TG Weather:  తెలంగాణలో భారీ వర్షం.. ఈదురు గాలులతో హైదరాబాద్‌ అతలాకుతలం

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, ఫిల్మ్‌నగర్, హైటెక్‌ సిటీ, కొండాపూర్, లింగంపల్లి, మియాపూర్, మదీనా గూడ, చందానగర్‌ తదితర ప్రాంతాల్లో ఉరుముల, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.

New Update

TG Weather: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణ మారిపోయింది. వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగర్‌ ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం కలిగింది. హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, ఫిల్మ్‌నగర్, హైటెక్‌ సిటీ, కొండాపూర్, లింగంపల్లి, మియాపూర్, మదీనా గూడ, చందానగర్‌ తదితర ప్రాంతాల్లో ఉరుముల, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.  హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది.  జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో వర్షం పడుతోంది.

జాగ్రత్తగా ఉండాలి:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అకాల వర్షాలు పడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అధికారులు ప్రజలను అలెర్ట్ చేసింది. రాబోయే రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తోపాటు, ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి:  పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఇస్తే జరిగేది ఇదే

కొన్ని సంగారెడ్డి, నారాయణఖేడ్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం, మరి కొన్ని జిల్లాలో వడగళ్ల వర్షం పడింది.  భారీ వర్షంతో తెలంగాణలో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వర్షం కారణంగా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. అవసరం అయితేనే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నదున 2,3  రోజులు రైతులు పొలం పనులకు వెళ్లొద్దని చెప్పారు. జీహెచ్ఎంసీలో లోతట్టు ప్రాంతాల ప్రజలు  ఇంట్లో నుంచి బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. కరెంట్ పోల్స్‌కు దూరంగా ఉండాలంటున్నారు.

ఇది కూడా చదవండి: కాల్చిన అవిసె గింజలతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

( ts-weather | ts-weather-update | latest-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లో షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.

author-image
By B Aravind
New Update
Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హై అలెర్ట్ నెలకొంది. భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై  పోలీసులు నిఘా పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. వాళ్లని షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.    

Also Read: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

Hyderabad Police Sent Notices To Pakistani Nationals

మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్‌లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇందులో 209 మందికి లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నాయి. మిగతా నలుగురికి షార్ట్‌ టర్మ్‌ వీసాలు ఉన్నాయి. ఈ నలుగురి పైనే పోలీసులు నిఘా పెట్టారు. రేపటిలోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.  

ఇదిలాఉండగా.. దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు.  దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. 

Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!

మరోవైపు హైదరాబాద్ పోలీసులు గురువారం ఓ పాక్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు గతంలో హైదరాబాద్కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. దీంతో మహమ్మద్ ఫయాజ్ను గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ పాక్ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.  

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

Also Read :  పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

telugu-news | rtv-news | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment