్వడంతో బ్యాండు మేళంతో ఊరేగింపు!

పదో తరగతి పరీక్షలు పది సార్లు పాస్‌ అయ్యాడు ఓ యువకుడు..ఆ యువకుని విజయాన్ని ఊరంతా వేడుకలా నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. మరి పది పరీక్షల మీద ఇన్ని సార్లు దండయాత్ర చేసిన ఆ యువకుని గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి.

New Update
Tenth Exams: పది పరీక్షల మీద పది సార్లు దండయాత్ర..పాసవ్వడంతో బ్యాండు మేళంతో ఊరేగింపు!

Tenth Exams: సాధారణంగా పరీక్షలు రాయడం వాటిలో పాసవ్వడం, తప్పడం అనేది సహజం. పరీక్షల్లో ఒకసారి తప్పితే..మరోసారి రాసి పాస్‌ అవుతారు..ఒకసారి కాకపోతే రెండు సార్లు అది కాకపోతే మూడు సార్లు..ఆ తరువాత రాసే వారు కూడా దాని మీద ఆశలు వదిలేసుకుంటారు. కానీ ఇక్కడ ఓ విద్యార్థి మాత్రం ఏకంగా పదో తరగతి పరీక్షలు పదిసార్లు రాసి విజయం సాధించాడు. దీంతో ఆ గ్రామస్థులంతా అతడిని గ్రామం మొత్తం ఊరేగించి వేడుక నిర్వహించారు.

ఈ వేడుక కార్యక్రమం మహారాష్ట్రలోని బీడ్‌ గ్రామంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన కృష్ణ నామ్‌ దేవ్‌ ముండే అనే యువకుడు 2018 సంవత్సరం నుంచి పదవ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. ఈ ఆరు సంవత్సరాల కాలంలో అతను పది సార్లు పరీక్షలు రాశాడు. తాజాగా ఇప్పుడు పదో తరగతి పరీక్షలు పాస్‌ అయ్యాడు.

దీంతో గ్రామస్థులు అంతా అతడి విజయాన్ని ఓ వేడుకల నిర్వహించారు. ఊరంతా బ్యాండు మేళంతో ఊరేగిస్తూ...స్వీట్లు పంచిపెట్టారు.

Also read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 1202 ఖాళీలకు నోటిఫికేషన్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TMC MPs: టీఎంసీ MPల వాట్సాప్ చాట్, వీడియోలు లీక్.. అన్నీ బూతులే

వెస్ట్ బెంగాల్‌లో టీఎంసీ ఎంపీ మధ్య వివాదం చెలరేగింది. ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మరో ఎంపీని తిడుతున్న వీడియోలు, వాట్సాప్ స్క్రీన్ షార్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
Trinamool MP (1)

Trinamool MP (1)

వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మధ్య జరిగిన వాగ్వాదం వీడియోలు, చాట్‌లను బీజేపీ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కళ్యాణ్ బెనర్జీ మరొ ఎంపీతో గొడవ పెట్టుకున్నారు. ఇద్దరు ఎంపీలు తిట్టుకున్న వాట్సాప్ చాట్, వీడియోలు బీజేపీ నాయకుల కంటపడింది. దీంతో సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు వీటిని విసృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మరో ఎంపీపై బూతులతో రెచ్చిపోయారు. 

ఈ సమస్యను పరిష్కరించడానికి మమతా బెనర్జీ జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. AITC MP 2024 అనే వాట్సాప్ గ్రూప్ నుండి వచ్చిన స్క్రీన్‌షాట్‌ ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్ అవుతున్నాయి. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నడుచుకున్న ఎంపీని కళ్యాణ్ బెనర్జీ హెచ్చరిస్తున్నారు. ఈసీకి వెళ్లే ముందు మెమోరాండంపై సంతకం చేయడానికి పార్లమెంట్ కార్యాలయంలో సమావేశమవ్వాలని పార్టీ తన ఎంపీలను ఆదేశించినట్లు కనిపిస్తోంది. మెమోరాండం తీసుకెళ్లిన ఎంపీ పార్లమెంటు సమావేశానికి రాకుండా నేరుగా ఈసీకి వెళ్లారు. దీని కారణంగా ఇద్దరు ఎంపీల మధ్య వివాదం చెలరేగింది. వీడియోలో కళ్యాణ్ బెనర్జీ ఇతర శాసనసభ్యుడిని దూషిస్తున్నాడు.

Advertisment
Advertisment