KTR Vs Revanth: రేవంత్ అఫైర్లు బయటపెడతా.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

రేవంత్.. నీ ఎఫైర్స్ బయటపెట్టాలా అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేశారు. అడ్డమైన వాళ్లతో తమకు లింకులు పెట్టినప్పుడు రేవంత్‌కు విలువలు గుర్తుకు రాలేదా? అంటూ ధ్వజమెత్తారు.

New Update

రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్‌ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ లో వ్యక్తిగత ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రికి ఇప్పుడు కుటుంబం గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. అడ్డమైన వాళ్లతో మాకు లింకులు పెట్టినప్పుడు రేవంత్‌కు విలువలు గుర్తుకు రాలేదా? అంటూ ధ్వజమెత్తారు. రేవంత్.. నీ ఎఫైర్స్ గురించి జనాలకు చెప్పాలా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా-ఈ వ్యవహారాన్ని నీ రేవంత్ వదిలినా తాము వదలమన్నారు. ఫార్ములా-ఈ రేస్ ను ఏకపక్షంగా రద్దు చేయడంపై కచ్చితంగా తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ ఉంటుందని హెచ్చరించారు. 
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: బీజేపీ ఎంపీకి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్.. పోలీసులకు ఏం చెప్పారంటే

ఢిల్లీకి రేవంత్ మూటలు..

రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడని ఎద్దేవా చేశారు. ఖర్గే, రాహుల్, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్ కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీగా ఉన్నారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజాసింగ్ చేసిన కామెంట్స్ ను ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నించారు. రాజాసింగ్ ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Telangana: నేడు అసెంబ్లీలో రెండు చరిత్రాత్మక బిల్లులు

సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ అని అన్నారు. అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పెడితే.. ఎలా శిక్షిస్తారో రేవంత్ చెప్పాలన్నారు. కాంగ్రెస్ తో పాటు బీజేపీ నేతల బాగోతాలు కూడా తమ దగ్గర ఉన్నాయన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న తమకు ఎవరు ఎంటో అన్నీ తెలుసన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన జరుగుతుంటే.. రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. కేటీఆర్ చేసిన ఈ ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు ఎలా స్పందిస్తారనే అంశంపై తెలంగాణ పాలిటిక్స్ లో ఉత్కంఠ నెలకొంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..ఆయన డుమ్మా?

టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది

New Update
 HCA vs SRH

HCA vs SRH

SRH vs HCA :  టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం ముదిరి ముదిరి పాకాన పడింది. దీంతో ఈ  వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది. అయితే విచారణ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం తాత్కళికంగా సద్దుమణిగినట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

 ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌ టికెట్ల విషయంలో వేధింపులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అయితే  ఈ విచారణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానని ఆయన విజిలెన్స్ అధికారులుకు సమాచారం అందించారట. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరవుతానని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఇక హెచ్‌సీఏ సెక్రటరీ బస్వరాజు నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అనంతరం బస్వరాజు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అలాగే విజిలెన్స్ అధికారులు స్టేడియంలోనే విచారణ కొనసాగించారు. మరోవైపు..ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ నుంచి వెళ్లిన టికెట్లు ఎన్ని.. కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని.. వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా..వీటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

 మంగళవారం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్‌ జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం అయ్యాయి. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదించింది. పాత ఒప్పందం ప్రకార‌మే స్టేడియం సామ‌ర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంట‌రీ పాసులను హెచ్‌సీఏకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదాల‌న్నీ ముగిశాయని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్‌ ప్రక‌టించాయి.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
 

Advertisment
Advertisment
Advertisment