/rtv/media/media_files/2025/04/04/3Qc9uYkSD3DeW3dvDwah.jpg)
TSBIE Telangana Board Academic Calendar 2025-26 OUT
తెలంగాణ ఇంటర్ బోర్డు (Telangana Inter Board) తాజాగా రాష్ట్రంలో జూనియర్ కాలేజీల 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ బోర్డు క్యాలెండర్ను రిలీజ్ చేసింది. అందులో కాలేజీ పనిదినాలు, తరగతులు, సెలవులు(Inter Holidays), ఎగ్జామ్స్ షెడ్యూల్ను వెల్లడించింది. ఇందులో భాగంగానే గురువారం ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య కొత్త అకడమిక్ క్యాలెండర్ను (New academic calendar) రిలీజ్ చేశారు.
Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?
ఈ ఏడాది జూన్ 2 నుంచి ఇంటర్ కళాశాళలు మొదలు అవుతాయని ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. అప్పటి వరకు సమ్మర్ హాలిడేస్ అని తెలిపారు. అందువల్ల ఏవైనా కాలేజీలు ఈ వేసవి సెలవుల్లో క్లాస్లు నిర్వహింస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్ బోర్డు ఆదేశాలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు వర్తిస్తాయని తెలిపారు.
Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
ఇందులో భాగంగానే ఈ సారి ఇంటర్ తరగతులు మొత్తం 226 రోజుల పాటు ఉండనున్నాయి. అంతేకాకుండా జూనియర్ కళాశాళలకు 77 రోజులు సెలవులు రానున్నాయి. 2026 ఫిబ్రవరిలో ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. మార్చి నెలలో పబ్లిక్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం..
దసరా సెలవులు: 2025 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు కాలేజీలకు సెలవులు.
ఆఫ్ ఇయర్ ఎగ్జామ్స్ : 2025 నవంబర్ 10 నుంచి 15 వరకు ఇంటర్ ఆఫ్ ఇయర్ పరీక్షలు
సంక్రాంతి సెలవులు: 2026 జనవరి 11 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు.
ప్రాక్టికల్స్: 2026 ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి.
ఫైనల్ పరీక్షలు: 2026 మార్చిలో ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగుతాయి.
Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా
వేసవి సెలవులు: 2026 ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు సమ్మర్ హాలీడేస్ ఉంటాయి.
తరగతులు ప్రారంభం: 2026 జూన్ 1 నుంచి ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం తరగతులు మళ్లీ పున:ప్రారంభం అవుతాయి.
(telangana-inter-board latest-telugu-news)
KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు
BRS meeting
KTR : తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు..రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసంబద్ధ హామీల వలన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడినట్టు పేర్కొన్నారు. ‘‘ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
కాంగ్రెస్ ను తిరస్కరించండి
‘ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. GHMCతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను తిరస్కరించండి’’ అంటూ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డీయే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’ అని అన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్ ప్రశంసించారు. ‘‘డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారన్నారు.
Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..
నలుగురికి భరోసానిచ్చేది బీఆర్ఎస్
ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉంది అది భారత రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు.సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ ఘనత సాధించిన పార్టీగా మనకు గర్వం’’ అని కేటీఆర్ తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.
Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్
Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య
DC vs MI: ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యం.. మంబయి స్కోర్ ఎంతంటే ?
AB Venkateswara Rao : జగన్ అంటే హత్యలు, అవినీతి, అరాచకం...మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం
Sheikh Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. మరోసారి అరెస్టు వారెట్ జారీ