చార్మినార్ ను కూడా కూలుస్తారా?: హైడ్రా చీఫ్ పై హైకోర్టు ఫైర్!

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం ఎందుకు కూల్చారని ప్రశ్నించింది. వద్దని ఆదేశాలిచ్చినా పట్టించుకోరా అంటూ మండిపడింది. 48 గంటల్లోగా ఖాళీ చేయాలని ముందే ఎలా కూలుస్తారని నిలదీసింది.చార్మినార్‌ను కూడా కూలుస్తారా అంటూ సీరియస్ అయ్యింది.

New Update
High Court 2

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం ఎందుకు కూల్చారని ప్రశ్నించింది. వద్దని ఆదేశాలిచ్చినా పట్టించుకోరా అంటూ మండిపడింది. కూల్చివేయాలని కలెక్టర్ ఎందుకు చెప్పారు.. 48 గంటల్లోగా ఖాళీ చేయాలని ముందే ఎలా కూలుస్తారని నిలదీసింది. కూల్చడమే హైడ్రా పాలసీనా అంటూ ఘాటుగా స్పందించింది. హైడ్రాపై వర్చువల్‌గా హైకోర్టులో విచారణ జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ వర్చువల్‌గా హాజరుకాగా.. అమీన్‌పూర్ తహశీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. '' శని, ఆదివారాల్లో సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారు. సెలవు దినాల్లో నోటీసులు ఇచ్చి.. ఎందుకు అత్యవసరంగా కూల్చాల్సి వస్తోంది. శని, ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయి. తహశీల్దార్‌కు ఆ విషయం కూడా తెలియదా. 

Also Read: స్కూల్ బస్సు కింద పడి నర్సరీ విద్యార్థి దుర్మరణం

చార్మినార్‌ను కూడా కూలుస్తారా ?

ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా ఇల్లు కూల్చివేయాల్సిన అవసరం ఏముంది. ఈ కేసుపై హైకోర్టు గతంలో స్టే ఇచ్చినట్లు తెలియదా ?. చట్టప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకు వెళ్లొద్దు. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా ?.చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇదే విధంగా ఇబ్బందులకు గురిచేస్తారా ?'' అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆదివారం నిర్మాణాలు కూల్చివేయొచ్చా అని హైడ్రా కమిషనర్‌ను ప్రశ్నించింది. అక్రమ కూల్చివేతలకు యంత్రాలు, సిబ్బంది ఇవ్వాలని కోరడంతో అందించామని రంగనాథ్‌ తెలిపారు. చార్మినార్ కూల్చివేతకు తహశీల్దార్ యంత్రాలు, సిబ్బంది అడిగితే ఇస్తావా అంటూ హైకోర్టు సీరియస్ అయ్యింది. హైడ్రా ఇలాగే ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుందని పేర్కొంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Accident: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి

హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో మంగళవారం దారుణం జరిగింది. ఓ మహిళపై ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. బషీర్‌బాగ్ నుంచి అబిడ్స్‌ వైపు తన కూతురుతో కలిసి స్కూటీపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

New Update
Accident

Accident

హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో మంగళవారం దారుణం జరిగింది. ఓ మహిళపై ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ బషీర్‌బాగ్ నుంచి అబిడ్స్‌ వైపు తన కూతురుతో కలిసి స్కూటీపై వెళ్తోంది. అయితే గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్‌ ఎదుటు స్కూటీ అదుపుతప్పడంతో ఇద్దరు కింద పడ్డారు. ఆ మహిళ తలపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

ఇటీవలే హైదరాబాద్‌లోని ఇలాంటి ఘటనే జరిగింది. బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు కింద పడి బైక్‌ ఓ వాహనాదారుడు మృతి చెందాడు. ఈనెల 13వ తేదీన ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో భాగంగా బైక్‌ను ఆపేందుకు యత్నించారు. అయితే బైక్ అదుపు తప్పింది. దీంతో వాహనాదారుడు కిందపడ్డాడు. ఇదే సమయంలో వచ్చిన ఒక్కసారిగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతడి తలపై నుంచి వెళ్లింది. 

Also Read: జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో 27మంది మృతి!

దీంతో ఆ బైక్ వాహనాదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆ వ్యక్తి మృతి చెందాడని వాహనాదారులు ఆందోళనకు దిగారు. దీంతో జీడిమెట్ల నుంచి బాలానగర్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై పలువురు వాగ్వాదానికి దిగారు. చివరికి పోలీసులు వాళ్లని చెదరగొట్టారు. ఆ తర్వాత ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.  

Also Read: మీరేం మగాళ్లు రా.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి కాల్పులు!

 rtc-bus | telugu-news | telangana | hyderabad 

Advertisment
Advertisment
Advertisment