Telangana: కొత్త రేషన్‌ కార్డులు పై మరో కీలక ప్రకటన.. వారి కోసం ఇవాళ్టి నుంచి ధరఖాస్తులు

తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు కోసం మరో అవకాశం కల్పించింది. కొత్త కార్డుల జాబితాలో పేర్లు రానివారు నేటి నుంచి 24 వరకు గ్రామసభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అఫ్లికేషన్లు పరిశీలించి అర్హులైన వారికి కార్డులు మంజూరు చేస్తామని వెల్లడించింది.

New Update

Telangana: తెలంగాణ సర్కారు ఈనెల 26న నాలుగు పథకాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది.  ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా పథకాలకు అర్హులైన లబ్ధిదారుల కోసం ఎంపిక జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అధికారులు కొత్త రేషన్ కార్డు అర్హుల జాబితాను రూపొందించారు. అయితే ఈ జాబితాలో అర్హులైన చాలా మంది పేర్లు లేవని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కార్డుకు కావాల్సిన అర్హతలు అన్నీ ఉన్నప్పటికీ.. తమ పేర్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Kiran Abbavaram: తండ్రి కాబోతున్న మరో టాలీవుడ్ హీరో.. సోషల్ మీడియాలో పోస్ట్ !

కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు.. 

ఈ మేరకు సంబంధిత మంత్రి శాఖ కీలక ప్రకటన చేసింది. లిస్టులో పేర్లు లేకపోయినా ఆందోళ చెందాల్సిన అవసరం లేదని. పేర్లు లేని వారి కోసం మళ్ళీ దరఖాస్తు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. నేటి నుంచి ఈనెల 24 వరకు జాబితాలో పేర్లు రానివారు  ప్రజావాణి, గ్రామసభల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కొత్త కార్డులతో పాటు కార్డుల్లో మార్పుల కోసం దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు కోసం ప్రభుత్వం రూపొందించిన ధరఖాస్తు ప్రతాన్ని ఫిల్ చేసి గ్రామసభల్లో అందజేయాలి. కుటుంబ పెద్ద, ఇతర సభ్యుల ఆధార్‌ కార్డుల వివరాలు, అడ్రస్, ఫోన్ నంబర్, కులానికి సంబంధించిన వివరాలు అందులో నమోదు చేయాలని సూచించారు. అప్లికేషన్లను పరిశీలించి అర్హులకు  రేషన్‌ కార్డులను అందించనున్నట్లు వెల్లడించారు. 

ఈ సందర్భంగా పీఎస్ శాంతి కుమారి కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 11,65,052 సంబంధించిన 6,68,309 కార్డుల సమాచారాన్ని సిద్ధం చేసినట్లు తెలిపారు. మరో 1.36 కోట్ల జనాలకు సంబంధించిన 41.25 లక్షల కార్డుల సమాచారాన్ని అవసరం మేరకు తెలియజేస్తామని వెల్లడించారు. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Big Breaking : కాళేశ్వరం ఈఎన్‌సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ రైడ్స్

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్‌‌సీ‌గా ఉన్న హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి  సోదాలు సాగుతున్నాయి. ఈ మేరకు షేక్‌పేట్‌లోని ఆదిత్య టవర్స్‌ లో ఉన్న హరిరామ్ నివాసంతో పాటు మొత్తం 14 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.

New Update
Kaleshwaram ENC Hariram

Kaleshwaram ENC Hariram

Big Breaking : గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నికల సమయంలో  దెబ్బతింది. దీనిపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దానికోసం ప్రత్యేక కమిషన్‌ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలువురిని విచారించి కమిషన్‌ మరికొంతమంది విచారణకు సిద్ధమైంది. ఈ తరుణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.  కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్‌‌సీ‌గా ఉన్న హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.ఇవాళ తెల్లవారుజాము నుంచి  సోదాలు సాగుతున్నాయి.

Also Read: New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అధికారులు మెరుపు దాడులకు దిగారు. ఈ మేరకు షేక్‌పేట్‌లోని ఆదిత్య టవర్స్‌ లో ఉన్న హరిరామ్ నివాసంతో పాటు మొత్తం 14 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా, గజ్వేల్  ప్రాంత ఈఎన్సీగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాళేశ్వరం అనుమతులు, డిజైన్లు, రుణాల సమీకరణలోనూ ఆయన అత్యంత కీలకంగా వ్యహరించినట్లు అధికారులు గుర్తించారు. హరిరామ్ భార్య అనిత కూడా నీటి పారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్‌సీగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె వాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. సోదాల్లో భాగంగా హరిరామ్ పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. గజ్వేల్‌లో 30 ఎకరాల భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 3 బ్యాంక్ లాకర్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.

Also Read :  మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!

కాళేశ్వరం ప్రాజెక్టు  నిర్మాణంలో లోపాల మూలంగానే కుంగిపోయిందన్న కారణంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ 27న జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. కాగా గజ్వేల్ ఈఎన్సీ, కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉన్న హరిరామ్‌ను ఈ కేసులో భాగంగా విచారించింది.ప్రాజెక్టు నిర్మాణ బిల్లుల చెల్లింపులకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక అంశాలపై సైతం కమిషన్ ఆరా తీసింది. కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు రూ.29,737 కోట్లు వరకు తిరిగి చెల్లించినట్లుగా ఆయన విచారణలో తెలిపారు.

Also Read: BIG BREAKING: కశ్మీర్ సమస్యపై స్పందించిన ట్రంప్

 బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో రూ.64 వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించామని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లను ఇప్పటికే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అందజేశామని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ డామేజ్‌కు బాధ్యులెవరంటూ చంద్రఘోష్ కమిషన్‌.. హరిరామ్‌ను ప్రశ్నించగా గేట్స్ ఆపరేషన్, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం అందుకు ప్రధాన కారణమని తెలిపారు. 2017లో నాటి ఉన్నత స్థాయి కమిటీ అంశాలను కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్ ఫాలో కాలేదని హరిరామ్ కమిషన్ ఎదుట స్పష్టం చేశారు. కాగా ఇప్పుడు ఆయన ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది.

Also Read: BIG BREAKING: పాక్ కి భారీ షాక్‌..10 మంది సైనికులు హతం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు