cabinet meeting : మార్చి 6న తెలంగాణ మంత్రివర్గ సమావేశం

పలు కీలక అంశాలపై చర్చించేందుకు మార్చి6న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నది. రెండో దఫా గణాంకాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.

New Update
Telangana cabinet meeting

Telangana cabinet meeting

పలు కీలక అంశాలపై చర్చించేందుకు మార్చి 6న తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నది. ముఖ్యంగా సర్వేలో పాల్గొనని వారికోసం రాష్ట్రంలో నిర్వహించిన రెండో దఫా కులగణన నేపథ్యంలో దానికి సంబంధించిన గణాంకాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. అలాగే బీసీ కులగణన అధారంగా రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుకోనుంది. పార్లమెంట్ లో 42శాతం బీసీ రిజర్వేషన్ ల బిల్లు ఆమోదం పై క్యాబినెట్ లో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Also read :   TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు.. నిరుద్యోగ యువతకు చైర్మెన్ అదిరిపోయే శుభవార్త!

 ఈ మేరకు మార్చి7,8 తేదీల్లో ఈ అంశాలపై ఆమోదం తెలిపేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేఫథ్యంలో ఈ అంశాలపై కూడా మంత్రిమండలి చర్చించే అవకాశం ఉన్నది. అలాగే రాష్ట్రంలో ఏన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి కొత్త రేషన్ కార్డుల  పంపిణీ చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎమ్మె్ల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పలు జిల్లాల్లో ఈ విషయంలో తర్జనభర్జన జరుగుతున్నది.

Also read :  పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. అయిదుగురు మృతి

మార్చి 3తో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియనున్నది. దీంతో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై కేబినెట్ లో చర్చించే ఆస్కారం ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. శాసన సభ సమావేశాల అనంతరం 9న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీలు ఢిల్లీ వెళ్లనున్నారు. 10 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో బీసీ బిల్లు ఆమోదం పొందేలా కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇది కూడా చూడండి:  హైదరాబాద్‌కు AICC ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. ముందున్న సవాళ్లు ఇవే..! 

ఇది కూడా చూడండి:Kiara Advani : గుడ్‌ న్యూస్‌ చెప్పిన కియారా అద్వానీ .. తల్లి కాబోతున్నట్లు ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BRS Silver Jubilee Meeting: గులాబీల జెండా పట్టి మల్లేశో.. BRS సభ కోసం రసమయి అదిరిపోయే పాట.. మీరూ వినండి!

బీఆర్‌ఎస్‌ పార్టీ సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమవుతోంది. వరంగల్‌ జిల్లాలోని ఎల్కతుర్తి సమీపంలో ఈ నెల 27న పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని తలపెట్టింది. దీనికోసం రసమయి బాలకిషన్ అద్భుతమైన పాట రాసి పాడారు. ఇప్పుడు అ పాట  షోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

New Update
BRS Silver Jubilee

BRS Silver Jubilee

BRS Silver Jubilee : బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్టీ సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమవుతోంది. వరంగల్‌ జిల్లాలోని ఎల్కతుర్తి సమీపంలో ఈ నెల 27న పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని తలపెట్టింది. దీనికోసం రసమయి బాలకిషన్ అద్భుతమైన పాట రాసి పాడారు. ఇప్పుడు అ పాట  షోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Also Read: Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

కాగా బీఆర్ఎస్ సభ కోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహాక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో వైపు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆయా జిల్లాల నేతలతో సమావేశమై ఉత్సవాలపై దిశానిర్ధేశం చేశారు. లక్షమందికి మించకుండా సభ నిర్వహించాలని బీఆర్ఎస్‌ భావిస్తోంది. పదేండ్ల తర్వాత అధికారం కోల్పొయిన బీఆర్‌ఎస్‌ ప్రతిపక్ష పార్టీగా నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో ఈ సభను పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. 

Also Read: Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. బాల్కనీ నుంచి నుంచి దూకిన పిల్లలు, మహిళలు

రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ 15 నెలల కాలంలోనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ఫెయిల్‌ అయిందని చెప్తున్న బీఆర్ఎస్‌ పార్టీ అధికార కాంగ్రెస్‌ పార్టీ లోపాలను ఈ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఈ సభను గతంలో కంటే భిన్నంగా నిర్వహించాలని భావిస్తుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించ ఈ సమావేశంలో పార్టీ ఓటమికి గల కారణాలు, భవిష్యత్తులో పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించనున్నారు. అలాగే భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించి వాటిని ఏ విధంగా అమల్లో పెట్టాలనేది పార్టీ అధినేత దిశా నిర్ధేశం చేయనున్నారు. ఆ తర్వాత జిల్లాల వారికిగా కమిటీల నిర్మాణ, గ్రామీణ స్థాయికి పార్టీని తీసుకెళ్లడం చేయాలని భావిస్తోంది. అయితే వరంగల్‌ జిల్లాలో పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉన్నందున సమావేశానికి అనుమతి వస్తుందా లేదా అనేది సందిగ్ధంగా మారింది. సభకు అనుమతి ఇవ్వాలని రెండు సార్లు పార్టీ నాయకులు జిల్లా పోలీస్‌ అధికారులను కలిసి కోరినప్పటికీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. వారం రోజుల్లో అనుమతిపై సమాధానం ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Also Read :  సోషల్ మీడియాలో ఎక్కువ చేస్తే.. వాళ్లకు అదే ఆఖరి రోజు.. చంద్రబాబు మాస్ వార్నింగ్

ఇక తెలంగాణ ఉద్యమం ముఖ్యంగా సాంస్కృతిక ఉద్యమంగానే ప్రజల్లోకి వెళ్లింది.ఆట,పాట, మాట అనే కాన్షెఫ్ట్‌తో ఉద్యమం సాగింది. బీఆర్‌ఎస్‌ కూడా మొదటి నుంచి సాంస్కృతిక రంగానికి పెద్ద వేస్తూ వచ్చింది. తెలంగాణ ధూంధాం పేరుతో రసమయి తదితరులు పార్టీకి సాంస్కృతిక సారధ్యం వహించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రసమయిని సాంస్కృతిక సారథి చైర్మన్‌గా కూడా కేసీఆర్‌ నియమించారు.అలాగే ఉద్యమ కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి గౌరవించారు. రసమయికి కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు కేసీఆర్‌. కాగా బీఆర్‌ఎస్‌ 25 ఏండ్ల సభ సందర్భంగా రసమయి మరోసారి తన గళానికి పదును పెట్టారు. "గులాబీల జెండా పట్టి..మల్లేశో...గుండెకద్దుకోని రార మల్లేశో...ఓరుగల్లు మహాసభకు మల్లెశో..ఊరువాడ కదలిపోరా మల్లేశో' అంటూ మరసారి తన గళాన్ని వినిపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో దుమ్ము రేపుతోంది. కాగా పోలీసుల అనుమతి లభిస్తే బీఆర్‌ఎస్‌ సభ ఘనంగా జరిగే అవకాశాలున్నాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

Advertisment
Advertisment
Advertisment