ఎంత పని చేశావమ్మా.. కన్న కూతురిని గొంతు నలిపి చంపిన కసాయి తల్లి

పెద్దపల్లి జిల్లా టీచర్స్ కాలనీలో విషాద ఘటన జరిగింది. మూడేళ్ల పాపను కన్న తల్లి సాహితీ గొంతు నలిపి చంపి ఆ తర్వాత సాహితీ ఫ్యానుకు ఊరి వేసుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో సాహితీ ఈ దారుణానికి ఒడిగట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల పాప వితన్య రెడ్డిని కన్న తల్లి సాహితీ గొంతు నలిపి చంపింది. అనంతరం సాహితీ ఫ్యానుకు ఊరి వేసుకుంది. అయితే భర్త ఇంట్లో లేని సమయంలో సాహితీ ఈ దారుణానికి ఒడిగట్టింది. సాహితీ భర్త LICలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

ప్రియుడి కోసం భర్తను..

ఇదిలా ఉండగా ఇటీవల పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తలను చంపుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ప్రియుడితో కలిసి  కట్టుకున్న భర్తను భార్య కిరాతకంగా చంపిన ఘటన మరువకముందే.. ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం రాయ్‌బరేలీలో స్థానికంగా ఉండే ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. 

ఇది కూడా చూడండి:  Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

ఇందుకోసం వారు ఓ తుపాకీని కూడా వాడారు.  అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ఓ పొలంలో పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.  అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు..   దర్యాప్తులో భార్య, ఆమె ప్రియుడు నిందితులని తెలుసుకుని అరెస్టు చేశారు. ఈ కేసును పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు.  

ఇది కూడా చూడండి: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

ఇటీవల పొలం పనుల కోసమని వెళ్లిన రూబీ ఎంతకు తిరిగి రాకపోవడంతో మనీష్ అనుమానంతో వెళ్లి చూడగా అక్కడ రూబీ, సునీల్‌లు అభ్యంతరకరమైన స్థితిలో కనిపించారు. దీంతో అక్కడే రూబీ,మనీష్ ల మధ్య గొడవ మొదలైంది. దీంతో తన వెంట తెచ్చుకున్న పిస్టల్‌తో సునీల్.. మనీష్ ను కాల్చి చంపేశాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలకు అధికారులు 3 నెలల బ్రేక్‌ ఇచ్చినట్లు అధికారులు ప్రకటించారు. డేంజర్‌ జోన్‌ మినహా శిథిలాల తొలగింపు పూర్తి అవ్వడంతో తాజాగా ఎక్స్‌కవేటర్లు సొరంగం నుండి బయటకు వచ్చేశాయి. ఇంకా ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు.

New Update
slbc

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలకు అధికారులు 3 నెలల బ్రేక్‌ ఇచ్చినట్లు అధికారులు ప్రకటించారు. డేంజర్‌ జోన్‌ మినహా శిథిలాల తొలగింపు పూర్తి అవ్వడంతో తాజాగా ఎక్స్‌కవేటర్లు సొరంగం నుండి బయటకు వచ్చేశాయి. ఇంకా ఆరుగురు కార్మికుల ఆచూకీ లభించలేదు. 63 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టినప్పటికీ ఇంత వరకు రెండు మృతదేహాలు మాత్రమే దొరికాయి. ఫిబ్రవరి 22న సొరంగంలో ప్రమాదం జరగగా, 8 మంది అందులో చిక్కుకున్నారు.

Also Read:Sourav Ganguly : పాకిస్తాన్‌తో సంబంధాలను తెంచుకోవాలి..  సౌరవ్ గంగూలీ సంచలన కామెంట్స్!

కాలువ లోపల రెస్క్యూ ఆపరేషన్ల పై నిపుణుల కమిటీ, SLBC టన్నెల్ డేంజర్ జోన్‌లో రెస్క్యూ ఆపరేషన్లు, భవిష్యత్ పనులకు ఇన్లెట్ ప్రాంతం ద్వారా సాంప్రదాయ డ్రిల్, బ్లాస్ట్ పద్ధతి తప్ప వేరే మార్గం లేదని భావిస్తున్నట్లు తెలిపింది.

గురువారం జలసౌధలో జరిగిన అధికారులు, కమిటీ సభ్యుల సమావేశంలో.. సొరంగం 50 మీటర్ల ప్రమాద ప్రాంతంలో రాళ్ల పొరలు, నీరు , ఇతర అంశాల వల్ల సొరంగం మళ్లీ కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అనుకుంటున్నారు. దీంతో ఇక్కడ సహాయక చర్యలు మరింత ప్రమాదకరంగా మారాయి.

Also Read: Pak Terror attack: సింధూ బంద్‌తో పాక్ పతనం.. ఇకపై వస్తే వరదలు లేదంటే కరువులు

పర్యావరణ నిబంధనలను పరిశీలించి సిఫార్సులు చేయడానికి అధికారులు ఒక సాంకేతిక ఉపసంఘాన్ని ప్రభుత్వ ఏర్పాటు చేసింది. అనేక జాతీయ సంస్థలతో పాటు, కల్నల్ పరీక్షిత్ మెహ్రా కూడా ఇందులో ఉన్నారు. ప్రస్తుత ప్రమాదం నేపథ్యంలో, తవ్వకానికి ప్రత్యామ్నాయ చర్యలపై సూచనలు అందించే బాధ్యతను దీనికి అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

Also Read:Pak Terror attack: సింధూ బంద్‌తో పాక్ పతనం.. ఇకపై వస్తే వరదలు లేదంటే కరువులు

Also Read: BIG BREAKING: పాకిస్తాన్ కు మరో బిగ్ షాక్.. తగలబడుతోన్న లాహోర్ ఎయిర్పోర్ట్

slbc | tunnel | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment