Dharani Portal: ధరణిపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

TG: ధరణి పోర్టల్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ధరణి సమస్యలపరిష్కార బాధ్యతలను అదనపు కలెక్టర్‌(రెవెన్యూ), రెవెన్యూ డివిజన్‌ అధికారి(ఆర్డీవో)లకు అప్పగించింది.  మార్గదర్శకాలు విడుదల చేస్తూఉత్తర్వులు జారీ చేసింది. 

New Update
Dharani Portal: ధరణి పోర్టల్ పై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

Dharani Issue: ధరణి పోర్టల్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ధరణి సమస్యల పరిష్కార బాధ్యతలను అదనపు కలెక్టర్‌(రెవెన్యూ), రెవెన్యూ డివిజన్‌ అధికారి(ఆర్డీవో)లకు అప్పగించింది.  మార్గదర్శకాలు విడుదల చేస్తూఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవల ప్రజాపాలన కింద తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ధరణి పోర్టల్ కు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దాదాపు లక్షకు పైగా ఫిర్యాదు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ సమస్యలపై దృష్టి సారించిన ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కార బాధ్యతలకు అదనపు కలెక్టర్ కు అందించింది.

ధరణి బదులుగా భూదేవి...

ఎన్నికల సమయంలోనూ ఆనాడు ప్రతిపక్షలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ధరణి పోర్టల్ పై అనేక ఆరోపణలు చేశాయి. ధరణి పోర్టల్ ఒక ప్రవేట్ కంపెనీ వ్యక్తులతో ఎలా నడుపుతారని విమర్శలు చేసింది. అయితే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను రికార్డులు డిజిటల్ చేయడం కోసం, రిజిష్రేషన్స్ ను సులభతరం చేసేందుకు ధరణి పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఏదైనా భూమికి సంబంధించిన సమస్యలు తలెత్తితే.. దాని పరిష్కార బాధ్యతలను ఆయా జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది. 

అయితే.. ధరణి పోర్టల్ ద్వారా సమస్యలు తగ్గడం పక్కకి పెడితే పెరుగుతున్నాయని.. భూములను సులభంగా కొట్టేసేందుకే బీఆర్ఎస్ పార్టీ ధరణి పోర్టల్ ను తెచ్చిందని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆరోపణలు చేశాయి. ఇదిలా ఉంటే తాము అధికారంలోకి వచ్చిన తరువాత ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటన చేసింది. ధరణి పోర్టల్ బదులుగా భూదేవి పోర్టల్ ను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ధరణి పోర్టల్ కు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ధరణి సమస్యల పరిష్కారం, భూదేవి పోర్టల్ అమలు వంటి వాటిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ధరణి పోర్టల్ ను రద్దు చేసి.. దాని స్థానంలో భూదేవి పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment