TG Govt: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!

రైతు భరోసాపై లిమిట్ పెట్టాలని తెలంగాణకి కేబినేట్ సబ్ కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో పాటు గ్రూప్-1 ఆఫీసర్లకు రైతు భరోసా ఇవ్వకూడదని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.

New Update
farmers-RTV

గత ప్రభుత్వం బీఆర్‌ఎస్ రైతు భరోసా పథకానికి లిమిట్ పెట్టలేదు. కానీ ఇకపై రైతు భరోసాపై లిమిట్ పెట్టాలని కేబినేట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. దీంతో రేవంత్ సర్కార్ లిమిట్ పెట్టాలని చూస్తోంది. కొందరు 5 ఎకరాలు లేదా 7 ఎకరాల వరకు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు రేవంత్ సర్కార్ భావిస్తోంది.

ఇది కూడా చూడండి:  పవన్, పుష్ప భేటీకి డేట్ ఫిక్స్.. మెగా వివాదానికి ఫుల్ స్టాప్!

90 శాతానికి పైగా వీరే..

రాష్ట్రంలో ఉన్న భూములను పరిశీలిస్తే 5 ఎకరాల వరకు ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. 90 శాతానికి పైగా వీరే ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రైతు భరోసా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో పాటు గ్రూప్-1 ఆఫీసర్లకు ఇవ్వాల్సిన అవసరం లేదని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది.

ఇది కూడా చూడండి:  తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత

మొత్తం అన్ని భూములకు ఎకరాకు రూ.7500 ఇచ్చిన దాదాపుగా ఈ సీజన్‌కు రూ.10 వేల కోట్లు ఖర్చు అవుతాయి. అదే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఇన్‌కమ్ ట్యాక్సపేయర్స్‌కు ఇవ్వకపోతే ఈ మొత్తంలో కొంత తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా దాదాపుగా రూ.15 లక్షల ఎకరాల భూములకు రైతు భరోసా ఇవ్వక్కర్లేదు. దీనివల్ల కొంత నష్టం ఉండదని భావిస్తోంది.

ఇది కూడా చూడండి: భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు

ఇలా చేయడం వల్ల దాదాపుగా రూ.1500 కోట్ల వరకు ఖర్చు తగ్గుతుందని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఎంత రైతు భరోసా? ఎవరెవరికి ఇవ్వాలి? ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే? పూర్తి విధివిధానాలను త్వరలో ప్రకటించనున్నారు. అయితే సంక్రాంతి తర్వాత రైతుల అకౌంట్లోకి రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన సంగతి తెలిసిందే. 

ఇది కూడా చూడండి:  'బిగ్ బాస్ సీజన్ 8' టైటిల్ విన్నర్ గా నిఖిల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు

New Update
BRS meeting

BRS meeting

KTR : తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు..రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసంబద్ధ హామీల వలన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడినట్టు పేర్కొన్నారు. ‘‘ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

 కాంగ్రెస్ ను తిరస్కరించండి


‘ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. GHMCతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించండి’’ అంటూ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డీయే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’ అని అన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్ ప్రశంసించారు. ‘‘డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారన్నారు.

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

 నలుగురికి భరోసానిచ్చేది బీఆర్ఎస్


ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉంది అది భారత రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు.సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ ఘనత సాధించిన పార్టీగా మనకు గర్వం’’ అని కేటీఆర్ తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

Advertisment
Advertisment
Advertisment