Vijayashanthi: రేవంత్కు ఊహించని షాకిచ్చిన విజయశాంతి.. కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?

సీఎం రేవంత్, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు సంబంధం లేకుండా హైకమాండ్ కోటాలో విజయశాంతి ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకున్నారు. దీంతో ఈ అంశం కాంగ్రెస్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. హైకమాండ్ తో ఆమె టచ్ లో ఉన్నారన్న ప్రచారం మొదలైంది.

New Update

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ నుంచి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్‌ నామినేషన్లను దాఖలు చేశారు. మొత్తం ఐదు స్థానాలకు ఐదుగురు నామినేషన్లను దాఖలు చేయడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత రిటర్నింగ్ అధికారి వీరి ఎన్నికపై ప్రకటన చేయనున్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ పదవి కోసం అనేక మంది నేతలు పోటీ పడ్డారు. అద్దంకి దయాకర్, వీహెచ్, వేం నరేందర్ రెడ్డి, సంపత్ కుమార్, కుసుమ కుమార్, సామ రామ్మోహన్ రెడ్డి, జగ్గారెడ్డి, శంకర్ నాయక్ తదితర అనేక మంది నేతల పేర్లు వినిపించాయి. అయితే.. అద్దంకితో పాటు శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఫైనల్ చేసింది హైకమాండ్.

శంకర్ నాయక్ కు ఎస్టీ కోటాతో పాటు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు ఉండడం కలిసి వచ్చింది. విజయశాంతి ఢిల్లీ వెళ్లి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరిగినా.. ఆ విషయాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కాంగ్రెస్ రాష్ట్ర నేతలు కూడా ఆమె పేరు ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ లో ఉంటుందని అస్సలు అంచనా వేయలేదు. కానీ అనూహ్యంగా విజయశాంతి పేరు ఫైనల్ లిస్ట్ లో ఉండడంతో అంతా షాక్ కు గురయ్యారు. AICC కోటాలో విజయశాంతికి ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కింది. టీపీసీసీ, సీఎంతో సంబంధం లేకుండా హైకమాండ్ నేరుగా విజయశాంతి పేరును ప్రకటించిందన్న ప్రచారం సాగుతోంది.

గతంలో ఇచ్చిన హామీ మేరకే..?

గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రాములమ్మకు ఎమ్మెల్సీ సీటు కేటాయించినట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ గా విజయశాంతి వ్యవహరించారు. ఎన్నికల తర్వాత చాలా రోజులుగా ఆమె మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సోషల్ మీడియాలో పలు పోస్టులతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్సీ సీటు రావడంతో రాములమ్మపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. నేరుగా అధిష్టానంతో రాములమ్మ టచ్ లో ఉందన్న ప్రచారం మొదలైంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment