Bandi Sanjay : ఇస్తే తీసుకుంటా...అధ్యక్ష పదవిపై బండి సంజయ్ హాట్ కామెంట్స్!

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. తాను బీజేపీ అధ్యక్ష రేసులో లేనన్నారు. ఇస్తే వద్దనని స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నానని తెలిపారు.  

New Update

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. తాను బీజేపీ అధ్యక్ష రేసులో లేనన్నారు. ఇస్తే వద్దనని స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నానని తెలిపారు.  కొంత మంది వ్యక్తులు అధ్యక్షులం  అవుతున్నామని ప్రచారం చేసుకుంటున్నారని..  ఇలా ప్రచారం చేసుకోవడం పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకమని సంజయ్ చెప్పుకొచ్చారు. అలా ప్రచారం చేసుకుని  కార్యకర్తలను కన్య్ఫూజ్ చేయవద్దన్నారు.  పార్టీ పెద్దలు అధ్యక్షుడ్ని నిర్ణయిస్తారని..తాను కేంద్ర సహాయమంత్రిగా ఉన్నానని బండి సంజయ్ తెలిపారు.  అధ్యక్ష పదవిపై కేంద్ర నాయకత్వం చాలా సీరియస్‌‌గా ఉందని అన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అంతా కట్టుబడి ఉండాలని నాయకులు, కార్యకర్తలకు సంజయ్ పిలునిచ్చారు.

Also read :  తెలంగాణలో భారీ వర్షాలు.. మరో రెండు రోజులూ ఇదే పరిస్థితి..!

Also read :  దువ్వాడ శ్రీనివాస్‌కు ‘డాక్టరేట్’.. ఎందుకో తెలుసా?

ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

ఇదిలా వుంటే  బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధ్యక్షుడిని స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తే రబ్బర్ స్టాంప్‌గా ఉంటాడని..  సెంట్రల్ కమిటీ అధ్యక్షుడిని డిసైడ్ చేస్తే బాగుంటుందన్నారు రాజాసింగ్.  గతంలో ఎవరు అధ్యక్షుడు అయితే వారు గ్రూప్ తయారు చేసుకొని పార్టీకి నష్టం చేశారంటూ రాజాసింగ్ ఆరోపించారు.  గతంలో బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన వారు కార్యకర్తల్ని, సీనియర్ నాయకులను తొక్కేశారంటూ రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు.  బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనవారు  సీక్రెట్ మీటింగులు, ముఖ్యమంత్రితో బ్యాక్ డోర్ మీటింగులు పెట్టకూడదంటూ సూచించారు. రాజాసింగ్ చేసిన ఈ కామెంట్స్  ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.  

Also read : మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?

Also read :  పార్టీ మార్పుపై నా ఆలోచన ఇదే.. సీఎం రేవంత్ తో భేటీపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

#hyderabad #telangana-bjp #bjp-state-president #Bandi Sanjay
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి...

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment